NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
బారాముల్లా లో భారీ ఆయుధాల పట్టివేత
బారాముల్లా జిల్లా ఉరి లోని రాంపూర్ సెక్టార్ లోని హత్లంగా ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు ఆయుధాలను సిద్ధం చేస్తున్నారని రెండు వారాలుగా అందుతున్న ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ఆధారంగా ఆ ప్రాంతాలలో అనేక చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించారు మరియు నియంత్రణ రేఖ వెంబడి చాలా చోట్ల శోధించారు.డిసెంబర్ 23న ఎనిమిది గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఈ ఆపరేషన్స్ లో భారత సైన్యం తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా పాల్గొన్నారు.
కొన్ని స్టోర్లలో యుద్ధ తరహాలో 24 మ్యాగ్జైన్ లతో కూడిన 8 ఏకెఎస్ 74 రైఫిళ్ళు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు,24 మ్యాగ్జైన్ లతో కూడిన 12 చైనీస్ పిస్టోల్స్,224 లైవ్ పిస్టల్స్ రౌండ్లు,14 పాకిస్థాన్, చైనా గ్రెనేడ్లతో పాటు పాకిస్థాన్ జెండా తో కూడిన 8 1 బెలూన్ లను స్వాధీనం చేసుకున్నారు.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందారు
23/12/2022 శుక్రవారం రోజున సిక్కిం లో చాలా విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. 16 మంది సైనికులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు మరియు 4 సైనికులు గాయాలపాలయ్యారు.
ఉదయం తూర్పు సిక్కిం లోని ఛత్తాన్ లో బయలుదేరి థంగు వైపు 3 వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా జీమాలో మలుపునును దాటే సమయంలో బాగా ఏటవాలుగా ఉన్న ఒక కొండ పై నుండి ఒక వాహనం జారి పడిపోయింది.
ఈ ప్రమాదంలో 3 జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో సహా మొత్తం 16 మంది సైనికులు దుర్మరణం చెందారు.మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన నలుగురిని వాయు మార్గంలో వైద్యం కోసం తరలించారు.
ఈ సంఘటన గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి ముర్ము గారు దిగ్భ్రాంతికి గురయ్యారు.వారి సంతాపాన్ని తెలియజేశారు.
రాజ్నాథ్ సింగ్:
నార్త్ సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.
వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
నరేంద్ర మోడీ:
సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
ముర్ము:
సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గురించి తెలుసుకుని బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
LTTE(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ప్రస్థానం.
LTTE గురించి తెలుసుకోవాలంటే అసలు దాని స్థాపనకు కారణమైన శ్రీలంక తమిళుల మరియు సింహళీయుల గొడవలకు కారణం తెలుసుకోవాలి.దాని కోసం అసలు శ్రీలంక తమిళుల చరిత్ర గురించి మనం తెలుసుకుందాం....
శ్రీలంక తమిళుల చరిత్ర
శ్రీలంక తమిళులు వీరినే సిలోన్ లేదా ఈలం తమిళులు అని కూడా పిలుస్తారు.వారు శ్రీలంక లోని ఉత్తర ప్రావిన్స్ లో మెజారిటీ గా ఉన్నారు.దాదాపుగా 70% తమిళులు ఈ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు.తూర్పు ప్రావిన్స్ లో కూడా ఎక్కువగానే జీవిస్తున్నారు.అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మైనారిటీ లో ఉన్నారు.వీరిలో ఎక్కువ మంది హిందువులు కాగా కొంత మంది క్రైస్తవ్యం లోకి మారిన వారు కూడా ఉన్నారు.
పూర్వం నుండి వారి ఉనికి శ్రీలంక లో లేదని కొంత మంది వాదిస్తారు.కానీ ఈ శ్రీలంక తమిళులు శ్రీలంకకు ఉత్తరాన ఉన్న జాఫ్నా రాజ్యం పాలకుల యొక్క జాఫ్నా రాజ్యం నుంచి వచ్చారునీ,మానవ శాస్త్ర మరియు పురావస్తు ఆధారాల ప్రకారం క్రీ.పూ.2వ శతాబ్దం నుండీ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నారనీ తెలియజేస్తున్నాయి.జాఫ్నా రాజ్యం లో
తమిళ సాహిత్యం శాస్త్రం,మతం మరియు ఇతర అంశాలలో అభివృద్ధి చెందింది.తమిళనాడులో ఇప్పుడు వాడుకలో లేని పదాలు కూడా శ్రీలంక తమిళులలో వాడుకలో ఉన్నాయి.
కె.ఇంద్రపాల ప్రకారం సాధారణ యుగానికి శతాబ్దాల ముందు మధ్యశిలా యుగంలోనే దక్షిణ భారత దేశం నుండి సాంస్కృతిక వ్యాప్తి,ప్రజల వలసల వల్ల ప్రాకృతం మరియు తమిళ భాషలు విస్తరించాయి.ఈ సమయంలో శ్రీలంక ద్వీపం లో తమిళ భాషని రాయడానికి తమిళ బ్రాహ్మీ మరియు తమిళ ప్రాకృతి భాషలు ఉపయోగించబడ్డాయి.ప్రోటోహిస్టారిక్ కాలంలో (1000-500 BCE) శ్రీలంక సాంస్కృతికంగా దక్షిణ భారతదేశంతో ఐక్యమైంది మరియు అదే మెగాలిథిక్ ఖననాలు, కుండలు, ఇనుము సాంకేతికత, వ్యవసాయ పద్ధతులు మరియు మెగాలిథిక్ గ్రాఫిటీలను పంచుకుంది.
ద్వీపం యొక్క పశ్చిమ తీరంలోని పాంపరిప్పు మరియు తూర్పు తీరంలోని కతిరవెల్లిలో మెగాలిథిక్ స్మశాన వాటికల వద్ద బయటపడ్డ ఆధారాలు పాండ్య రాజ్య స్మశాన వాటికలతో సారూప్యత కలిగి ఉన్నాయి.ఇవి క్రీ.పూ.5వ శతాబ్దం నుండి క్రీ.శ.2వ శతాబ్దం మధ్యలో స్థాపించబడ్డాయి.క్రీ.పూ.1300 నాటి ఉత్తర తీరంలోని కందరోడై (కదిరమలై)లో అరికమేడు మాదిరిగానే తవ్వినప్పుడు సిరామిక్ వస్తువులు కనుగొనబడ్డాయి.క్రీ.పూ. 10వ శతాబ్దం నుండి దక్షిణ భారత దేశం మరియు శ్రీలంక లో ఖననం చేసే విధానాలు ఒకే విధంగా ఉన్నట్టు కనుగొన్నారు.శ్రీలంకలో, బ్రాహ్మీయేతర చిహ్నాలను కలిగి ఉన్న నలుపు మరియు ఎరుపు సామాను క్రీ.పూ.10వ శతాబ్దంలో తయారు చేసినట్టు అనురాధపుర నుండి రేడియోమెట్రిక్ ఆధారాలు ఉన్నాయి.
క్రీ.పూ. 3వ శతాబ్దాలలో దక్షిణ భారతంలో తమిళ బ్రాహ్మీశాసనాలలో కనిపించే కో అటాన్,కో పుటివిరా మారియు కో రా-పుమాన్ వంటి పేర్లతో సరిపోయేలా జాఫ్నా జిల్లాలో అనైకోడ్డైలో తవ్వకాలలో బయటపడ్డ ఇనుప యుగం నాటి అధినేత అస్థిపంజరంతో ఉన్న ముద్ర పైన కో వేటా అనే పేరు చెక్కబడింది.కో ఆంటే తమిళంలో రాజు అని అర్ధం.14వ లేదా 15వ శతాబ్దానికి చెందిన సింహళీయుల నంపోటా ఆధునిక ట్రింకోమలీ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో సహా మొత్తం తమిళ రాజ్యాన్ని దేమల-పట్టాన (తమిళ నగరం) పేరుతో తమిళ ప్రాంతంగా గుర్తించిందని సూచిస్తుంది.
ఇంకా వీరి చరిత్రకి సంబంధించిన ఎన్నో సాహిత్య మరియు పురావస్తు ఆధారాల ప్రకారం తమిళులకి ఇక్కడ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నట్టు తెలియజేస్తున్నాయి.
శ్రీలంక తమిళులకు మరియు సింహళీలకు మధ్య విభేదాలు:
శ్రీలంకలో తమిళులకు మరియు సింహళీలకు మధ్య ఘర్షణలు వలస రాజ్యాల పాలనలో మొదలైంది.బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అనే పద్ధతిని అనుసరించడానికి రెండు జాతుల మధ్య విభేదాలను సృష్టించారు.శ్రీలంక తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా ప్రాంతంలో ఆంగ్ల విధ్యని బోధించడానికి మిషన్ సిలోన్ పేరుతో ఆంగ్ల భాష పాఠశాలలను స్థాపించారు.అయితే ఈ విధ్యతో తమిళులు ఆంగ్ల నైపుణ్యాలను నేర్చుకునేవారు.అలాగే ప్రభుత్వ రంగంలో ఎక్కువ అవకాశాలు పొందేవారు.పైగా సివిల్ సర్వీసెస్ కి ఖచ్చితంగా ఆంగ్ల భాష ఉండాలనే నిబంధన ఉండేది.దీంతో ధనిక తమిళులు ఎక్కువగా ప్రభుత్వ అవకాశాలు పొందేవారు.
కానీ ఇవన్నీ సింహళీయులలో తమిళుల ఉంచి పైన ఆగ్రహాన్ని పెంచేవి.వారు తమిళులతో ఎందులోనూ పోటీకి రాలేకపోయేవారు.శ్రీలంక దీవిలో మెజార్టీ గా ఉన్న తమకి ఎటువంటి అవకాశాలు దక్కేవి కాదు.దాంతో వారిని ఈ కారణాలు చాలా అసంతృప్తి కి గురి చేసేవి.సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు సింహళీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ DCRA గూనెతిల్లెకె బ్రిటిష్ వారు తక్కువ సంఖ్యలో ఉన్న తమిళుల పైన ప్రేమని చూపించేవారనీ, సింహళీల పైన వివక్షని చూపించేవారనీ,దాని వల్ల సింహళీలకు విద్య మరియు ఆర్ధికంగా వెనకబడ్డారని తెలిపారు.పైగా క్రిస్టియానిటి కి పెద్ద పీట వేస్తూ,దేశ ప్రధాన మతమైన బౌద్ధ మతాన్ని అణచివేయాలని చూడడం వారి మనోవేదన తీవ్రతరం చేసింది.
ఇవన్నీ కాకుండా మత మార్పిడి మిషనరీలు పెరగడం వల్ల తమిళ ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగింది.ఈ మిషనరీ కార్యకలాపాలు ఎదుర్కొనడానికి సొంత పాఠశాలు, దేవాలయాలు నిర్మించుకుని, సంఘాలుగా ఏర్పడి సాహిత్యాన్ని ప్రచురించేవారు.ఈ ప్రయత్నం వారిని సంఘటితంగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేసింది.19వ శతాబ్దం మధ్య కాలంలో సాంస్కృతికంగా, మతపరమైన మరియు భాషాపరమైన సమాజంగా ఏర్పడడానికి కారణం అయింది.
శ్రీలంక లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత తమిళులకీ,సింహళీయులకీ మధ్య జాతి ఉద్రిక్తత నెలకొంది.
1815లో బ్రిటన్ నియంత్రణ లోకి వచ్చిన తర్వాత 1833 లో ముగ్గురు యురోపియన్ లు,ఒక సింహళీయుడు,ఒక బర్గర్ మరియు ఒక తమిళుడితో గవర్నర్ కి సలహాదారుగా ఒక్కొక్కరితో ఒక్కో శాసన మండలి ఏర్పాటు చేశారు.1931లో డోనమ్ మోర్ కమిషన్ కి సలహా మండలి ప్రవేశపెట్టారు.అప్పటి నుండి శ్రీలంక లోని రెండు మెజార్టీ ప్రజల మధ్యన ప్రాతినిథ్యం, ప్రభుత్వ నిర్మాణం మరియు అధికార భాగస్వామ్యం గురించి వివాదాలు ఏర్పడ్డాయి.దీని ఫలితంగా అంతర్జాతి శత్రుత్వం ఏర్పడ్డాయి మరియు అవి పెరుగుతూ వచ్చాయి.
తమిళ జాతి వారైన పొన్నంబలం అరుణాచలంగారిని జాతీయ శాసన మండలి లో సింహళీయులతో సహా మొత్తం శ్రీలంక ప్రజలకు ప్రతినిధిగా నియమించినప్పుడు మొదట్లో తమిళులు మరియు సింహళీయుల మధ్యన స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.దాంతో వారి మధ్య ప్రత్యామ్నాయం గా కొలంబో స్థానాన్ని సృష్టించారు.సార్వత్రిక ఎన్నికలు తీసుకొని వచ్చింది.కానీ తమిళులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఎందుకంటే జనాభా పరంగా చూసుకుంటే తమిళులు తక్కువగా ఉండడం వల్ల పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యం ఉండదని గ్రహించి వ్యతిరేకించారు.తమిళ సంఘం నాయకుడు పొన్నంబలం అరుణాచలం సింహళీయులకు 50%-తమిళిలతో సహా మిగిలిన వర్గాలందరికీ 50% ప్రాతినిధ్యం అందించాలని సోల్బరీ కమిషన్ కి ప్రతిపాదించబడింది.కానీ అది తిరస్కరించబడింది.
స్వాతంత్ర్యం తర్వాత తమిళులు మరియు సింహళీయులను డి.ఎస్.సేనానాయకే తన చాతుర్యంతో సమతుల్యం చేసారు.తర్వాత పొన్నబలం తను స్థాపించిన ఆల్ సిలోన్ తమిళ్ కాంగ్రెస్ పార్టీతో సహా డి.ఎస్.సేనానాయకే యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రభుత్వం లో చేరారు.ఈ ప్రభుత్వం 1948లో సిలోన్ పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు.కానీ దీని వలన ఆంగ్లేయులు పనుల కోసం భారత దేశం నుండి తీసుకెళ్ళిన ప్రజలకు మాత్రం పౌరసత్వం లభించలేదు.
శ్రీలంక ప్రభుత్వం కేవలం మెజారిటీ సింహళీయులకు మాత్రమే ప్రాతినిధ్యం లభించేది.మైనార్టీ ప్రజలకు ఎటువంటి అవకాశాలు దక్కేవి కావు.ఈ చట్టం వల్ల ఎస్.జె.వి.చెంగల్వ నాయకత్వం లో కొత్తగా ఏర్పడిన ఫెడరల్ పార్టీ మరియు మార్క్సిస్టు గ్రూపులు తమిళ కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా విమర్శించాయి.మరియు చెంగల్వ నాయకం మైనారిటీలను అణగదొక్కుతున్నారంటూ ఆ చట్టం పైన శ్రీలంక సుప్రీం కోర్టు లోనే కాక ఇంగ్లాండ్ ప్రీవీ కౌన్సిల్ లో పెట్టారు.కానీ దాన్ని రద్దు చేయలేకపోయారు.
తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తమిళ కాంగ్రెస్ కి ఉన్న నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు కైవసం చేసుకుంది.మళ్ళీ 1956లో జరిగిన ఎన్నికలలో తమిళ జిల్లాలలో ఆధిపత్య పార్టీగా అవతరించడమే కాక రెండు దశాబ్దాల పాటు అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది.తమిళ హక్కుల కోసం పోరాడడంలో ఏ మాత్రం వెనకాడకపోవడమే ఇందుకు కారణం.
1956లో మెజారిటీ సింహళీయుల మద్దతుతో సోలోమనై బండారు నాయకె ప్రభుత్వాన్ని స్థాపించాడు.ఈ కొత్త ప్రభుత్వం కేవలం సింహాళం అనే సింహళాన్ని మాత్రమే శ్రీలంక అధికార భాష గా చేసే చట్టాన్ని చేసారు.దీని ఫలితంగా దాదాపుగా 25 శాతం ఉన్న తమిళులు దీని వలన తమ సంస్కృతికి, భాషకి,మనుగడకి ముప్పు సంభవిస్తుందని భావించారు.దీనికి నిరసనగా ఫెడరల్ పార్టీ శాంతియుతంగా నిరసనలు తెలియజేసారు.కానీ జాతీయ వాదుల పేరుతో వారి పైన దాడులు చేసి వారిని చెల్లాచెదురుగా పారిపోయేలా చేసారు.తర్వాత ఈ గొడవలు జాతుల మధ్య గొడవగా మారింది.దేశంలో తూర్పున గలై ఓయా ప్రాంతంలో జరిగిన అల్లర్లలో దాదాపుగా 150 మంది తమిళులు మరణించారు.చివరికి బండారు నాయకే ఆందోళనకారులతో మరియు ఫెడరల్ పార్టీ తో చర్చలు జరిపి చెల్వనాయకం ఒప్పందానికి అంగీకరించారు.దీని ప్రకారం తమిళ మెజారిటీ ప్రాంతాలైన ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో తమిళ భాషని అధికార భాష గా గుర్తించారు.కానీ దీనికి వ్యతిరేకంగా యునైటెడ్ నేషనల్ పార్టీ,జె.ఆర్.జయవర్ధనే నేతృత్వంలో మార్చ ఆన్ క్యాండీ నిర్వహించారు.పైగా దీనికి వ్యతిరేకంగా బౌద్ధ సన్యాసుల నుండి కూడా తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆ చట్టాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
సింహళం మాత్రమే అధికార భాష చట్టంతో వాహనాల పైన నెంబర్ ప్లేట్ ల పైన సింహళ భాషలో శ్రీ అనే అక్షరాన్ని ప్రచురించేలా చేసింది.అయితే ఈ శ్రీ అనే అక్షరానికి వ్యతిరేకంగా ఫెడరల్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.శ్రీ అక్షరాల పైన నల్ల తారు పూయడం ప్రారంభించారు.దీని వలన శ్రీ అనుకూల ప్రచారం చేసే సింహళ ముఠాల ద్వారా తమిళ కార్యాలయాలు,దుకాణాలు,ఇళ్ళు, దక్షిణ ప్రాంత ప్రజలపై ప్రతీకార చర్యలకు దారి తీసింది. కొండ ప్రాంతాల్లో తమిళ భారతీయ యువకులు కూడా శ్రీ వ్యతిరేక ప్రచారం జోరుగా చేసారు.వారు ఒక బస్సు పైన రాళ్ళు రువ్వారు.బస్సు డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్ళాడు.కానీ ఆందోళనకారులు బస్సును వెంబడించి, పోలీస్ స్టేషన్ పైన కూడా దాడికి దిగారు.దాంతో పోలీసులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో ఇద్దరు తమిళులు మరణించారు.కోపానికి లోనైన ఆందోళనకారులు సింహళీయుల ఆస్తుల పైన దాడులు చేస్తూ నాశనం చేయడం ప్రారంభించారు.దీని వల్ల సింహళీయులు కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించారు.ఏప్రిల్ 3న కుహవట్టేలో శ్రీ అనుకూల ప్రచారం ప్రారంభించారు.కానీ అదే రోజున ఇద్దరు సింహళీయులను తమిళ వ్యాపారస్తులు కత్తితో పొడిచి చంపారు.ఫలితంగా తమిళ దుకాణాలు తగలబడిపోయాయి.మరుసటి రోజు హటన్ ప్రాంతంలో ఒక సింహళం వ్యక్తిని తమిళ గుంపు రాళ్ళతో కొట్టి చంపారు.బండారు నాయకే సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ నాయకుడు సవుమియామూర్తి తొండమాన్ ను అల్లర్లను శాంతింపజేయాల్సిందిగా అభ్యర్ధించారు.తొండమాన్ ఆయా ప్రాంతాలకు వెళ్లి విజయవంతంగా ఆపగలిగారు.
అదే సమయంలో లాండ్ డెవలప్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన 300 మంది సింహళీయులు ఆయుధాలు పట్టుకుని ట్రక్కులలో తమిళ గ్రామమైన చెడ్డీకులం కు బయలుదేరారు.వారు అక్కడికి చేరక ముందే నలుగురు సాయుధ తమిళ బృందం ముఠా పైన కాల్పులు జరపడంతో ముఠా అక్కడ నుండి పారిపోయారు.
అదే సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ ట్రింకోమలీలో తన స్థావరాన్ని నిలిపివేయడంతో 400 మంది తమిళ కార్మికులు ఏ ఆధారం లేని వారయ్యారు.వీరికి పులోనరువా జిల్లాలో పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అక్కడ సింహళీయులకు ఆగ్రహం కలిగి సింహళ కార్మిక ముఠాలను ఏర్పరచుకుని తమిళుల పైన దాడులు చేస్తామంటూ బెదిరించారు.
ఏప్రిల్ 14న ట్రింకోమలిలో జాతి గొడవల్లో ఒక తమిళుడు సింహాళుడిని హత్య చేసాడు.దీని వలన ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ అవి పెద్దవి కాలేదు.కాకపోతే బౌద్ధులు మాత్రం సింహళీయుల వద్ద తమిళులు ఉండకూడదని పట్టుబట్టారు.
ఏప్రిల్ 24న వెలిమడలో జాతీయవాది కె.ఎం.పి.రాజారత్నే ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో తమిళ వ్యాపార సంస్థలపై అనేక దాడులు జరిగాయి.అంతేకాకుండా సింహళీయేతర బౌద్ధులు ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలకు తరలివెళ్ళకపోతే వారి పైన దాడులు చేస్తామని కరపత్రాలను ప్రభుత్వ ప్రతినిధులకు,ప్రజా ప్రతినిధులకు అందిస్తూ తమ జాత్యహంకారాన్ని ప్రకటించుకున్నారు.
మే 15న ఒక తమిళ వ్యక్తి ఇంటి పైన బాంబు విసిరిన తర్వాత,ఒక సింహళీయుడి హత్య మరియు మరొక సింహళీయుడి కత్తి పోట్లతో తీవ్ర గాయాలపాలవడం జరిగింది.మరణించిన వ్యక్తి శరీరాన్ని అతని స్వస్థలం మాతర కు పంపించారు.అక్కడ కూడా ఉద్రిక్తితలు చెలరేగాయి.
వవునియాలో ఫెడరల్ పార్టీ సమావేశం జరగాల్సి ఉంది.అయితే దానికి రైలు మార్గం లో వచ్చేవారిని ఆపాలనీ,ఇబ్బందులు పాలు చేయాలనీ కరడుగట్టిన సింహళీయవాదులు ఆలోచించారు.మే 22న పోలిన్నరువా స్టేషన్ పైన మొదటి దాడి జరిగింది.ఆ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు ముందుగానే దిగిపోయారు.కానీ ఆందోళనకారులకు ఒక వ్యక్తి దొరికాడు.అతను తాను తమిళుడిని కాదనీ ఎంతగా చెప్పినప్పటికీ అతనిని చితకబాదారు.
మే 23న తమిళులు ఎక్కువగా ఉండే బట్టివలోకాలో రాత్రి సమయంలో ఒక మెయిల్ పట్టాలు తప్పింది.అందులో ఎక్కువ ప్రయాణీకులు సింహళీయులు.వారే దాడికి గురయ్యారు.పోలీస్ సార్జెంట్ అప్పుహమీ,విక్టర్ ఫెర్నాండో, కానిస్టేబుల్ పరరాజసింహ అనే ముగ్గురు వ్యక్తులు మరణించారు.అక్కడ ఏ జాతి వారు దాడులు చేశారు అనేది పూర్తిగా తెలియనప్పటికీ తమిళుల ప్రాంతం కనుక పోలిన్నరువా ప్రాంతంలో జరిగిన దాడికి ప్రతీకార దాడి అయి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం.
మే 24న పోలొన్నరవా లో తమిళుల పైన తీవ్రమైన దాడులు జరిగాయి.బహిరంగంగా తమిళులు హత్య కాబడ్డారు.ఈ గొడవల్లో గుర్తు తెలియని వ్యక్తులు కూడా మరణించారు.సింహళ సైన్యం వివిధ రాష్ట్ర శాఖల నుండి వచ్చిన కార్మికులతో కూడిన సైన్యం విధ్వంసాన్ని సృష్టించి రేప్ చేయడం, దోచుకోవడం, తమిళుల పైన తీవ్రమైన దాడులు చేయడం లాంటివి చేశారు. కొంత మంది సింహళీయులు తమిళులను దాచడానికి ప్రయత్నించారు.అలా దాస్తున్నారని అనుకలిగిన వారిని కూడా ఆందోళనకారులు విడిచిపెట్టలేదు.అదనపు బలగాల కోసం అభ్యర్ధించినప్పటికీ పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు.పోలీసులు కాల్పులు జరపరన్న నమ్మకంతో అల్లరి మూకలు మరింత రెచ్చిపోయారు.మరొకసారి పోలోన్నరువా స్టేషన్ పైన దాడి జరిగింది.ఈసారి స్టేషన్ మొత్తం ధ్వంసం కాబడింది.
ఎరావూరులో ఆరోజు సాయంత్రానికి తమిళుల హింస బాగా పెరిగిపోయింది.నువారా ఎలియా మాజీ మేయర్ డి.యె.రత్న ఆ రాత్రి తన కల్కుడాలోని తన ఎస్టేట్ కి వెళ్తుండగా కాల్చి చంపబడ్డారు.అయితే ఇది కేవలం వ్యక్తిగత హత్య అని తమిళ రాజకీయ నాయకులు వాదించారు.
మే 25న ఎరావూరులో ఒక సింహళీయ పోలీస్, ముగ్గురు సింహళీయులు తమిళుల దాడిలో మరణించారు.
పోలన్నరువా పొలాల్లోని తమిళ కూలీలపై సింహళీయ ముఠాలు రాత్రి పూట దాడి చేసాయి.వారిని చూసిన తమిళులు చెరుకు తోటల్లో దాక్కున్నారు.అయితే అది గమనించి చెరుకు తోటలకు నిప్పంటించి వారిని బయటకొచ్చేలా చేసి దొరికిన వారిని దొరికినట్లు పిల్లలు, స్త్రీలు, పురుషులు అని పట్టించుకోకుండాఇంట్లో తయారు చేసిన కత్తులు,గడ్డికోసే కత్తులు మరియు కట్టర్లతో నరికేసారు.పారిపోయిన వారిని కూడా తీవ్రంగా గాయపర్చారు.హింగురక్ గోడలో ఎనిమిది నెలల గర్భవతి పొట్టని చీల్చి చంపారు.భయంతో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఆరాత్రి 70 మంది మరణించి ఉంటారని ఒక అంచనా,ఇది నిజం కాదని మరొక వాదన కూడా ఉన్నాయి.
మే 26న పోలన్నురువాలోని తమిళ శరణార్ధులను పోలీస్ స్టేషన్ లో ఉంచి, పోలీసులు కాపలాగా ఉన్నారు.స్టేషన్ లో సమావేశమైన సింహళీయులు రాత్రి పూట దాడి గురించి చర్చించుకుంటున్నారు.పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్న పోలీసులు కేవలం కొద్ది మంది మాత్రమే.కానీ మధ్యాహ్నం 2 గంటలకు 25 మంది సైనిక బృందం పోలీసులకు తోడయ్యారు.అది గమనించిన సింహళీ గుంపు మరింత మంది వచ్చేలోగా దాడి చేయాలనుకున్నారు.మధ్యాహ్నం 3.20 ప్రాంతంలో వారు పోలీస్ స్టేషన్ వైపు వచ్చారు.సైన్యం వారిని హెచ్చరించడానికి కాల్పులు జరిపారు.కానీ అది కేవలం భయపెట్టడానికి మాత్రమే అని భావించిన ఆందోళనకారులు ముందుకు కదిలారు.పొలన్నరువా జిల్లా ప్రభుత్వ అధికారి కాల్పుల ఉత్తర్వు పైన సంతకం చేయడంతో 3000 మంది సింహళీ గుంపు పైన కాల్పులు జరిపారు.అందులో ముగ్గురు చనిపోగా మిగిలిన వారు చెల్లా చెదురైపోయారు.
కురునేగల, దంబుల్లా, గలేవెల, పాణదుర వంటి ప్రాంతాల్లో కూడా తమిళులపై హింస జరిగింది. ఆ ఉదయం 10 గంటలకు, పోలీసు సార్జెంట్ అప్పుహామి మరియు D. A. సెనెవిరత్నే మరణ వార్త వ్యాప్తి చెందడంతో, కొలంబో మరియు దాని శివార్లలోని అనేక ప్రాంతాల్లో సింహళ ముఠాలు తమిళుల పైన దాడులు ప్రారంభించాయి,దుకాణాలను తగలబెట్టి దోచుకున్నారు.దోపిడీలు,దహనాల వరకే అప్పటి దాడులు పరిమితమయ్యాయి.
ఆ సాయంత్రం, ప్రధాని బండారునాయకే దేశానికి శాంతి కోసం పిలుపునిచ్చాడు. ఏది ఏమైనప్పటికీ, బట్టికలోవా జిల్లాలో జరిగిన హత్యలను, ప్రత్యేకించి D. A. సెనెవిరత్నే హత్యను మతపరమైన హింసకు కారణంగా పేర్కొనడం ద్వారా తమిళుల పైన అల్లర్లను ప్రారంభించారని అతను సూచించాడు.
బండారు నాయకె పిలుపు తమిళ వ్యతిరేక అల్లర్లను మరింత తీవ్రతరం చేసాయి.అప్పటి వరకు దాడులు,దహనాలకు పరిమితమైన అల్లర్లు ఇప్పుడు హత్యలు,మానభంగాలతో చెలరేగిపోతున్నాయి.తూర్పు ప్రావిన్స్ లోని తమిళ అల్లరి మూకల చేత సముద్రంలోకి తరిమివేయబడ్డ సింహళ జాలర్లు తిరిగి రావడంతో కొలంబో నుండి మాతర వరకు తీరం వెంబడి తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి.
బట్టికలోవా లో తమిళులు ఒక మహిళా టీచర్ ని రొమ్ములు కోసి హత్య చేసారనే పుకారు వ్యాపించింది.ఈ పుకారుతో రెచ్చిపోయిన సింహళ అల్లరి మూకలు ఒక హిందూ ఆలయాన్ని థగలబెట్టడానికి ప్రయత్నించారు.కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుని దాని లోపలి పూజారిని బయటకి లాగి సజీవంగా తగలబెట్టారు.కానీ ఆ తర్వాత టీచర్ పైన జరిగిన దాడి కేవలం కల్పితమని తేలింది.సింహళీయుల ముఠాలు తమిళుల కౌసం కొలంబో అంతా వెదుకుదున్నాయి.వారిని గుర్తించడం ఎలాగంటే వారు ధరించే ప్యాంటు మరియు పైన చొక్కాలు.చెవులు కుట్టించబడి ఉండడం.అలాగే సింహళ వార్తా పత్రికలు చదవలేకపోవడం.వీరంతా ఘోరంగా గాయపడ్డారు లేదా హత్యకు గురయ్యారు.వీరిలో ఆంగ్లం చదువుకున్న సింహళీయులు కూడా బలైపోయారు.
ఈ ముఠాలు ఒక పన్నాగాన్ని రచించాయి.శ్రీలంక పోలీసులు లా వచ్చి మీ భద్రత కోసం పోలీస్ స్టేషన్ లకు పారిపోమ్మని చెప్పేవారు.వారు వెళ్ళిపోయాక ఖాళీ ఇళ్ళను దోచుకుని తగలబెట్టేవారు.అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దాడులు, దహనాలు తీవ్రంగా దేశమంతా పెరిగిపోయాయి.పోలీసులు చివరికి అల్లర్లను అణచివేయడానికి ప్రయత్నించారు కానీ మొదటి నుండి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి.కొంత మంది సింహళీయులు తమ పొరుగు తమిళులను దాచిపెట్టి కాపాడుకోడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
పదవీయ నుండి భూ అభివృద్ధి మరియు నీటి పారుదల శాఖకి సంబంధించిన 300 మంది సింహళీయులు తుపాకీలు,చేతి బాంబులు మరియు కత్తులతో ముఠాలుగా ఏర్పడి ట్రక్కులలో అనురాధాపురానికి వెళ్ళాలనుకుని సైన్యాన్ని తప్పించుకొని వెళ్ళడానికి రహదారి ని వదిలి వేరే మార్గాలలో వెళ్ళారు.దారిలో కనిపించిన తమిళుల పైన దాడి చేశారు.కెబిటిగొల్లేవకు దక్షిణాన అల్లరిమూకలను సైన్యం మరియు పోలీసులు అడ్డుకున్నారు.11 మంది అల్లరి మూకలను చంపి,343 మందిని అరెస్టు చేశారు.కొంత మంది ఖైదీలు తమని ఆపకపోయి ఉంటే దక్షిణంగా మాతలే మరియు క్యాండీ కి వెళ్ళి ఉండేవారమని ఒప్పుకున్నారు.
మే 23 మరియు 24 తేదీలలో జరిగిన పోలొన్నరువా సంఘటనల తర్వాత ఎరావురులోని తమిళ అల్లర్లు ఏకాంత సింహళీయ గృహాల పైన,జనాల పైన,వ్యాపారాల పైన దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.ఎరావూరులో రెండు వర్గాల మత్స్యకారులు కొట్టుకున్నారు.తమిళ ముఠాలు రోడ్లను బ్లాక్ చేసి సింహళీయులుగా అనుమానించిన వాహనదారుల పైన దాడులు చేశారు.ఒక సింహళీయ జంటను తగలబెట్టి దోచుకున్నారు.
పాణుదుర పూజారి మరియు తమిళ ఫిస్కల్ క్లర్క్ ల హత్య వార్తలు తెలిసిన వెంటనే హింస తీవ్రతరమైంది.బట్టవలోక జిల్లా అంతటా సింహళీయులను తమిళ అల్లరి మూకలు నిర్దాక్షిణ్యంగా చంపారు.వళైచ్చెనైలో, తమిళ గుంపుల నుండి పారిపోయిన సింహళీయులకు ముస్లింలు ఆశ్రయం కల్పించారు.బట్టవలోక లో మొత్తం 56 దహన,11 హత్యల కేసులు నమోదయ్యాయి.చాలా మంది సింహళీయులు దక్షిణ తీరం వెంబడి సముద్రం ద్వారా మరియు నేల పై నుండి పారిపోయారు.కొంత మంది మాత్రం దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు.వారు అడవి మృగాల వల్ల మరియు ఆకలితో మరణించారు.వారి ఇళ్ళు దోచుకోబడ్డాయి.
మే 28న పాణుదుర పూజారి హత్య వార్త వచ్చినప్పుడు జాఫ్నా కూడా హింసాత్మకంగా మారిపోయింది.మరణాలు జరిగినట్లు రికార్డులు లేకపోయినప్పటికీ సింహళీ వ్యాపారులను తరిమేసి సరుకులను దోచుకున్నారనీ, తగులబెట్టారనీ నివేదించారు.కొన్ని సార్లు ముఠాల ప్రవర్తన కొలంబో లోని నాయకులకు సంబంధాలున్నట్లు అనుమానించేలా చేసాయి.తర్వాత పునర్నిర్మించిన బౌద్ధ నాగ విహారే ఆలయం పై దాడి చేసి, బౌద్ధ సన్యాసిని హతమార్చడానికి ప్రయత్నం చేశారు.కానీ పోలీసులు అడ్డుకున్నారు.రెండు రోజుల తర్వాత కైట్స్ నుండి ఒక ముఠా నైనాతీవు వద్ద ఉన్న నాగ దీప విహారె ఆలయంలోకి ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు.
చివరికి ఈ ఘర్షణల ఫలితంగా ఫెడరల్ పార్టీ మరియు జాతీయ విముక్తి పెరమున రెండూ నిషేధించబడ్డాయి.దేశంలోని చాలా మంది సీనియర్ తమిళ నాయకులను అరెస్టు చేశారు.రెండు రోజుల్లో సైన్యం కొలంబో లో ఇంకా దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులను పునరుద్ధరించారు.దాదాపుగా 12,000 మంది తమిళ శరణార్థులు కొలంబో సమీపంలోని శరణార్థ శిబిరాలకు పారిపోయారు.జూన్ చివరికి జాఫ్నాలో పెద్ద ఎత్తున పునరావాసం కల్పించేందుకు ఆరు యురోపియన్ నౌకలను రహస్యంగా నియమించింది.సైన్యం దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించుకుంది.కానీ జాఫ్నాలో మాత్రం 25 సంవత్సరాలు కొనసాగింది.
1958 సెప్టెంబర్ 3న బండారు నాయకే-చెల్వనాయకం తమిళ భాష చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.దీని ద్వారా తమిళ భాషని బోధనా మాధ్యమంగా,పబ్లిక్ సర్వీస్ లలో ప్రవేశానికి, రాష్ర్ట కరెస్పాండెన్స్ మరియు పరిపాలనా ప్రయోజనాల కోసం పరీక్షలలో మాధ్యమంగా ఉపయోగించడం జరుగుతుంది.
మొత్తానికి 1958 అల్లర్లు మొదటి పూర్తి స్థాయి జాతి ఆందోళనలుగా మిగిలాయి.మరియు ఒకరి పైన మరొకరు నమ్మకాన్ని కోల్పోయేలా చేసాయి.ఈ తప్పుకి రెండు జాతులూ ఎదుటి వారిని నిందించుకున్నారు.తమిళ మెజారిటీ ప్రాంతాల నుండి సింహళీయులు,సింహళీయుల మెజారిటీ ప్రాంతాల నుండి తమిళులు తరిమివేయబడ్డారు.
వేలుపిళ్లై ప్రభాకరన్ తన రాజకీయ ఆలోచనలు చిన్నప్పటి 1958 నాటి సంఘటనల నుండే రూపుదిద్దుకున్నాయని తెలియజేసారు.
"నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు 1958 జాతి అల్లర్ల యొక్క దిగ్భ్రాంతికరమైన సంఘటనలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి.సింహళ జాత్యహంకారులచే మన ప్రజలను నిర్దాక్షిణ్యంగా మరియు క్రూరంగా ఎలా చంపబడ్డారనే భయంకరమైన సంఘటనల గురించి నేను విన్నాను. ఒకసారి నేను ఒక వితంతువు తల్లిని కలిశాను, నా కుటుంబానికి చెందిన స్నేహితురాలు, ఈ జాతి సమూలంగా నాశనం చేసే దాడులు యొక్క తన వ్యక్తిగత అనుభవాన్ని నాకు తెలియజేసింది. అల్లర్ల సమయంలో, కొలంబోలోని ఆమె ఇంటిపై సింహళ గుంపు దాడి చేసింది. అల్లరి మూకలు ఇంటికి నిప్పంటించి భర్తను హత్య చేశారు. ఆమె, ఆమె పిల్లలు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆమె శరీరంపై ఉన్న మచ్చలు చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మరిగే తారులో చిన్నపిల్లలను సజీవంగా ఎలా కాల్చేశారో కూడా నేను కథలు విన్నాను. ఇలాంటి క్రూరత్వ కథలు విన్నప్పుడు, నా ప్రజల పట్ల నాకు లోతైన సానుభూతి మరియు ప్రేమ కలిగింది. ఈ జాత్యహంకార వ్యవస్థ నుండి నా ప్రజలను విముక్తి చేయాలనే గొప్ప అభిరుచి నన్ను ముంచెత్తింది. నిరాయుధ, అమాయక ప్రజలపై సాయుధ శక్తిని ఉపయోగించుకునే వ్యవస్థను ఎదుర్కోవడానికి సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని నేను గట్టిగా భావించాను." అని తన మనసులోని సంఘర్షణను బయటపెట్టారు.
అలాగే తమిళ పూజారిని చంపడం గురించి తమిళుల అభిప్రాయాలు
"మాది దైవభీతితో కూడిన సమాజం మరియు ప్రజలు మతపరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విస్తృత భావన ఏమిటంటే: అతనిలాంటి పూజారిని సజీవ దహనం చేసినప్పుడు, తిరిగి కొట్టే సామర్థ్యం మాకు ఎందుకు లేదు. అది ప్రజలను లోతుగా ఆలోచించేలా చేసింది. ”
LTTE స్థాపనకి దారి తీసిన సంఘటనలు మరియు ఎదుగుదల:
1971లో విశ్వవిద్యాలయాలలో తమిళ విద్యార్థుల సంఖ్య తగ్గించాలని,సింహళం రాజ భాష గా చేసారు.తమిళానికి మాత్రం ప్రతి జిల్లాకు కొంత కోటాను కేటాయించారు.సత్యశీలన్ అనే విద్యార్థి తమిళ్ మనవర్ పెరవై అనే పేరుతో తమిళ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేశారు.
1972లో ప్రభాకరన్,చెట్టి తన బాల సింగం,జాఫ్నాలో తమిల్ న్యూ టైగర్స్ స్థాపించారు.కానీ నాయకుడు తనబాలసింగాన్ని హత్య చేసారు.అతని మరణం తర్వాత ప్రభాకరన్ బాధ్యతలు స్వీకరించారు.
నడరాజాతంగతురై మరియు సెల్వరాజాయోగచంద్రన్(డి.గెరే కుట్టి మణి) కలిసి తమిళ దేశ స్థాపన కోసం ప్రచారం కోసం తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ (టి.ఇ.ఎల్.ఒ) స్థాపించారు.పొన్నుతురై శివకుమారన్ తో కలిసి చాలా దాడులు చేసారు.
1974లో తమిళ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటే ఎటువంటి హెచ్చరికలు లేకుండా సింహళీ పోలీసులు దాడి చేశారు. పోలీసు వల్ల 11 మంది తమిళులు మృతి చెందారు.
శివకుమార్,ప్రభాకరన్ కలిసి దురైయప్ప పైన హత్యాయత్నం చేసారు.కానీ ఆయన తఫ
ఆ తర్వాత 1975 జులై 27న దురైయప్పను ప్రభాకరన్ హత్య చేసారు.
1976 మే 5 ఉమా మహేశ్వర్ నాయకుడిగా,ప్రభాకరన్ కమాండర్ గా తమిళ రాజ్య స్థాపనే లక్ష్యంగా ఎల్.టి.టి.ఈ. స్థాపించడం జరిగింది.తీవ్రవాద నిపుణుడు రోహన్ గుణరత్న ద్వారా TNT(తమిళ్ న్యూ టైగర్స్)/LTTE లను శతృ దుర్భేద్యంగా,ఏ మాత్రం కరుణ లేకుండా అభివృద్ధి చేయాలనుకున్నారు.మొదట్లో పోలీసులు మరియు రాజకీయ నాయకుల పైన కొన్ని దాడులు మాత్రమే చేసారు.క్రమంగా ఆ దాడులను పెంచుకుంటూ చాలా ప్రాంతాల పైన ఆధిపత్యం సాధించారు, వీరి తమిళ దేశ స్థాపన అనే లక్ష్యం వల్ల తమిళ ప్రజల్లో కూడా వీరిపై బాగా నమ్మకం పెరిగింది.
తమిళ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు అప్పా పిళ్ళై అమృత లింగం రహస్యంగా ఎల్.టి.టి.ఈ.కి మద్దతు ఇచ్చేవారు, రాజకీయంగా ఉపయోగపడుతుందనీ, తమిళ ప్రజలను అదుపు చేయవచ్చనీ,పైగా తమిళులకు ప్రభుత్వం తరపు నుంచి మంచి చేయోచ్చనే ఆలోచనతో ఆయన ఈ మద్దతునిచ్చేవారు.ఎల్.టి.టి.ఈ. మొదటి మహిళా సభ్యురాలిగా ఊర్మిళ కందియా చేరారు.
అమృత లింగం ప్రభాకరన్ కు ఎన్.ఎస్.కృష్ణన్ ని పరిచయం చేసాడు, తర్వాత ఎన్.ఎస్.కృష్ణన్ ప్రభాకరన్ కు ఆంటోన్ బాల సింహానికి పరిచయం చేసాడు.1979లో ఎల్.టి.టి.ఈ. ప్రధాన సంధానకర్త, రాజకీయ వ్యూహకర్తగా ఆంటోన్ బాల సింహం అయ్యాడు.
ఎలై.టి.టి.ఈ. నాయకుడు ఉమామహేశ్వరరావు ఊర్మిళ కందియా తో ప్రేమ వ్యవహారం నడిపాడు,అది తమ సిద్ధాంతాలకు వ్యతిరేకమని అతన్ని ప్రభాకరన్ బహిష్కరించాడు.
తర్వాత ప్రభాకరన్ ఉమా మహేశ్వరన్ 1980లో పీపిల్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం(plote)ని స్థాపించాడు.
1980లో జూనియస్ రిచర్డ్ జయవర్ధనే ప్రభుత్వం Tulf అభ్యర్ధన మేరకు జిల్లా అభివృద్ధి మండలి ద్వారా అధికార పంపిణీకి అంగీకరించారు.అంటే వారి ప్రదేశాల్లో వారి నాయకులకు అధికారం లభించేలాగా ఈ ఒప్పందం ఉంటుంది.కానీ ltte మరికొన్ని తిరుగుబాటు గ్రూపులు ప్రత్యేక దేశం కావాలని కోరారు.Tulf మరియు ఇతర తమిళ రాజకీయ పార్టీల పైన ప్రజల్లో నమ్మకం పోయి తిరుగుబాటు సంస్థల్నే ఎక్కువ నమ్మారు.
1983 స్థానిక ప్రభుత్వ ఎన్నికలను బహిష్కరించమని ltte ప్రజలను ఆదేశించింది.ఆ ప్రభావం తో ఆ సంవత్సరం 10% ఓటింగ్ కూడా రాలేదు.1983 తిరునల్వేలిలో ఆత్మాహుతి దాడి చేశారు,ఈ దాడిలో 13 మంది శ్రీలంక సైనికుల మరణించారు.ఈ దాడితో శ్రీలంక సింహళీయులు బ్లాక్ జులై గా పేర్కని తమిళుల పైన దాడి చేసారు,ఈ దాడిలో దాదాపు 3000 మంది తమిళులు మరణించారు.దాంతో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది తమిళులు తిరుగుబాటు గ్రూపులలో చేరారు.
1984లో తమిళనాడు లోని సిరుమలై కాంప్ లో చాలా మంది తిరుగుబాటు దారీ నాయకులు భారత సంస్థ అయిన RAW ద్వారా శిక్షణ పొందారు.32 శిబిరాలలో 495 మంది తిరుగుబాటు దారులకు శిక్షణ ఇచ్చారు.92 మంది మహిళలు కూడా శిక్షణ పొందారు.1983 నుండి మే 1987 వరకు రా వారికి ఆయుధాలను, ధనాన్ని సరఫరా చేసింది.
నిజానికి శ్రీలంక లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమిళ దేశ స్థాపన, తమిళుల కోసం పోరాడడానికి కేవలం ఎల్.టి.టి.ఈ. మాత్రమే కాదు.మరిన్ని తిరుగుబాటు సంస్థలు ఉండేవి. 1984లో ltte అధికారికంగా ఈలం నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(e.n.l.f.),తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ (t.e.l.o.),ఈలం రివల్యూషనరీ ఆరైగనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ (e.r.o.s.),పీపిల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య ఉమ్మడి ఫ్రంట్ లో చేరింది.
మొదట్లో ప్రేమ వ్యవహారాలు నిషేధించి ఎల్.టి.టి.ఈ. 1984లో ప్రభాకరన్ వివాహం తర్వాత ఆ నిబంధన మార్చారు. telo భారత్ తమకు మేలు చేసిందని నమ్మి భారతదేశానికి మద్దతుగా ఉంటే,ltte భారతదేశం తన స్వార్థం కోసం పని చేస్తుంది అని వాదించారు.ఎల్.టి.టి.ఈ. 1986 లో ఈ.ఎన్.ఎల్.ఎఫ్. నుండి విడిపోయింది.వెంటనే TELO తో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.TELO నాయకులతో సహా 400 మందిని L.T.T.E. హత్య చేసారు.
LTTE ఆ తర్వాత EPRLF శిక్షణ శిబిరాల పైన దాడి చేసి జాఫ్నా నుండి పారిపోయారు. TELO,EPRLF లాంటి ప్రధాన తిరుగుబాటు దారీ గ్రూపులను అంతం చేసిన తర్వాత దాదాపు 20 సంస్థలు LTTE లో విలీనం చేసారు.తమిళులకు ప్రత్యేక దేశాన్ని స్థాపించడమే మా లక్ష్యం అని ప్రమాణం చేయడంతో తమిళ ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడింది.
1987లో బ్లాక్ టైగర్స్ అనే ఆత్మాహుతి సంస్థను ఏర్పాటు చేశారు.ఈ సంస్థ ద్వారా సైనిక శిబీరాల పై మొదటి దాడి చేశారు.
1987 జులై లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తమిళుల పైన దాడిని ప్రారంభించింది.
ఇండో-శ్రీలంక ఒప్పందం పై రెండు దేశాలు సంతకం చేశారు.ఈలం పీపుల్స్ రివెల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ ప్రాంతీయ మండలిని నియంత్రిస్తుంది.ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరుతో శాంతి పరిరక్షక దళాన్ని శ్రీలంకకు పంపి నిరాయుధీకరణను అమలు చేయించడానికి ప్రయత్నం చేసింది మరియు ప్రాంతీయ మండలి పైన నిఘా ఉంచింది.
ఇండో-లంక ఒప్పందానికి EPRLF,TELO,EROS మరియు PLOTE వంటి సమూహాలు కూడా అంగీకరించారు.కానీ LTTE దానిని వ్యతిరేకించారు.ఎందుకంటే eprlf నాయకుడు వరద రాజ పెరుమాళ్ళుని విలీనమైన ఈశాన్య ప్రావిన్స్ కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు.కానీ LTTE ఆయన్ని కాదని ముగ్గురు ప్రత్యామ్నాయ అభ్యర్థులను పేర్కొన్నారు, కానీ భారత్ దాన్ని వ్యతిరేకించారు.దాంతో LTTE తమ ఆయుధాలను IPKF కు అప్పగించేందుకు అంగీకరించలేదు.మూడు నెలలు ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
LTTE అక్టోబర్ 1987న IPKF పైన యుద్ధం ప్రకటించింది.అక్టోబర్ 8న భారత రేషన్ ట్రక్కు పై మొదటి దాడి చేశారు.ఐదుగురు పారా కమాండోలను మెడకు ఉరి వేసి చంపారు.జాఫ్నాలో ఆపరేషన్ పవన్ పేరుతో LTTE ని నిరాయుధులను చేయడమే కాకుండా దాడులు ప్రారంభించారు.ఈ దాడులు తమిళులకు పెద్దగా నచ్చలేదు.ప్రేమదాస ప్రభుత్వానికి మద్దతునివ్వడం,తభ దేశ విషయాల్లో భారతీయ జోక్యం చేసుకోవడం సింహళీయులకు కూడా నచ్చలేదు.
1988 ఎన్నికల ప్రచారంలో రణసింగ్ ప్రేమదాస తాను అధ్యక్షుడు గా ఎన్నికైన వెంటనే IPKF ని ఉపసంహరిస్తానని మాట ఇచ్చాడు.ఎన్నికైన తర్వాత 1989 ఏప్రిల్ లో LTTE తో చర్చలు ప్రారంభించారు.IPKF మరియు తమిళ్ నేషనల్ ఆర్మీ తో పోరాడేందుకు LTTE కి ఆయుధాలు మరియు సామగ్రిని సరఫరా చేయమని శ్రీలంక సైన్యానికి చెప్పారు.IPKF దాదాపుగా తన లక్ష మంది సభ్యులతో 1990 లో ప్రేమదాస అభ్యర్ధన మేరకు శ్రీలంక ను విడిచి పెట్టింది.
ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో తమిళులకు అధికారం ఇచ్చేలా శాంతి చర్చలు జరిగాయి.1989 నుండి 1990 వరకూ కాల్పుల విరమణ జరిగింది.కానీ మధ్యలో LTTE తూర్పు ప్రావిన్స్ లో 600 పోలీసులను ఊచకోత కోసారు.1990 దశకం మొత్తం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
1991లో LTTE తమ ఆత్మాహుతి సభ్యురాలితో రాజీవ్ గాంధీ ని భారత మాజీ ప్రధాని మరియు 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణ సింఘే ప్రేమదాసను హత్యలు చేయించారు.1994లో శ్రీలంక అధ్యక్షురాలిగా చంద్రికా కుమార తుంగ ఎన్నికైన తర్వాత LTTEతో చర్చలు చేసిన తర్వాత కొంత కాలం దాడులు ఆగాయి.
ఒకప్పటి ఎల్.టి.టి.ఈ. నాయకుడు మహత్తయ్య దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొని 1994లో ఎల్.టి.టి.ఈ. చేత చంపబడ్డాడు.ప్రభాకరన్ ను ఎల్.టీ.టీ.ఈ.నాయకత్వం నుండి తొలగించేందుకు అతను భారత్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ తో కలిసి పని చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
1995లో రెండు శ్రీలంక ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ లను సముద్రం లో దాడి చేసి ముంచేయడంతో ఘర్షణలు మళ్ళీ మొదలయ్యాయి.శ్రీలంక సైన్యం జాఫ్నాను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.మూడు సంవత్సరాలు ఎన్నో దాడులు చేసి ఉత్తర ప్రాంతంలో పెద్ద ప్రాంతాలను శ్రీలంక సైన్యం స్వాధీనం చేసుకున్నారు.1998లో ఎల్.టి.టి.ఈ. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.ఇది శ్రీలంక సైన్యం తో సుదీర్ఘ పోరాటం తర్వాత జాఫ్నా ద్వీపకల్పం వద్ద ఎలిఫెంట్ బేస్ కాంప్లెక్స్ ను ఏప్రిల్ 2000లో స్వాధీనం చేసుకోవడం తో ముగిసింది.
2001 డిసెంబర్ లో అధికారంలోకొచ్చిన కుమారతుంగ మరియు రాణిల్ విక్రమ సింఘేల భారీ ఓటమి తర్వాత ఎల్.టి.టి.ఈ. ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించింది.శ్రీలంక ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించారు.2002లో కాల్పుల విరమణ 2004 లో కిలినోచ్చికి ఉత్తరాన ఉన్న ఎల్.టి.టి.ఈ. సైకిల్ పదాతిదళ ప్లటూన్ 2002 లో ఎల్.టి.టి.ఈ. ప్రత్యేక రాష్ట్రం అనే తన డిమాండ్ ను విరమించుకున్నారు.బదులుగా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ని కోరింది.మరియు 2002లో కాల్పుల విరమణ ఒప్పందం పై సంతకం చేసారు.నార్వే మరియు ఇతర నార్డక్ దేశాలు ఈ ఒప్పందానికి పర్యవేక్షించడానికి ఒప్పుకున్నాయి.
ఎల్.టి.టి.ఈ. మరియు శ్రీలంక ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతుండగానే కొనసాగుతున్న శాంతి ప్రక్రియకు కొన్ని క్లిష్ట పరిస్థితులు అంటూ 2003లో ఎల్.టి.టి.ఈ చర్చల నుండి వైదాలిగింది.దాంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి.ఎల్.టి.టి.ఈ 2003లో మధ్యంతర స్వయం పరిపాలన అథారిటీ ని ప్రతిపాదించింది.దీనిని అంతర్జాతీయ సమాజం ఆమోదించింది.కానీ శ్రీలంక ప్రభుత్వం అంగీకరించలేదు.2005 లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ఎల్.టి.టి.ఈ. బహిష్కరించారు.
ఈలం యుద్ధం
2005లో శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్సే ఎన్నికయ్యారు.శాంతి చర్చల నుండి LTTE తప్పుకుంది.చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.2006 ఏప్రిల్ 25న శ్రీలంక ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ శరత్ ఫోన్సెకా పైన హత్యాయత్నం చేసారు.దాంతో LTTE ని యురోపియన్ యూనియన్ తీవ్రవాద సంస్థ గా గుర్తింపు.
జూలై 2006లో మావిల్ ఓయ జలాశయం స్లూయిజ్ మూసివేసారు.దాని కింద ఉన్న 15000 గ్రామాలకు నీటి సరఫరా ఆపివేశారు.ఆగస్టు 2006 నాటికి ఇది పూర్తి స్థాయి యుద్ధం గా మార్పు చెందింది.అదే సంవత్సరం శాంతి ప్రక్రియ దెబ్బ తిన్న తర్వాత శ్రీలంక ప్రభుత్వం పులుల పైన యుద్ధం చేసి ఓడించి దేశం మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకుంది.
2006 జూన్ 8 మరియు 9 తేదీల్లో శాంతి చర్చలు నార్వే లో షెడ్యూల్ చేయబడ్డాయి.కానీ ఎల్.టి.టి.ఈ. తమ యోధులని సురక్షితంగా లేదు అని చర్చలు బహిష్కరించారు.2006లో ఇరు పక్షాల చేత అనేక కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగాయి.ఆత్మాహుతి దాడులు, సైనిక దాడులు మరియు వైమానిక దాడులు 2006 చివరిలో జరిగాయి.
2007 నుండి LTTE పైన సైనిక దాడులు పెరిగాయి.2002 నుండి 2007 మధ్య శ్రీలంక మోనిటరింగ్ మిషన్ ఎల్.టి.టి.ఈ. మొత్తం 3830 కాల్పుల విరమణ నమోదు చేసింది.
2008లో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ నుండి వైదొలిగింది.
కల్నల్ కరుణ(వినయగ మూర్తి మురళీధరన్ పేరు) సీనియర్ LTTE కమాండర్ LTTE నుండి విడిపోయి ఉన్ప్ పార్లమెంట్ సభ్యుడు సయ్యద్ అలీ జహీద్ మౌలానా ప్రోత్సాహం తో మధ్య ఉత్తరాది కమాండర్లు తూర్పు తమిళుల అవసరాలను పట్టించుకోవడం లేదు అనే ఆరోపణతో తమిళ్ ఈలా మక్కల్ విడుతులై పులికల్(తర్వాత తమిళ్ మక్కల్ విడుతులై పులికల్)ని స్థాపించారు.ltte మాత్రం అతను నిధులను సరిగా ఉపయోగించలేదని ఆరోపించారు.రెండు సంస్థల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
TMVP కి ప్రభుత్వ మద్దతు ఉందని LTTE ఆరోపించారు.SLMM మానిటర్లు దానిని ధృవీకరించారు.మరోవైపు శ్రీలంక ప్రభుత్వం దాడులు చేస్తూనే ఉన్నారు.మే 19,2009 న ప్రభాకరన్ హత్య చేయబడ్డాడు.
సెల్వరస పద్మనాథన్ ప్రభాకరన్ తర్వాత LTTE అధినేత అయ్యాడు.కానీ వారం లోపే మలేషియాలో పట్టుబడ్డారు.17 మే 2009న పద్మనాథన్ ఓటమిని అంగీకరించాడు.ఈ పోరాటం ఒక చేదు ముగింపు కి చేరుకుంది అని ఆయన పేర్కొన్నారు.
595 బాల సైనికులతో సహా 11664 మంది సభ్యులు లొంగిపోయారు.
150 మంది హార్డ్ కోర్ సభ్యులు,1000 మంది మధ్య స్థాయి సభ్యులు భారత్ కి పారిపోయారు.
మానవ హక్కుల సంఘాలు తమిళ ప్రజల పైన శ్రీలంక సైన్యం హత్యలు, అత్యాచారాలు చేసారని ఆరోపించారు.
LTTE అంటే ఏదో చిన్నగా ఒక ప్రభుత్వం పైన కోపంతో ఆవేశంగా తిరుగుబాటు చేసిన సంస్థ కాదు.
ఇది చాలా చిత్త శుద్ధి తో ఒక సొంత సైనిక వ్యవస్థ ని ఏర్పాటు చేసుకుని, తమకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని దేశాల ప్రభుత్వాలతో పోరాడిన సంస్థ.అలాగని ఇది చాలా గొప్ప సంస్థ లేదా మంచిది అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం నా ఉద్దేశం కాదు.నేను వారి చిత్త శుద్ధి, నిరంతర కృషి,తమ సిద్ధాంతల పైన విధేయత గురించి చెప్తున్నాను.
ఇది పొగాకు, మత్తు పదార్థాలు, వ్యభిచారం లాంటి వాటిని తమ యోధులకు అందకుండా చేసింది మరియు బహిష్కరించారు.
తన సైనిక విభాగంలో సంప్రదాయ పోరాట దళాలు, ఛార్లెస్ ఆంథోనీ బ్రిగేడ్ మరియు జయంతన్ బ్రిగేడ్ లాంటి 11 విభాగాలను కలిగి ఉంది.అలాగే బ్లాక్ టైగర్స్ అనే ఆత్మాహుతి సంస్థ, సీ టైగర్స్ నావికా దళం, ఎయిర్ వింగ్ ఎయిర్ టైగర్స్,LTTE నాయకుడు ప్రభాకరన్ భద్రతాదళం ఇమ్రాన్ పాండియన్ రెజిమెంట్ మరియు రథా రెజిమెంట్,కిట్టు ఆర్టిలరీ బ్రిగేడ్, కుట్టి శ్రీ మోర్టార్ బ్రిగేడ్ లాంటివి ఉన్నాయి.
విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి.వాటితో కూడా ఆత్మాహుతి దాడులు చేశారు.ప్రతి సభ్యుడు సైనెయిడ్ ని ఉంచుకొనేవారు.ఒకవేళ శ్రీలంక సైన్యానికి లేదా పోలీసులకు దొరికితే దాన్ని మింగి ఆత్మహత్య చేసుకోవాలి.వీరికి ప్రత్యేకమైన గూఢచారి విభాగం కూడా ఉంది.
వీరి ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని నడిపించారు.పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లాంటివి ఉన్నాయి.స్త్రీల పైన గృహ హింసను కూడా చాలా మట్టుకు తగ్గించారు.శక్తివంతమైన అంతర్జాతీయ సంస్థని కూడా తయారు చేసుకుంది.
మొత్తం ఈ కథనం అంతట్లోని నన్ను బాగా కలిచివేసిన విషయం,మీతో ఇక్కడ వరకూ చెప్పని విషయం,అందరూ మర్చిపోయిన విషయం
వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుడి మరణం.యుద్ధం అంతా అయిపోయింది.అసలు నాయకుడు హతమయ్యాడు.మిగిలిన వారు దొరికేసారు.కానీ ప్రభాకరన్ కుమారుడు చిన్న పిల్లాడు.వాడిని పట్టుకుని అందరి మధ్యలో బంధించి, ముందు వాడికి బిస్కట్లు ఇస్తే అమాయకంగా తిన్నాడు.కానీ అవి తిన్న తర్వాత చిన్న పిల్లాడనే కనికరం లేకుండా కాల్చి చంపేశారు.
ఈ యుద్ధం లో ఎక్కడా తప్పని కానీ,ఎవరూ ఒప్పని కానీ నేను చెప్పను.కానీ ఈ పిల్లాడి విషయం లో మాత్రం శ్రీలంక సైనికులు చేసింది 100% తప్పే.ఆ ఫోటో చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను నిద్ర కూడా పోలేదు.ఎప్పుడూ ఆ చిత్రమే గుర్తు వచ్చేది.ఇప్పుడు ఈ ఆర్టికల్ రాయడానికి కూడా ఆ పిల్లాడి మరణమే కారణం.
ఓం శాంతి.......
ప్రపంచం లో శాంతి వర్ధిల్లాలి........
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
1947-1948 భారత్-పాకిస్థాన్ మొదటి యుద్ధం
కాశ్మీర్ ని కాపాడడానికి భారత్ పాకిస్థాన్ తో చేసిన మొదటి యుద్ధాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం.
స్వాతంత్ర్యం తర్వాత భారత సైన్యం చేసిన మొట్టమొదటి యుద్ధం గురించి మీకు తెలుసా?
స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్ ని ఏ దేశం లోనూ కలపము,స్వతంత్రంగానే ఉంచుతామన్న కాశ్మీర్ చివరి రాజు మహారాజ హరి సింగ్ అక్టోబర్ 27,1947లో భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా ఎందుకు సంతకం చేయాల్సి వచ్చింది?
1815 ముందు జమ్మూ కాశ్మీర్ 22 చిన్న స్వతంత్ర్య రాజ్యాలుగా ఉండేవి.16 హిందూ రాజ్యాలు మరియు 6 ముస్లిం రాజ్యాలు ఉండేవి.వీటన్నింటినీ కలిపి పంజాబ్ లోని కొండ రాజ్యాలుగా పిలిచేవారు.1757 నుండి 1857 వరకూ రాజ్ పుత్రులు మొఘల్ సామ్రాజ్యం లో భాగంగా వారి రాజ్యాలను పాలించారు.తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చింది.బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భావం మరియు మొఘల్ సామ్రాజ్య పతనం తర్వాత కొండ రాజ్యాల అధికారం క్షీణించింది.తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం జమ్మూని సిక్కు నాయకుడు రంజింత్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు.1845-46 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం లో ఈస్ట్ ఇండియా కంపెనీ కాశ్మీర్ పైన సార్వభౌమాధికారం సాధించింది.1846 లో లాహోర్ లో జరిగిన ఒప్పందం ప్రకారం సిక్కులు బ్యూస్ మరియు సట్లెజ్ నదుల మధ్య విలువైన భూమితో పాటు 12 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.కానీ అంత డబ్బు లేనందున సిక్కు రాజ్యం లోని కాశ్మీర్ ప్రాంతాన్ని డోగ్రా నాయకుడు గులాబ్ సింగ్ కి 7,50,000 రూపాయలకు అప్పగించింది. డోగ్రా రాజు స్వయం ప్రతిపత్తి కలిగిన కాశ్మీర్ రాజ్యానికి మొదటి రాజయ్యాడు.ఒక కొత్త రాజ వంశాన్ని స్థాపించాడు.
భారత్ కి స్వాతంత్ర్యం వచ్చి పాకిస్థాన్ భారత్ విభజన తర్వాత రెండు దేశాలూ జమ్మూ కాశ్మీర్ తమతో కలుస్తుందని కోరుకున్నాయి.భారత్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.కానీ కాశ్మీర్ మహారాజ హరిసింగ్ గారు మాత్రం ఏ వైపుకి వెళ్ళకుండా స్వతంత్రం గా ఉండాలని కోరుకున్నారు.దాని కోసం రెండు దేశాల నుండి నిలుపుదల ఒప్పందం కావాలని కోరాడు.పాకిస్థాన్ ఆ నిలుపుదల ఒప్పందం పై సంతకం చేసింది.
కానీ భారత్ మాత్రం దానికి ఒప్పుకోలేదు.తదుపరి చర్చల కోసం తమ ప్రతినిధిని ఢిల్లీ పంపాలని కోరారు.కానీ కాశ్మీర్ నుండి ఎవ్వరూ రాలేదు.మరొక వైపు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాశ్మీర్ పేరుతో ముస్లిం గిరిజనులు కాశ్మీర్ కి స్వతంత్రం కావాలని నిరసనలు మొదలుపెట్టారు.ఈ గొడవల వల్ల మహారాజ షేక్ అబ్దుల్లా ని అరెస్టు చేశారు.నెహ్రూ కూడా ఇది ముస్లిం ల పైన జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.ఈ దాడిని ఆపాలంటూ కాశ్మీర్ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడారు.నెహ్రూ తన స్నేహితుడు షేక్ అబ్దుల్లా ని విడుదల చేయాలని కోరారు.మౌంట్ బాటన్ మరియు పటేల్ కూడా కోరారు.కానీ మహారాజ దానికి ఒప్పుకోలేదు.దాంతో గిరిజనులలో తిరుగుబాటు మరింత ఆగ్రహం మొదలయ్యింది.
అలాగే పాకిస్థాన్ శాసనసభ ఏర్పడేంత వరకూ ఏ దేశంలో కలవాలి?లేదా నిశ్చలంగా ఉండాలని నిర్ణయం తీసుకోవద్దని మౌంట్ బాటన్ కోరారు.ముఖ్యంగా నెహ్రూ తన కాశ్మీర్ మూలాలు అలాగే తన స్నేహితుడు షేక్ అబ్దుల్లా కోసం కాశ్మీర్ భారత్ లో కలవాలి అని కోరుకున్నాడు.
అదే సమయంలో భారత్ జమ్మూ కాశ్మీర్ యొక్క నిలుపుదల ఒప్పందం ఇంకా ఎటూ తేలలేదని తెలిసి జిన్నా తన ప్రైవేటు సెక్యూరిటీ ఖుర్షీద్ హసన్ ని శ్రీనగర్ పంపి పాకిస్థాన్ తో విలీన ఒప్పందం గురించి మాట్లాడించారు."మీరు సార్వభౌమ అధికారం కలిగి ఉన్నారనీ,ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదనీ, షేక్ అబ్దుల్లా లేదా నేషనల్ కాన్ఫరెన్స్ కి సమాధానం చెప్పనక్కర్లేదు అని రాసిన లేఖను ఖుర్షీద్ మహారాజ కి ఇచ్చాడు.నిలుపుదల ఒప్పందం పై పాకిస్థాన్ సంతకం చేసిన 12 రోజుల లోపునే హెచ్చరికను పంపించారు.మీరు పాకిస్థాన్ ని ఎంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్ తో కలవాడానికి మీరు ఒప్పుకోకపోతే తీవ్ర ఇబ్బందుల్లో పడతారు అని హెచ్చరిస్తూ లేఖ రాసారు.మరోవైపు జవహార్ లాల్ నెహ్రూ మరియు గాంధీ కూడా కాశ్మీర్ భారత్ తో కలవాలని కోరుకున్నారు.నెహ్రూ మూలాలు కాశ్మీర్ లో ఉండడం, షేక్ అబ్దుల్లా తన మిత్రుడు కావడం కూడా కారణాలే.కానీ పాకిస్థాన్ లో కలవాలి అనుకున్న హైదరాబాద్ సంస్థానం నిజాం గురించి ఆలోచిస్తున్నారు ఆ సమయంలో.
జిన్నా షేక్ అబ్దుల్లా ని కూడా కాశ్మీర్ ని పాకిస్థాన్ తో కలపడానికి సహకరించాలని కోరారు.మత ప్రాతిపదికన,వస్తు సరఫరా మరియు భౌగోళికంగా కూడా కాశ్మీర్ పాకిస్థాన్ తోనే కలుస్తుందని జిన్నా ఆశపడ్డాడు.కానీ అబ్దుల్లా కూడా దానికి ఒప్పుకోలేదు.జిన్నా ఇస్లాం కి ఏకైక ప్రతినిధిగా మరియు ఇస్లాం రాజ్యం మొత్తానికి తనే అధికారంలో ఉండాలని కోరుకోవడం దానికి కారణం.జిన్నా ఇవన్నీ ఆలోచించి ఇక కాశ్మీర్ భారత్ తో కలిసిపోతుందని భయపడి చివరిగా బల ప్రయోగం చేసి కాశ్మీర్ ని లాక్కోవాలని అనుకున్నాడు.పైగా షేక్ అబ్దుల్లా కి కూడా తన స్నేహితుడు ప్రధాన మంత్రి గా ఉన్న భారత్లో కలిస్తేనే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది అని అనుకున్నాడు.
1947 జూన్ లో 60,000 మంది మాజీ సైనికులు (ఎక్కువగా పూంఛ్ కి చెందిన వారు) మహారాజ కు వ్యతిరేకంగా పన్ను వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ ప్రచారం ఆగస్టు 14 మరియు 15 న పూంచ్ ముస్లిం లు పాకిస్థాన్ జెండా ఎగురవేయడంతో ఇది వేర్పాటు వాద ఉద్యమం గా మారింది.దాంతో మహారాజ అక్కడ మార్షల్ లా విధించారు.దాంతో మరింత కోపం తెచ్చుకున్న ముస్లిం లు NWFP యొక్క గిరిజనులు కూడా కలిసి వీరు తెచ్చిన మందు గుండు సామగ్రి తో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
సెప్టెంబర్ 4 1947న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దళాల కమాండర్ జనరల్ హెన్రీ స్కాట్ అనేక చోట్ల పాకిస్థానీలు చొరబడి ఆ ఉద్యమం లో కలుస్తున్నారనీ, వారి గురించి పాకిస్థాన్ తో చర్చించాలని చెప్పారు.అదే రోజున జమ్మూ కాశ్మీర్ ప్రధాని జనక్ సింగ్ ఈ విషయం అధికారికంగా పాకిస్థాన్ కి తెలియజేసి సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.అయితే జమ్మూ నుండి కూడా చాలా మంది హిందువులు సియాల్ కోట్ లో చొరబడుతున్నారంటూ ఆరోపణ చేసి ఆ విషయాన్ని పట్టించుకోలేదు.కానీ పాకిస్థాన్ ప్రోత్సాహం తో రెచ్చిపోయిన తిరుగుబాటు దారులు అనేక దాడులకు పాల్పడుతున్నారు. పైగా అందులో చాలా మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో ప్రపంచ యుద్ధం లో పాల్గొన్నవారే కావడంతో,వాళ్ళకి యుద్ధ విద్యలు, ఆయుధాలను ఉపయోగించడం తెలియడం వల్ల ఆ దాడులు మరింత దారుణంగా తయారయ్యాయి.
ఇక ఇవన్నీ చూస్తూ విసిగిపోయిన మహారాజ చివరికి కాశ్మీర్ చేజారిపోతుంది, పాకిస్థాన్ చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని భయపడి షేక్ అబ్దుల్లా ని విడుదల చేసారు.అతను విడుదలైన వెంటనే మహారాజ కు వ్యతిరేకంగా కాశ్మీర్ స్వేచ్ఛ ని కోరుకుంటుందని బహిరంగ సభలో పునరుద్ఘాటించారు.
22 అక్టోబర్ 1947న పాకిస్థాన్ NWFP నుండి గిరిజనులను కలుసుకుని ఆపరేషన్ గుల్మార్గ్ ప్రారంభించారు.పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ప్రత్యక్ష నియంత్రణలో ఆధునిక ఆయుధాలను అందించి సుమారు 2000 మంది గిరిజనులు బస్సుల్లోనూ నడక మార్గం లోనూ ముజఫరాద్ కి పంపారు.ఈ ఆక్రమణదారులు అక్కడ నుండి ఉరి మరియు బారాముల్లా చేరుకుని అక్కడ మహారాజ సైన్యం పైన దాడులు చేసి తమ స్వాధీనం చేసుకున్నారు.దాంతో శ్రీనగర్ ని కూడా స్వాధీనం చేసుకోవడానికి పెద్ద గా సమయం పట్టదని మహారాజ సైనిక సహాయం కోసం భారత్ కి విజ్ఞప్తి చేశారు.
ఈ అభ్యర్ధన అక్టోబర్ 25న మౌంట్ బాటన్ నేతృత్వంలో నెహ్రూ,పటేల్,బల్దేవ్ సింగ్ ,పోర్ట్ ఫోలియో లేని మంత్రి గోపాలస్వామి అయ్యంగార్ మరియు సైన్యం, వైమానిక దళం, నావికా దళాల బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ తో సహా జరిగిన భారత రక్షణ కమిటీ సమావేశంలో పరిగణించబడింది.
లెఫ్టినెంట్ జనరల్ కె.కె. ప్రకారం కాశ్మీర్ ప్రభుత్వం అప్పటికే అభ్యర్ధించిన ఆయుధాలు మరియు మందు గుండు సామగ్రి పంపడం తక్షణ అవసరమని ఇవి శ్రీనగర్ ప్రజలని రైడర్ ల నుండి కొంత వరకూ కాపాడుతుందని నిర్ణయించారు.కానీ మౌంట్ బాటన్ మాత్రం కాశ్మీర్ ని భారత్ లో కలిపేంత వరకు సైన్యాన్ని పంపడం సరైన నిర్ణయం కాదని చెప్పారు.అలా చేస్తే భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.అలాగే ఆ చేరికని తాత్కాలికంగా భావించాలనీ, కాశ్మీర్ లో శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దాని భవిష్యత్తు నిర్ణయించవచ్చని చెప్పారు.అదేరోజు స్పాట్ అధ్యయనం కోసం రాష్ట్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.పి.మీనన్ గారిని శ్రీనగర్ కి పంపారు.మరుసటి రోజు తిరిగి వచ్చిన ఆయన అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ వెంటనే దళాలను పంపి రైడర్ల నుండి కాశ్మీర్ ని కాపాడడం చాలా అత్యంత అవసరమనీ తెలియజేశాడు.
ఈలోగా కాశ్మీర్ కొత్త ప్రధాని మెహర్చంద్ మహజన్ గారు మేము 25 సాయంత్రం లోపు విమానం వస్తే భారత్ కి వస్తామనీ, లేకపోతే పాకిస్థాన్ తో కలిసిపోతామనీ హెచ్చరించారు.
మహారాజ కు ప్రభుత్వ అభిప్రాయాలు తెలియజేసేందుకు మీనన్ ని జమ్మూ కి పంపారు. చివరికి అక్టోబర్ 26న మహారాజ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పైన సంతకం చేసి,మహజన్ తో కలిసి మీనన్ తిరిగి ఢిల్లీ వచ్చారు.ఈ విలీన సాధనం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రక్షణ, కమ్యూనికేషన్ మరియు విదేశీ వ్యవహారాల విషయాలలో భారత్ కి పరిమిత ప్రవేశం ఉంటుంది.ఈ పరికరంలో ఉన్నవి
నిబంధన 4: మహారాజ భారతదేశం లో తన రాజ్య విలీనాన్ని ప్రకటించారు.
నిబంధన 5: వాయిద్యం యొక్క నిబంధనలు మారవు మరియు ఏదైనా చట్టం చేయాలంటే/ మార్చాలంటే దానికి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదించాలి.
నిబంధన 6: భూసేకరణ కి సంబంధించి రాష్ట్రంలో చట్టాలు చేసే అధికారం భారత యూనియన్ కి లేదు.మరియు చట్టాలు అనుమతిస్తే తప్ప జమ్మూ కాశ్మీర్ లో భూమిని కొనడం అసాధ్యం.
నిబంధన 7: మహారాజ భవిష్యత్తు భారత రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన అవసరం లేదు మరియు మహారాజ ని ఈ విషయంలో బలవంతం చేయడానికి భారత్ కి హక్కు లేదు.
నిబంధన 8: ఈ నిబంధన లో ఏ విషయం కూడా మహారాజ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేదు.
నిబంధన 9: రాష్ట్రం తరపున సంతకం చేశారు కాబట్టి మహారాజ ని జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రతినిధి గా గుర్తించడం జరుగుతుంది.
నవంబర్ 1,1947లో మొదటి సారిగా లాహోర్ లో భారత దేశ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ మరియు పాకిస్థాన్ గవర్నర్ మహమ్మద్ అలీ జిన్నా తో సమావేశం జరిగింది.దానిలో ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామన్నారు.షేక్ అబ్దుల్లా అధికారిగా ఉండడం వల్ల కాశ్మీర్ భారత్లో కలుస్తుందని నమ్మకం తో ఉన్నారు నెహ్రూ.కానీ అదే కారణంతో జిన్నా దీనికి ఒప్పుకోలేదు.
ఎట్టకేలకు గిరిజనుల దండయాత్ర తిప్పికొట్టేందుకు భారత సైన్యాన్ని విమానంలో శ్రీనగర్ కి పంపారు.షేక్ అబ్దుల్లా చే నియమించిన మిలీషియా సైన్యం ద్వారా శిక్షణ పొందారు.
జనవరి 1 1948న నెహ్రూ అధికారికంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కి తీసుకెళ్ళారు.1948 లో జమ్మూ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ సైన్యం మరియు భారత సైన్యం మధ్య యుద్ధం జరిగింది అని పేర్కొన్నారు.
మే 1948 నాటికి పూంచ్-పశ్చిమ పంజాబ్ సరిహద్దు లో భారత సైన్యం విజయం సాధించింది.ఆజాద్ కాశ్మీర్ సైన్యానికి అండగా పంపడానికి పాకిస్థాన్ తన సైన్యాన్ని బహిరంగంగా సిద్ధం చేసింది.
కానీ 1948 ఆగస్టు 13న పాకిస్థాన్, భారత్ తమ సైన్యాలను వెనక్కి తీసుకోవాలని, ఆజాద్ కాశ్మీర్ సైన్యం ఉపసంహరించుకోవాలని కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసింది.అలాగే కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అందులో ఉంది.
భారతీయ సైనిక వర్గాల ప్రకారం పాక్ ఆర్మీ ఆపరేషన్ గుల్మార్గ్ అనే ప్రణాళికను సిద్ధం చేసింది.1947 ఆగస్టు 27 నాటికి దీన్ని అమలులోకి తీసుకొని వచ్చింది.
బన్నూ బ్రిగేడ్ లో పని చేస్తున్న OS.కల్కట్ అధికారికి అనుకోకుండా తెలిసింది.పథకం ప్రకారం పష్తూన్ గిరిజనులతో కూడిన 20 గిరిజన మిలీషియా లష్కర్లు ఒక్కొక్క దానిలో 1000 మందితో బయలుదేరారు.వీరందరూ ఆయుధాలను కలిగి ఉన్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో పెషావర్, కోహట్,థాల్ మరియు నౌషేరా, అక్టోబర్ 18 న అబోటాబాద్ లాంచింగ్ పాయింట్ కి, జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళాలని అనుకున్నారు.అక్టోబర్ 22కి 10 లష్కర్లు ముజఫరాబాద్ మీదగా కాశ్మీర్ లోయ పై దాడి చేయాలని ఊహించారు. మరో పది లష్కర్లు పూంఛ్,భీంబర్ మరియు తిరుగుబాటు దారులతో చేరాలని ఆలోచన. జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళడానికి ఆయుధాలతో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు కదిలారు.
కాశ్మీర్ లో ఈ అలజడుల వల్ల మహారాజ హరిసింగ్ భయపడ్డారు.అక్టోబర్ 24,1947న భారతదేశానికి ఈ దండయాత్ర గురించి మొదటి సమాచారం అందింది.ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది భారత్.వెంటనే అదే రోజు రాత్రి 11.00 గంటలకు భారత్ ని అత్యవసరంగా సహాయం కోసం అడిగారు.షేక్ అబ్దుల్లా కూడా ఎక్కడ పాకిస్థాన్ కాశ్మీర్ ని చేజిక్కించుకుంటుందోనని భయపడి సైనిక సహాయం అడిగారు.కానీ భారత్ మాత్రం కాశ్మీర్ ని విలీనం చేసిన తర్వాత మాత్రమే సైన్యాన్ని పంపుతామన్నారు.తర్వాత రోజు మధ్యాహ్నం వి.పి.మీనన్ గారు జమ్మూ కి చేరుకుంటారు మరియు మహారాజ సంతకం చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ తో ఢిల్లీ కి తిరిగి వస్తారు.
భారత గవర్నర్ ఈ పత్రాన్ని ఆమోదించడంతో అక్టోబర్ 26న కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమైంది.దీంతో మరింత కోపానికి గురైన జిన్నా ఇంకా ఆక్రమణదారులను పంపించింది.
భారత రక్షణ(భారత్-పాక్ యుద్ధం 1947-48):
1947 అక్టోబర్ 27 న రాష్ట్రాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడడానికి గుర్గావ్ లో లెఫ్టినెంట్ కల్నల్ దివాన్ రంజిత్ రాయ్ ఆజ్జాపనతో ఢిల్లీ లోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుండి 5.00 గంటలకు 1 సిఖ్ఖు బెటాలియన్ భారత సైన్యం నాలుగు డకోటా విమానాల్లో బయలుదేరి 8.30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ మిషన్ కి ఆపరేషన్ జాక్ అనే పేరు పెట్టారు.అలా యుద్ధానికి మొదటి అడుగు పడింది.
భారత రెస్క్యూ మిషన్ మొదటి నుండి తీవ్ర ఇబ్బందులతోనే ముందుకు సాగింది. శ్రీనగర్ భారత్ సరిహద్దు కి 480 కి.మీ. దూరం లో పంజాబ్ దళాలు శరణార్ధలను కాపాడడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉండటం వల్ల వాయు రవాణా ఒక్కటే మార్గం ఉంది.కానీ అధ్వాన్నమైన విషయం ఏంటంటే? అక్కడ విమానాల ల్యాండింగ్ కి అస్సలు అనుకూలంగా లేదు.అయినా తప్పని సరి పరిస్థితుల్లో దాన్నే ఎంచుకోవాల్సి వచ్చింది.
శ్రీనగర్ కి చేరుకున్న వెంటనే శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు.మొదటి కంపెనీని బారాముల్లా పొలిమేరలకు తరలించారు.నాలుగువేల మంది బలవంతులైన రైడర్స్ దాడులు చేస్తున్నారక్కడ.వారి పైన పోరాడుతున్న డోగ్రా దళాలకు ఈ కంపెనీ సహాయం గా నిలిచింది. దళాలు ముందుకు సాగుతూ శ్రీనగర్ ని రక్షించాయి.1947 నవంబర్ 13న ఉరి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో శ్రీనగర్ కి ముప్పు తప్పింది.పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా రైడర్లు దోపిడీలు, మానభంగాలు వదిలేసి పారిపోయారు.
దీనిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ గారికి మహావీర చక్ర అవార్డు ఇవ్వబడింది.
ఈ క్రమంలో అక్కడ జరిగిన యుద్ధాలు:
బద్గాం,ఝాంగర్ ని స్వాధీనం చేసుకోవడం,నౌషారా యుద్ధం తితావల్ కి చేరుకోవడం, పూంచ్ లో ఉపశమనం మరియు చంబ్ నుండి తిత్వాల్ కి చేరుకున్న యుద్ధం.
బద్గాం యుద్ధం:
నవంబర్ 3న 4 కుమవోలు,3 కంపెనీలు బద్గాం వద్ద పెట్రోలింగ్ విధుల్లో పాల్గొన్నారు.
ఒక గిరిజన లష్కర్ 700 మంది చొరబాటు దారులు గుల్మార్గ్ నుండి బద్గామ్ చేరుకున్నారు.స్థానికుల ఇళ్ళ నుండి సుమారు 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కంపెనీ పై కాల్పులు జరిపారు.సైన్యం 7:1 నిష్పత్తి లో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మేజర్ సోమనాథ్ శర్మ.డి సైనికులను ధైర్యం గా పోరాడమని కోరారు.1 కుమవోన్, రిలీఫ్ కంపెనీ తోడయ్యారు.బద్గాంని స్వాధీనం చేసుకున్నారు.కానీ దాదాపుగా 200 మంది రైడర్ల చేతిలో చనిపోయారు.
ఝంగర్ పతనం ఝంగర్ ని స్వాధీనం చేసుకోవడం:
1947 డిసెంబర్ 24న ఝంగర్ ని శత్రువులు ఆక్రమించారు.ఈ ప్రాతం శత్రువులకు చాలా
ప్రయోజనకరంగా మారింది.అందుకే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్ కి చాలా అత్యవసరమైనదిగా మారింది.
ఝంగర్ ని స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించి, రెండు దశల్లో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేసారు.
మొదట దశలో ఒక రాజ్ పుత్,ఒక డోగ్రా,ఒక కుమవోన్ తో కూడిన 19వ స్వతంత్ర బ్రిగేడ్ మరియు అనుబంధ యూనిట్లు,pt.3327 మరియు 3283.
రెండవ దశలో 50 పారా బ్రిగేడ్ గ్రూప్,3(పారా) మరాఠా Li,3(పారా) రాజ్ పుత్,1 పటియాల మరియు అనుబంధ యూనిట్లు,Pt.2701,ఝంగర్,Pt.3399 మరియు Pt.3374, 7ఆశ్విక దళాన్ని కూడా నియమించారు.
ఆపరేషన్ సమయంలో కీలకమైన, వ్యూహాత్మక పాయింట్లలో ఒకటైన పీర్ థిల్ శత్రువుల చేతిలో ఉండిపోయింది.
మార్చి 15న మరాఠ Li పీర్ థిల్ లో ప్రమాదకర నిఘా కోసం పంపబడింది.మార్చి 17కి పీర్ థిల్ ని విజయవంతంగా కైవసం చేసుకున్నారు.దాంతో ఝంగర్ పైన చివరి దాడికి మార్గం సుగమమైంది.
మార్చి 18న దాడి మొదలయ్యింది.అదే రోజున 3(పారా) రాజ్ పుత్ సైన్యం,Pt.3477 ఝంగర్ ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 50 పారా బ్రిగేడ్ గ్రూప్,3(పారా) మరాఠ Li, 3(పారా) రాజ్ పుత్,1 పాటియాలా ఈ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంటాయి.
నౌషేరా లో విజయం:
ఫిబ్రవరి 6,1948 న నౌషేరాలో యుద్ధం చేయడానికి వ్యూహం సిద్ధమైంది.బెరి పట్టాన్ చుట్టు పక్కల నుండి శత్రువులను తరిమివేయడానికి ఆపరేషన్ సత్యనాస్ ప్రారంభించి జాట్ 2 యొక్క కో లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.జి.నాయుడిని నియమించారు. జనవరి 23న దళాలు తుంగ్ ని ఆక్రమించాయి మరియు జనవరి 25న ఉదయం సియోట్ మరియు పండిట్ పైన దాడి చేయడానికి వెళ్ళారు.Pt.2502 వారు అక్కడికి వచ్చారు మరియు శత్రువులతో భీకరంగా పోరాడారు. చివరికి శత్రువులు అక్కడ నుండి పారిపోయారు.100 మంది శత్రువులు మరణించి ఉంటారని లేదా గాయపడి ఉంటారని అంచనా.
తిత్వాల్ యుద్ధం:
మొత్తం కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ లలో ఈ తిత్వాల్ చాలా భయంకరమైనది మరియు సుదీర్ఘమైనది.పష్టూన్ గిరిజన మిలీషియా 1947-48 ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుని దాటి ఆక్రమించింది.ఈ తిత్వాల్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన గ్రామం. 1948 అక్టోబర్ 13న పాకిస్థాన్ సైన్యం భారీ దాడిని ప్రారంభించింది,భారత సైన్యం ఉన్న పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆ దాడులు జరిగాయి.కానీ భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం వలన భారీ ప్రాణ నష్టం తో ఘౌరంగా విఫలమయ్యారు.భారత సైన్యం యొక్క ఆత్మ స్థైర్యం మరియు సంకల్పం వలన తిత్వాల్ ను మనం కాపాడుకోగలిగాం.
1 సిక్కు,1 మద్రాస్,6 రాజ్ పుత్ రైఫిల్స్ బెటాలియన్స్ పాల్గొన్నారు.1948 జూలై 18న సీహెచ్ఎం పీర్ 6 రాజతానా రైఫిల్స్ కి చెందిన సింగ్ శత్రువులు ఆక్రమించిన దాడి చేసి కాపాడే పనిలో ఉన్నారు.అత్యంత శౌర్యాన్ని ప్రదర్శించినందుకు, ధైర్య సాహసాలనతో పరాక్రమవంతంగా పోరాడినందుకు అతనికి పరమ వీర చక్ర లభించింది.
ఉత్తర రంగం:
లడఖ్ ప్రావిన్స్ లోని ఈ పశ్చిమ భాగం ఇరవయ్యవ శతాబ్దపు ముందు రోజుల్లో డోగ్రా రాజుల పాలనలో ఉండేది.తర్వాత మహారాజ హరిసింగ్ బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చారు.బ్రిటిష్ ఇండియా మరియు రష్యన్ సామ్రాజ్యం మధ్య ఎత్తైన రక్షణాత్మక ప్రాంతంగా ఉండేది.గిల్గిట్ మరియు బాల్టిస్థాన్ నుండి ఈ ప్రాంతం గ్రేట్ హిమాలయాలలోని నంగా పర్వతాల మీదుగా 4000 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జిల్ పాస్ గుండా వేరు చేయబడింది.ఈ ప్రాంతంలో చాలా గొప్ప యుద్ధం జరిగింది.
కాశ్మీర్ యొక్క ఉత్తర ఫ్రంట్ లో గురైస్,స్కర్డ్,ద్రాస్, కార్గిల్ మరియు ద్రాస్ సెక్టార్ లు ఉన్నాయి.నవంబర్ 1947 నుండి ఆగస్టు 1948 వరకు ఈ ప్రాంతంలో శత్రువులు గొప్ప విజయం సాధించారు.దక్షిణం వైపు తొలి విజయం తో ఉబలాటంతో తీవ్రవాదులు అండగా నిలిచారు. తిరుగుబాటు చేయడంలో గిరిజనులు ప్రముఖ పాత్ర వహించారు.గిల్గిట్ 1947 అక్టోబర్ 31న గిల్టిట్ స్కౌట్స్ యొక్క పెద్ద విభాగం తో బలోపేతం చేయబడింది.దీనిలో ఒక రెజిమెంట్ స్థానిక షియా ముస్లిం మెజారిటీ జమ్మూ కాశ్మీర్ దళాలలో ఒక భాగం.ఈ దళానికి బ్రిటిష్ అధికారి మేజర్ బ్రౌన్ నాయకత్వం వహించారు.బ్రిటిష్ సైన్యం చేసిన అనేక సైనిక చర్యల్లో ఇది ఒకటి.తదుపరి దశల్లో రైడర్లు చేసిన తిరుగుబాటు దాడులకు పాకిస్థాన్ సైన్యం సహాయం చేసింది.అయితే వారికి వ్యతిరేకంగా భారత సైన్యం తన అసమాన శౌర్యం,పరాక్రమం చెప్పుకోదగ్గది.
స్కార్డ్ ముట్టడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 11 ఫిబ్రవరి 1948 న స్టార్డ్ పైన శత్రువులు దాడి చేశారు.ఆ రోజు నుండి ఆగస్టు 13 వరకు ఆరు నెలలు పాటు స్టార్డ్ శత్రువుల చేతిలో ఉండిపోయింది.శత్రువులు ఫిబ్రవరి 1948 లో 16000 ఎత్తులో ఉన్న జోజిలా పాస్ ని దాటడానికి ప్రయత్నించారు.కానీ ఆ సమయంలో భారత సైన్యం అసమానమైన శౌర్యాన్ని కనబరచి అడ్డుకున్నారు.
నవంబర్ 1947న లెఫ్టినెంట్ కల్నల్ షేర్ జంగ్ థాపా 6 జమ్మూ కాశ్మీర్ పదాతిదళానికి చెందిన అతని సైన్యం బయలుదేరి డిశంబర్ 3న ఒక కోటకి చేరుకుని స్థిరపడ్డారు.శత్రువులు ఆధునిక రైఫిల్స్ ని కలిగి వాటిని ఉపయోగించడంలో నిపుణుల నాయకత్వం లో ఉన్నారు.మొత్తం 285 సైన్యం తో కెప్టెన్ థాపా 600 మంది శత్రువుల పైన పోరాడి గెలిచారు.
శత్రువులు లేహ్ పైన దాడి చేయడానికి లేహ్ మరియు కార్గిల్ ని దాటారు.వ్యవస్థీకృత రక్షణ ఉన్నప్పటికీ మే మూడో వారం నాటికి పరిస్థితి చాలా ప్రమాదకరం గా తయారైంది. కానీ అప్పుడు సైనికులకు శత్రువుల పైన దాడి చేయడానికి మిగిలిన ఏకైక మార్గం వాయు మార్గం.
భారత దేశం లో సైనిక విమానయాన రెడ్ లెటర్ సమయానికి ఎయిర్ కమాండర్ మెహర్ సింగ్ కూడా ఉన్నారు.24 మే 1948న మేజర్ తిమ్మయ్యతో కలిసి లేహ్ లో దిగారు. తర్వాత రెండు వారాల్లో మరిన్ని విమానాల్లో సైన్యం లేహ్ కి చేరుకుంటాయి.2/4 గూర్ఖా రైఫిల్స్ ని కూడా చేర్చారు.మెహర్ సింగ్ ధృడ నాయకత్వం లో పైలట్లు చేసిన సాహసోపేతమైన విన్యాసాలకు మహావీర చక్ర అందించబడింది.తర్వాత 2/8 గూర్ఖా రైఫిల్స్ ను చేర్చారు.
1948 వేసవిలో రైడర్లు కార్గిల్ మరియు ద్రాస్ చుట్టుపక్కల పట్టుని బిగించారు.పాకిస్థాన్ ఫ్రాంటియర్ రైఫిల్స్ గన్స్కర్ ఆశ్రమానికి చెందిన లామాని చంపారు. కార్గిల్ లో బౌద్ధ సన్యాసులను సామూహికంగా హత్యలు చేసారు.లడఖ్ లో రెండవ అతి పెద్ద మఠమైన్ రంగ్ డమ్ డొంపాని అపవిత్రం చేసి, ధ్వంసం చేశారు.
జోజిలా పాస్ ని స్వాధీనం చేసుకోవడానికి 77వ పారా బ్రిగేడ్ పదాతి దళాలు పదే పదే చేసిన దాడులు విఫలమయ్యాయి.
1948 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జనరల్ తిమ్మయ్య ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ని ప్లాన్ చేసారు.
అక్టోబర్ 1948 మధ్యలో జమ్మూ నుండి 7వ లైట్ కావల్రీకి చెందిన స్టువర్ట్ లైట్ ట్యాంకులు శ్రీనగర్ కి రహస్యంగా కదిలాయి. శ్రీనగర్ నుండి ఈ ట్యాంకులు 80 కి.మీ. దూరంలో కల బాల్తాల్ వైపుకి రవాణా చేయబడ్డాయి.వీరికి మేజర్ తంగరాజు ఆధ్వర్యంలోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూపు ఇంజనీర్లు మాత్రమే కాదు రెండు కంపెనీలు అద్భుతంగా సహకరించాయి.జమ్మూ నుండి శ్రీనగర్ వరకు చెక్క వంతెనల మీద మార్గం సుగమమైంది.కానీ బాల్టాల్ నుండి జోజిలా పాస్ వరకు ట్యాంక్ రవాణాకి ఉపయోగపడే ట్రాక్ లను రోడ్డు చివరన కొన్ని గజాల వరకూ వేసారు.ట్రాక్ వేస్తున్నప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ రాజేందర్ సింగ్ స్పారో ఆధ్వర్యంలో రెజిమెంట్ కొన్ని రోజుల పాటు గడ్డ కట్టే చలిలో శత్రువుల కాల్పులను తిప్పికొట్టారు.
1 నవంబర్ 1948న జొజిలా పాస్ నుండి శత్రువులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ వారిని తరిమి కొట్టారు.తర్వాత రెండు వారాల్లో ట్యాంకులు మరియు యుద్ధ విమానాల ద్వారా సంయుక్తంగా దాడులు చేశారు.హోరాహోరీ పోరు తర్వాత భారత సైన్యం లేహ్ మరియు ద్రాస్ లను స్వాధీనం చేసుకున్నారు.కార్గిల్ దండుకి చెందిన కాశ్మీర్ పదాతి దళాలు మరియు లేహ్ దండుతో కలిసి పాకిస్థాన్ సైనికులు మరియు రైడర్స్ పదే పదే చేసే దాడులను ఆపడానికి పట్టణం ముందు రక్షణగా నిలబడ్డారు.
పాకిస్థాన్ తో భారత సైన్యం ఇలా వీరోచితంగా పోరాడుతూ కాశ్మీర్ ని కాపాడుతున్న సమయంలో నెహ్రూ 13 ఆగస్టు 1948న యునైటెడ్ నేషన్స్ కి చేసిన ఫిర్యాదుతో 5 జనవరి 1949న సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చింది.దీని వలన రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు.దాంతో కాశ్మీర్ లో దాదాపు 30 శాతం భూభాగం పాకిస్థాన్ చేతిలో ఉండిపోయింది.కానీ కాశ్మీర్ రక్షణ కోసం భారత బలగాలను అనుమతిస్తారు.
మొత్తానికి 15 నెలల పాటు తీవ్రంగా కష్టపడి, కఠినమైన మార్గంలో కష్టపడి భయంకరమైన యుద్ధాలు చేసి శ్రీనగర్, బారాముల్లా,నౌషేరా,ఝంగర్,రాజౌరి,మెంథార్,పూంఛ్,స్క్వార్డ్,లేహ్, జోజిలా పాస్ ఇలా శత్రువుల చేతిలో చిక్కిన ఎన్నో ప్రాంతాలను ఆలస్యం గా అయినా సమర్ధవంతంగా స్వాధీనం చేసుకోగలిగారు.సరైన ఎయిర్ బేస్ లు, కమ్యూనికేషన్ లేకపోయినా వాటి సమర్ధవంతమైన సిబ్బంది,సైనికులు పటిష్టమైన నాయకత్వం లో కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.వారి శారీరక మరియు మానసిక ధైర్యం, వృత్తి నైపుణ్యం, అంకిత భావం, సంకల్పం, నిబద్ధత ప్రతికూ మరియు కఠినతరమైన వాతావరణంలో శత్రువులను తిప్పి కొట్టడంలో విజయం సాధించేలా చేసాయి.
మన సైన్యం ధైర్య సాహసాలు మన దేశానికి గర్వకారణంగా నిలిచాయి.
మేజర్ సోమనాథ్ శర్మ, లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే,నాయక్ జాదునాథ్ సింగ్,L/Nk కరమ్ సింగ్ మరియు CHM పిరు సింగ్ వారి అసమానమైన ధైర్య సాహసాలకు పరమ వీర చక్ర ని పొందారు.
ఇంత వీరోచితంగా పోరాడిన మన సైన్యం గురించి,ఈ యుద్ధం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత విభజన సమయంలో మారణహోమం
ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే
ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం ఒక మతాన్ని విమర్శించడం,ఒక వర్గాన్ని తప్పు పప్పడం కాదు.యుగయుగాలుగా ఎన్నో దాడులను ఎదుర్కొని ఇప్పటికీ ఈ ఈ భూమి పైన నిలబడిన ఒకే ఒక్క పురాతన ధర్మం పైన దాడుల గురించి మరీ ముఖ్యంగా దేశ విభజన సమయంలో జరిగిన అమానుష దాడులను తెలియజెప్పడానికి.ఎందుకంటే భారత సైన్యం భారత దేశం ఏర్పడిన తర్వాత చేసిన మొట్టమొదటి యుద్ధం నుండి వివరంగా చెప్పాలని ప్రయత్నించినప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు ఈ అంశం నాకు ఎదురుపడింది.అవును భారత దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదట జరిగిన ఈ మారణహోమం గురించి తెలియజేసి ముందుకు వెళ్ళాలని కొన్ని ఆధారాలను సేకరించి వాటిని జాగ్రత్తగా ఒక కథ రూపంలో రాసి మీ ముందుకు తీసుకు రావాలనేదే నా ప్రయత్నం.ఇక్కడ నేను చెప్పింది లెక్కల్లో చూపించిన, దాడులు జరిగిన కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు మాత్రమే.నిజానికి వాస్తవికత ఇంతకంటే మహా దారుణంగా ఉంటుంది.అవి నాకు తెలిసినప్పటికీ సరైన ఆధారాలు లేక ఇవి మాత్రమే రాస్తున్నాను.అర్ధం చేసుకోగలరు.
1947 అగస్టు 15వ తారీఖున భారత దేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చి దేశం విడిచి వెళ్ళితామని సంవత్సరం ముందు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.
అప్పటి వరకు బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు మొదలైన నిరంకుశ పాలనలో బానిసలుగా బ్రతికిన భారతీయులు, స్వాతంత్ర్యం కోసం ఎంతో ప్రాణ త్యాగం చేసి, మరెంతో మంది జైలు లో అత్యంత కఠిన శిక్షలు అనుభవించి,మరి కొందరు ఇంకా ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఆనందంగా వచ్చే స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా అప్పటి వరకు హిందువులు మొఘలుల, తురుష్కుల, ముస్లిం ల పాలనలో
ADVERTISEMENT
మంచి ఆకర్షణీయమైన క్యారియర్ చాలా తక్కువ ధరకే అమెజాన్ లో లభిస్తుంది.త్వరపడండి.
SOPL-OLIVEWARE Alloy Steel Teso Pro Lunch Box with Bottle, 3 Stainless Steel Containers, Plastic Pickle Box | Steel Spoon & Fork | Insulated Fabric Bag | Leak Proof | Microwave Safe | Full Meal | Blue
సబక్తజిన్ పెషావర్ వద్ద జయపాలుని ఓడించి,15000 మంది హిందువులను ఓడించి,5,00,000 మంది పిల్లలు,స్త్రీలతో సహా బందీలుగా చేసి హింసించాడు, తర్వాత బులందషహర్ వద్ద కుల చంద్రుని ఓడించి 50,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ బిన్ ఖాసిం బ్రాహ్మణబాద్ లో 16,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ ఘజినీ సోమనాథ్ దేవాలయంలో 50,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ ఘోరీ సరైన లెక్కలు లేవు,
అల్లావుద్దీన్ ఖిల్జీ కంబయత్ లో 20,000 మంది హిందువులను చంపించి,20,000 మంది స్త్రీలను బందీలుగా తీసుకుని వెళ్ళాడు,చిత్తోర్ లో వీడి వల్ల 20,000 మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు,
ఒడిశా జాజ్ నగర్ లో ఫిరోజ్ షా తుగ్లక్ 1,00,000 మంది హిందువులను చంపించాడు,
ఢిల్లీలో తైమూర్ లంగ్ 1,00,000 మంది హిందువులను చంపించాడు, భువనగిరి లో మాలిక్ కాఫుర్, ఓరుగల్లు లో ఉలుఘ్ ఖాన్,మధుర దేవాలయములో మాలిక్ కాఫుర్, మలబార్ లో మాలిక్ కాఫుర్ లక్షల మంది హిందువులను చంపించారు, విజయనగరం లో ముహమ్మద్ షా 5,00,000 మంది హిందువులను చంపించాడు,తళ్ళికోట యుద్ధం తర్వాత హంపి లో 1,00,000 మంది పైనే మారణహోమం జరిగింది,1568లో చిత్తోర్ ఘఢ్ లో అక్బర్ 30,000 మందిని చంపిస్తే,8,000 మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు, ఔరంగజేబు దక్షిణ భారత దేశం పైన చేసిన దండ యాత్ర లో 26,00,000 మందికి పైగా చంపించాడు,మొఘలులకు మరాఠాలకు జరిగిన యుద్ధం లో సంవత్సరానికి లక్ష మంది మరణించారు, కర్ణాటక లో హైదర్ అలీ,టిప్పు సుల్తాన్, గోవాలో పోర్చుగీసు వారు,ఇంకా లెక్కల్లో లేని ఆంగ్లేయుల పాలన లో అకృత్యాలు భారతదేశంలో హిందువుల పైన అత్యంత పైశాచిక దాడులు చేసి, చివరికి ఆడవారిని బహిరంగంగా గుంపులుగా చచ్చే వరకు అత్యాచారాలు చేసి, వారి అవయవాలను వేరు చేసి,జిజియా పన్ను రూపంలో హిందువులను కాల్చుకు తిని, రాక్షసత్వాన్ని చూపించి ఒక్కొక్క పాలకులు లక్షల మందిని చంపి,లక్షల మందిని భయభ్రాంతులకు గురి చేసి,మత మార్పిడిలు చేసి అతలాకుతలం చేసారు.నిజానికి కొన్ని యుగాల ముందు రాక్షసులు కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువులను చంపించారు.వాళ్ళు కనుమరుగైపోయారు.కానీ సనాతన ధర్మం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.ఇన్ని దారుణాలను చవి చూసిన హిందువులు స్వాతంత్ర్యం మాట వినగానే ఎంతో ఆనందంగా ఎదురు చూసారు.కానీ మహమ్మద్ అలీ జిన్నా రూపంలో మళ్ళీ వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటారని ఊహించలేకపోయారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడని బ్రతికుండగానే తలకిందులుగా వేలాడదీసి ఛర్మం వలిచి మతం మారమన్నా మారలేదు.ఇటువంటి ఎన్నో సందర్భాలు తెలియజేయాలి.కానీ ఇక్కడ అసలైన ఆర్టికల్ విభజన సమయంలో మారణహోమం కనుక చిన్నగా చెప్పి ముందుకు వెళ్తున్నాను.
ఈ రెండూ కలకత్తా అల్లర్లు మరియు జిన్నా గురించి, మరొకటి లో నోఖాలీ హత్యాకాండ గా ఉంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది అనగానే మహమ్మద్ అలీ జిన్నా తమకు ముస్లీం ల మెజారిటీ ఉన్న ప్రత్యేక దేశం కావాలని కోరాడు.కానీ జాతీయ కాంగ్రెస్ దానికి అంగీకరించలేదు.దాంతో
మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మీకు యుద్ధమే కావాలంటే మేము దానికి సిద్ధమే అంటూ తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు.అయితే భారతదేశాన్ని విభజిస్తాము లేదా నాశనం చేసేస్తాము అంటూ బెదిరించాడు.
ADVERTISEMET
మీ పిల్లలకు నచ్చే మంచి అందమైన ఆట వస్తువు.
Wembley Toys Talking Cactus Baby Toys for Kids Dancing Cactus Toys Can Sing Wriggle & Singing Recording Repeat What You Say Funny Education Toys for Children Playing Home Decor Items for Kids
ఆగస్టు 16,1946 ని డైరెక్ట్ ఏక్షన్ డే గా ప్రకటించి,ప్రణాళికా ప్రకారం కలకత్తా లో తన అనుచరులను ఉసిగొల్పాడు మరియు మతం పేరుతో ముస్లీమేతరుల ప్రాణాలను మాత్రమే కాదు,మన దారిలో లేని ముస్లీం లను కూడా చంపండి,మతం మార్చండి అంటూ పిలుపునిచ్చాడు.ముస్లీమేతరుల పైన జీహాద్ ని ప్రకటించాడు.
రక్తపాతం ఒక గొప్ప కారణం కోసం చేసినట్లయితే అది అసలు తప్పే కాదనీ, ఇప్పుడు మనకు ప్రత్యేక పాకిస్థాన్ ని సాధించడం కంటే ముఖ్యమైన పని మరొకటి లేదు అని వాళ్ళకి నూరి పోసారు.
దాంతో రెచ్చిపోయిన ముస్లీం అతివాదులు రోడ్ల పైకి వచ్చి తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు.
కనిపించిన వారిని కనిపించినట్టు ముస్లీమేతరులని నరికేసారు,పాడిచి చంపారు.చంపారు అనడం కంటే వారికి ఈ భూమి పైనే ప్రత్యక్ష నరకాన్ని చవి చూపారు,స్త్రీలను బహిరంగంగా సామూహిక అత్యాచారాలకు గురి చేసారు.బజార్లలో విధ్వంసం సృష్టించారు.వీధుల్లో వరుసగా ఉండే దుకాణాల గోడలు పడగొట్టారు,వాటికి నిప్పంటించారు, ఆ దుకాణాల్లోని కొత్త కొత్త వస్తువులు రోడ్ల పైకి విసిరికొట్టారు, ఫర్నిచర్, కాంక్రీటు బ్లక్ లు,ఇటుకలు,గాజు, ఇనుప కడ్డీలు, మెషీన్ టూల్స్ అన్నింటినీ రోడ్ల పైన చెల్లాచెదురుగా పడేసారు,పైపు లైన్లు బద్దలుగొట్టడంతో నీరు రోడ్ల పైకి ప్రవహిస్తుంది, ఆటోలు,ఇతర వాహనాలు తగలబెట్టారు,కాలిన వాటి నుండి వచ్చే పొగ చుట్టు పక్కల కమ్మేసింది.
కలకత్తా,హౌరా,హుగ్లీ,మెటియాబుర్జ్,24 పరగణాల్లో ఈ విధ్వంసం కొనసాగింది.మనం పాకిస్థాన్ ని పొందే వరకూ ఈ మారణహోమం కొనసాగాలని పిలుపునిచ్చాడు.
"లాడ్ కె లేంగే పాకిస్థాన్","మార్ కే లేంగే పాకిస్థాన్" అంటూ నినాదాలు చేస్తూ ఆ రాక్షసులు ఈ మారణహోమాన్ని కొనసాగించారు.
జిన్నా ఒక బహిరంగ సభలో రంజాన్ మాసం లో జిహాద్ చాలా గొప్ప పని అని వివరించాడు.మనం వర్షాకాలం మరియు రంజాన్ మాసంలో ఉన్నాం,ఇది దేవుని దయ, దేశాన్ని ప్రక్షాళన చేయడానికి, జిహాద్ పాటించడానికి ఎంతో గొప్ప సమయం ఇది, ముస్లిం లు వర్షాలను లెక్క చేయకుండా ఈ ఏక్షన్ డే ని జరపండి,ఇదే రంజాన్ మాసం లో ఖురాన్ అవతరించింది,బదర్ యుద్ధం, ఇస్లాం మరియు హీథనిజం మధ్య మొదటి సంఘర్షణ యుద్ధం 313 మంది ముస్లిం లు పోరాడి గెలిచారు.ప్రవక్త ఆధ్వర్యంలో 10,000 మంది ముస్లిం లు మక్కాను స్వాధీనం చేసుకుని ఇస్లాం ను స్థాపించి స్వర్గరాజ్యాన్ని ఏర్పాటు చేశారు.అటువంటి పవిత్ర మాసంలో మనం జిహాద్ చేయడం మన అదృష్టం అన్నాడు.అలాగే ముస్లిం లీగ్ కౌన్సిల్ జారీ చేసిన ఒక పత్రం ముస్లిం ల మధ్య పంపిణీ చేయబడింది,దానిలో ఎప్పుడు? ఎక్కడ?దాడి చేయాలో స్పష్టంగా ఉంది,
1.భారతదేశంలోని ముస్లిం లందరూ పాకిస్థాన్ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
2.పాకిస్థాన్ ఏర్పాటు తర్వాత భారతదేశం మొత్తం మనం జయించాలి.
3.భారతదేశంలోని ప్రజలందరినీ ఇస్లాం లోకి మార్చాలి.
4.మొత్తం అన్ని ముస్లిం రాజ్యాలు చేతులు కలపాలి.
5.ప్రతి ఒక్క ముస్లీం ఐదుగురు హిందువుల బాధ్యత తీసుకోవాలి.
6.పాకిస్థాన్ మరియు భారత ముస్లీం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేంత వరకు ప్రతి ఒక్క ముస్లీం ఈ క్రింది చర్యలు తీసుకోవాలి:-
(ఎ) హిందువుల యాజమాన్యం లోని ప్రతి ఒక్క కర్మాగారం మరియు దుకాణాలలో దోపిడీలు చేయాలి, వాటిని నాశనం చేయాలి,దోచుకున్న సొమ్ము లీగ్ కార్యాలయానికి ఇవ్వాలి.
(బి) ముస్లిం లీగర్లందరూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉండాలి.
(సి) జాతీయ వాద ముస్లీం లు ఎవరైనా లీగ్ లో చేరకపోతే వారిని చంపాలి.
(డి) హిందువులను క్రమంగా హత్య చేయాలి మరియు వారి సంఖ్య తగ్గించాలి.
(ఇ) దేవాలయాలన్నీ నాశనం చేయాలి.
(ఎఫ్) భారతదేశం లోని ప్రతి గ్రామంలో ముస్లీం లీగ్ యొక్క గూఢచారులు ఉండాలి.
(జి) కాంగ్రెస్ నాయకులను నెలకొకరిని రహస్యంగా హత్య చేయాలి.
(హెచ్) కాంగ్రెస్ ఉన్నత కార్యాలయాలను వాటిలో రహస్యంగా పని చేస్తున్న ముస్లిం వ్యక్తి నాశనం చేయాలి.
(ఐ)కరాచీ,ముంబై,కలకత్తా, మద్రాస్,గోవా, విశాఖపట్నం నగరాలను ముస్లీం లీగ్ వాలంటీర్లచే డిసెంబర్ 1946 నాటికి స్తంభింపజేయాలి.
(జె)ఆర్మీ,నేవీ, ప్రభుత్వ సర్వీసులు లేదా ప్రైవేటు సంస్థల్లో హిందువుల కింద పని చేయడానికి ముస్లీం లను అనుమతించకూడదు.
(కె) ముస్లీం లు భారత దేశం పై చివరి దండయాత్ర కోసం భారతదేశాన్ని మరియు కాంగ్రెసు ప్రభుత్వాన్ని ముస్లీం లు విధ్వంసం చేయాలి.
(ఎల్) పంజాబ్,సింధ్ మరియు బెంగాల్ లో ముస్లీం లీగర్లకి ఆయుధాలను తయారు చేసి ఇవ్వడానికి ముస్లీం లీగ్ ద్వారా ఆర్ధిక వనరులు అందించబడతాయి.**
(ఎం)ముంబై, కలకత్తా, ఢిల్లీ, లాహోర్,కరాచీ ముస్లిం లీగ్ శాఖలకు ఆయుధాలను పంపిణీ చేయాలి.
(ఎన్) హిందువులను నాశనం చేయడానికి మరియు వారిని భారతదేశం నుంచి తరిమికొట్టడానికి ముస్లీం లీగ్ లోని అన్ని విభాగాలు కనీస ఆయుధాలు, సామగ్రిని,కనీసం జేబులో కత్తిని కలిగి ఉండాలి.
(పి) అక్టోబర్ 18,1946 నుండి హిందూ స్త్రీలు మరియు బాలికలను అత్యాచారం చేసి, కిడ్నాప్ చేసి, ముస్లీం లుగా మార్చాలి.
(క్యూ) హిందూ సంస్కృతి ని నాశనం చేయాలి.
(ఆర్)లీగర్లందరూ హిందువుల పట్ల అన్ని సమయాల్లో కౄరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి మరియు సామాజికంగా, ఆర్థికంగా అనేక ఇతర మర్గాల్లోనూ వారిని బహిష్కరించాలి.
(ఎస్) హిందూ డీలర్ల నుండి ఏ ముస్లీం కొనుగోలు చేయకూడదు. హిందువులు తయారు చేసే వస్తువులన్నీ బహిష్కరించాలి.ముస్లీం లీగర్లందరూ ఈ సూచనలను పాటించి సెప్టెంబర్ 15,1946 లోగా అమలులోకి తీసుకొని రావాలి.
ఇవే కాకుండా బహిరంగంగా
డైరెక్ట్ ఏక్షన్ అంటే రాజ్యాంగేతర పద్ధతులను పాటిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి మార్గంలో అయినా వెళ్తూ, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని చెప్పారు.
ఈ మాటలు విన్న లీగ్ సభ్యులందరూ హిందువుల పైన మరింత రెచ్చిపోయారు.అత్యంత దారుణంగా, బహిరంగంగా హత్యలు, మానభంగాలు జరిగాయి.హిందువుల ఆర్తనాదాలు వినే నాధుడే లేకుండా పోయాడు.వారు తమ జీవితాల్లోనే అత్యంత దుర్మార్గమైన రోజులను చవి చూసారు.ఏ పక్క నుండి చావు వస్తుందో?అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలియక వణికిపోయారు.వాళ్ళు ఇప్పుడు కేవలం వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఎటు చూసినా దౌర్జన్యాలు, దుర్మార్గులు.దయ,కరుణ అనేవి ఎక్కడా కనబడడం లేదు.హిందువులను కాపాడడానికి ఎవ్వరూ రాలేదు.
కలకత్తా లో ఈ హింసాకాండ 72 గంటలు కొనసాగింది.తర్వాత కలకత్తా లో ఎటు చూసినా అత్యంత భయంకరమైన దృశ్యాలే కనిపించాయి.రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి.వ్యాపార సంస్థలు నాశనమయ్యాయి, వాటిలోని వస్తువులు రోడ్ల పైన పడి ఉన్నాయి.భవనాలు కాలిపోయాయి.నీటి పంపులు పగలగొట్టబడ్డాయి.ట్రాఫిక్ లో ఎక్కడ చూసినా కాలి పోయిన ఆటోలు, వాహనాలు అడ్డంగా ఉన్నాయి.
ADVERTISEMET
పిల్లల మెదడుకు మేత లాంటీది ఈ గేమ్.అమేజాన్ లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
FunBlast DIY Plastic Building Blocks for Kids Building Blocks Toy for Kids Puzzle Games for Kids, Toys for Children Educational & Learning Toy for Kids, Girls & Boys - (250+ Blocks with 38 Wheels)
Brand
FunBlast
Manufacturer Minimum Age
36.00
Material
Plastic
Colour
Multicolor
Educational Objective
Logical Thinking, Counting Skills, Hand-Eye Coordination, Creative Thinking, Motor Skills, Sorting Skills, Imagination DevelopmentLogical Thinking, Counting Skills, Hand-Eye Coordination, Creative Thinking, Motor Skills, Sorting Skills, Imagination Development
ఇక శవాలు, అప్పుడే చనిపోయిన శవాలు కొన్ని,ఉబ్బిపోయిన శరీరాలు కొన్ని, నరికివేయబడిన శరీరాలు కొన్ని, కాలవల్లో కొట్టుకుని పోతున్న శరీరాలు కొన్ని,ఖాళీ స్థలాల్లో పేర్చబడిన శరీరాలు కొన్ని ఎటు చూసినా శరీరాలే.ఏ తప్పూ చేయకుండా, ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా, వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయిన అమాయక హిందూ జనాల శరీరాలే ఎటు చూసినా కనిపిస్తున్నాయి.ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం అతను ఎటు చూసినా 3 అడుగుల ఎత్తు పేర్చబడిన శరీరాలే కనిపించాయట.ఆ దృశ్యాలు తాను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు.తర్వాత 3500 వరకు మృత దేహాలను సేకరించారు.ఇంకా వేల మంది మంటల్లో కాలిపోయారు, కాలవల్లో కొట్టుకుని పోయారు, మురుగు కాలువల్లో మునిగి పోయారు, అలాగే కొన్నింటిని బంధువులు తీసుకొని పోయారు,ఒక అంచనా ప్రకారం ఆ మూడు రోజుల్లోనే దాదాపు 10,000 మంది మరణించి ఉంటారు, మరొక 1,00,000 మంది గాయాలపాలయ్యారు, నిరాశ్రయులయ్యారు,ఏ ఆధారం లేని వారయ్యారు, స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది, బంధువులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు.వారి బాధని చూడడానికి,పట్టించుకోడానికి కూడా ఎవరూ లేరు.వారి రోదన అరణ్య రోదన.ఎంతో మంది బలవంతంగా ముస్లిం మతం లోకి మార్చబడ్డారు.
చివరిగా ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే అని దీనికి పేరు పెట్టారు.ఇది హిందువులను ఊచకోత కోసిన అనాగరిక కౄరత్వం.కానీ ఈ చరిత్రని సామాన్యులకు తెలియకుండా దాచి పెట్టారు.
నోఖాలీ మారణహోమం
1937లో భారతదేశం లోని ప్రావిన్స్ లలో ఎన్నికలు జరిగినప్పుడు, బెంగాల్ ప్రావిన్స్ అధికారం ముస్లీం లకు దక్కింది.కానీ హిందూ జమీందారీ వ్యవస్థ కూడా పాలక వర్గం గా ఉండేది.అంతేకాకుండా వీరు విద్య మరియు ఆర్ధికంగా ఎప్పుడూ అభివృద్ధిలోనే ఉన్నారు.కానీ ముస్లిం పాలకులు కొత్త చట్టాలను ఇష్టం లేకపోయినా పాటించవలసి వచ్చింది.హిందువులను ప్రభుత్వ ఉద్యోగాలకు రాకుండా అడ్డుకున్నారు.అప్పటికే ఎప్పటి నుండో అభివృద్ధి చెందిన హిందూ కుటుంబాల పైన,జమీందారుల పైన మనోవేదన తో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ముస్లీం మూకలు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని ప్రకటించడం, వారికి అధికారం లభించడంతో ఇక తమ మనసులో దాగిన కోపాన్ని బయటపెట్టడానికి సరైన సమయం లభించింది అనుకున్నారు.
1946 అక్టోబర్ 10 బెంగాలీ హిందువులంతా ఎంతో పవిత్రంగా, ఆనందంగా జరుపుకునే కోజాగారీ లక్ష్మీ పూజా పవిత్ర దినం అది.ఆ రోజున బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ కూడా) హిందువులంతా స్వాతంత్ర్య ప్రకటన కూడా రావడంతో ప్రతి సంవత్సరం కంటే మరింత ఆనందంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో వారు ఊహించని విధంగా ముస్లీం మూకలు తమ అల్లర్లను మొదలుపెట్టారు.తమ పాత ఈర్షతో పాటు కొత్తగా ముస్లీం లీగ్ నాయకులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ముస్లీం సామ్రాజ్య స్థాపన అనే మత్తు ఎక్కిన ఆ రాక్షస మూకలు రెచ్చిపోయి హిందువుల పైన దాడులు మొదలుపెట్టారు.తమ అరాచకాలకు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అంతకు ముందు కలకత్తా లో జరిగిన "గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే"ని మరవక ముందే దానికి మించిన దారుణ కాండ అక్కడ చోటు చేసుకుంది.పూజ రోజున మొదలైన ఆ దాడులు కొన్ని రోజులు పాటు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి.
హిందూ జమీందార్ల పైన, మార్కెట్ లలోని హిందూ దుకాణాల పైన దాడులు చేసి వారి ఆస్తులు,వస్తువులు దోచుకున్నారు.ఈ దాడులు చాలా ప్రణాళికా బద్ధంగా చోటు చేసుకున్నాయి.ఈ అల్లర్లు నోఖాలీ జిల్లాలో రామ్ గంజ్,బేగంగంజ్,రాయ్ పూర్, లక్ష్మీ పూర్,ఛగల్ నయ్య మరియు శాండ్ విప్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మరియు తిప్పేరా జిల్లాలోని హజిగంజ్,ఫరీద్ గంజ్,చాంద్ పూర్,లక్షం మరియు చౌద్ధగ్రామ్ పోలీస్ స్టేషన్ల పరిధి ప్రాంతాల్లో మొత్తం 2000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ అల్లర్లు కొనసాగాయి.
ఇవి చాలా ప్రణాళికా బద్ధంగా, హిందూ మతాన్ని నాశనం చేయాలి అనే లక్ష్యంతో చేసిన దాడులు.
ఈ దాడుల్లో హిందూ పురుషులను,పిల్లలను అత్యంత పాశవికంగా చంపారు,వారి ఆస్తులను,డబ్బును దోచుకున్నారు.వారి ఇళ్ళని వస్తువులను తగలబెట్టారు.వారి కుటుంబ సభ్యుల ముందే వారిని హత్య చేసారు.మహిళల పైన సామూహిక అత్యాచారాలు, దాడులు జరిగేవి.హిందువుల ఆర్త నాదాలు ఎవ్వరికీ వినిపించలేదు.ఆ ప్రాంతాల్లోని ఎటు వైపు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.హిందువుల శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.మార్కెట్లు నాశనం చేయబడ్డాయి.
మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.వారి కళ్ళ ముందే వారి కుటుంబ సభ్యులను,భర్తలను హింసించి, హింసించి చంపారు.జీవచ్ఛవాలుగా ఉన్న ఆ మహిళల పైన బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసారు.వారి తాళిబొట్లు, నుదుటన బొట్టు తొలగించి ముస్లీం లు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు.అది వారికి ఎన్నో వివాహమో తెలియదు.కేవలం వారిని తమ ఇళ్ళలో ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు అని వారి సొంతం చేసుకున్నారు.అప్పటి వరకు తమ గృహాల్లో ఎంతో గౌరవంగా బ్రతికిన ఆ స్త్రీలు అత్యంత అవమానకరమైన జీవితాలను పొందారు.
ఎటు చూసినా ప్రాణ భయంతో హిందువులు పారిపోతున్నారు.తమ ఆస్తులు,సొమ్ము,ఇళ్ళు అన్నింటినీ వదిలి పారిపోవలసిన దుస్థితి వారికి దాపురించింది.తమ ప్రాణాలను,స్త్రీలను ఎలా కాపాడుకోవాలో తెలియక బెంబేలెత్తిపోయారు.
ఈ హత్యా కాండకి తోడు భయ కంపితులైన హిందువులను మత మార్పిడులు చేసారు.దాదాపుగా 90 శాతం పైనే హిందువులను బలవంతంగా ఇస్లాం మతం లోకి మార్చారు.
మహాత్మా గాంధీ మత సామరస్యం పేరు తో శాంతిని పునరుద్ధరించాలి అని నాలుగు నెలల పాటు నోఖాలీలో పర్యటించారు.కానీ హిందువులకు మాత్రం వారి పైన నమకం కలగలేదు.ఎందుకంటే అతను పర్యటిస్తుండగానే హిందువుల పైన దాడులు కొనసాగాయి,హత్యలు జరిగాయి,స్త్రీల మానభంగాలు ఆగలేదు,బలవంతపు మత మార్పిడులూ పెరిగాయితం మారిన వారి చేత వారి గొడ్లనే చంపి గొడ్డు మాంసం తినిపించారు.పైగా వీటన్నిటికీ తోడు గాంధీ పైన ముస్లీం మూకల కోపం పెరిగింది,తిరిగి వెళ్ళిపోవాలనే డిమాండ్ మొదలైంది, చివరికి అతను నడుస్తున్న దారులను అశుభ్రం చేసేవారు.అతను పర్యటనకి వచ్చారే కానీ హింసని ఆపడానికి ఎటువంటి బలగాలను అక్కడకు పంపలేదు.
హిందువుల పైన ఈ పైశాచిక దాడులు కొనసాగుతూనే, హిందూ ఆలయాల పైన దాడులు చేశారు, తగలబెట్టారు,విగ్రహాలను దొంగిలించారు లేదా పగులగొట్టారు. ఇలా ఈ రాక్షస క్రీడ హిందువులను భయకంపితులను చేస్తూ,వారి మాన ప్రాణాలను దోచుకుంటూ,వారి ఆస్తిపాస్తులను దొంగలిస్తూ కొనసాగింది.గ్రామాల్లో హిందూ వ్యతిరేక పద్యాలు,పాటలు రాస్తూ బహిరంగంగా బజార్లలో వాటిని పాడేవారు.మత్స్యకారుల పైన కూడా నదుల్లో వేట కొనసాగిస్తుండగానే దాడులు చేసేవారు.కాంగ్రేస్ నాయకులను కూడా హత్య చేసి,కార్యాలయాలను దగ్ధం చేశారు.అక్టోబర్ 14 వరకు ఎలాంటి బలగాలను ఆ ప్రాంతాలకు పంపలేదు. అక్టోబర్ 16న బెంగాల్ ప్రధాన మంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రవర్ధి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, దాడులు జరిగాయి అని చెప్తూనే ఎందుకు జరిగాయో తనకు తెలియదని చెప్పాడు.కాలువలు జామ్ అయ్యి, రోడ్లు, వంతెనలు పాడవ్వడం వల్ల బలగాలు వెళ్ళలేకపోయాయి అని చెప్పారు.
దాడుల తర్వాత నోఖాలీలో 30 సహాయ సంస్థలు మరియు ఆరు వైద్య మిషన్ లు సహాయక చర్యలు చేపట్టారు.20శిబిరాలు ఏర్పాటు చేశారు.సహాయ సరుకులు రైలు ద్వారా పంపబడ్డాయి.కోల్కత్తా వచ్చిన బాధితులకు 60 శిబిరాలను ఏర్పాటు చేశారు.అపహరణకి గురైన మహిళలను తిరిగి తీసుకొని రావడం, రైల్వే స్టేషన్ లలో తల దాచుకున్న బాధితులకు సహాయం చేయడం వంటివి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసాయి. గాంధీ హిందూ మహిళల దుస్థితి,బాధితుల గురించి వివరిస్తూ శాంతియుతంగా మత సామరస్యం ఉండాలని కోరారు.
ప్రాణాలతో బయటపడిన వారు తిప్పేరా మరియు నౌఖాలీ నుండి పారిపియారు.ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినప్పుడు ఈ వలసలు ఆగాయి.కానీ 1947 మార్చిలో కాంగ్రెస్ భారత విభజనకి అంగీకరించినప్పుడు మాత్రం భయంతో వారు మళ్ళీ త్రిపుర, అస్సాం మరియు బెంగాల్ నుండి పశ్చిమ బెంగాల్ గా మారబోయే ప్రాంతాలకం భయంతో పారిపోయారు.దాదాపుగా 50,000 మంది శరణార్థులు అస్సాం లోని గౌహతికి పారిపోయారు.వీరిని తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా వీరి పైన దాడులు జరిగాయి.కానీ తర్వాత ఎవ్వరూ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళలేదు.బెంగాల్ ప్రభుత్వం ఏ వార్తా పత్రికలో ఈ వార్తలు రాకుండా చేసారు.పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అపవిత్రం చేయబడ్డాయి,అవమానించబడ్డాయి.అలా ఐదు నెలలు కంటే ఎక్కువ కాలమే ఈ ఊచకోతలు,బలవంతపు మత మార్పిడులు, మానభంగాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మార్చి 20న గ్రామాలలో ముస్లీం లు ఆ నెల 23వ తారీఖున పాకిస్థాన్ దినోత్సవం గా జరుపుకోవాలనీ, ప్రజలంతా రామ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనాపూర్ లో చేరుకోవాలనీ ప్రకటించి గులాం సర్వర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు.ఈ బహిరంగ సభని అప్శటి గాంధీ శాంతి మిషన్ లోని సభ్యులు, గాంధీ ఆపాలనుకున్నారు.కానీ మదర్సాలు,మసీదుల్లో చేసుకోవాలని కోరారు.కానీ పోలీస్ అధికారులు రెహన్ అలీ ఆ సభ ప్రైవేటు స్థలం అమ్తాలి మైదానంలో జరుగుతుందనీ, ప్రభుత్వం దాన్ని ఆపలేదనీ చెప్పారు.ఆరోజు 5000 మంది వరకూ ఆ సభకి హాజరయ్యారు.
ADVERTISEMET
వాటర్ హీటర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
Pigeon Amaze Plus Electric Kettle (14289) with Stainless Steel Body, 1.5 litre, used for boiling Water, making tea and coffee, instant noodles, soup etc. 1500 Watt (Silver)
మొత్తానికి ఈ ఊచకోత లో 5000 మంది హిందువులు చంపబడ్డారు, దాదాపుగా 4 లక్షల హిందూ జనాభా లో 3.5 లక్షల మంది మతం మార్చబడ్డారు.స్త్రీల పైన జరిగిన దాడులకు లెక్కే లేదు. ఇవి కొన్ని లెక్కలు మాత్రమే.
భారత విభజన సమయంలో మారణహోమం
విభజన సమయంలో పాకిస్తాన్ లో 7 మిలియన్ ల హిందువులు, సిక్కు లు చంపబడ్డారు, పారిపోయారు మరియు బలవంతంగా మతం మార్చబడ్డారు.
విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ లోని హిందువులు, సిక్కులు తీవ్రంగా నష్టపోయారు, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.
భారత దేశాన్ని భారత్, పాకిస్థాన్ గా విభజించినప్పుడు 4 మిలియన్ల మంది ముస్లీం లు ఆ దేశం పైన ప్రేమతో పాకిస్థాన్ వెళ్ళిపోయారు.అయితే అక్కడ 7 మిలియన్ ల మంది హిందువులు, సిక్కులు ఆ దేశం నుండి తరిమివేయబడ్డారు.1946 నుండి ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దాడులు పాకిస్థాన్ విభజన తర్వాత మరింతగా పెరిగిపోయాయి.18/12/1946లో మన్సేరా తహసీల్ లోని గర్హి హబిబుల్లాలో ఒక హిందువుని అపహరించి,హత్య చేసారు.అప్పటి నుండి హిందువుల పైన దాడులు పెరుగుతూనే వచ్చాయి.మిలటరీ సకాలంలో రాలేకపోయింది.దాంతో హిందూ, సిక్కులు ఊచకోతకు గురయ్యారు.విచ్చలవిడిగా హత్య గావించబడ్డారు.1946 డిసెంబర్ చివరి నాటికి హవేలియన్ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.ముస్లీం దోపిడీదారుల వల్ల హిందూ, సిక్కులు తమ ఇళ్ళను మరియు ఆస్తులను వదిలి పారిపోవలసి వచ్చింది.పంజాబ్ కి వచ్చి శరణు కోరాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.
అక్కడ హిందువులు మరియు సిక్కులు తమ పైన జరిగే దాడుల గురించి తెలియక ఆనందంగా గడుపుతున్నారు.వారు విభజన తర్వాత తమ ఆస్తులను,ఇళ్ళను చూసుకుంటూ తమ జన్మభూమి లోనే ఉండాలని పాకిస్థాన్ లోనే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.కానీ వారు ఊహించని విధంగా వారి పైన మెరుపు దాడులు జరిగాయి.
పశ్చిమ పంజాబ్ లోని అనేక ప్రాంతాలు హిందువులు మరియు సిక్కులను చంపడానికి లేదా తరిమివేయడానికి చేయవలసిన అన్ని కౄర చర్యలను అవలంబించారు ముస్లీం గూండాలు.
షేక్ పురా హిందువులు మరియు సిక్కులను రావల్పిండి మరియు ముల్తాన్ పాకిస్థానీ మతోన్మాదుల చేతిలో అత్యంత దారుణంగా బాధింపబడ్డారు.అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ దాడులు వల్ల రెండు రోజుల్లోనే 10,000 నుండి 20,000 మంది చనిపోయారు.వారు పారిపోవడానికి కూడా వారి వద్ద చాలా తక్కువ సమయం ఉంది.అయినా సాధ్యమైనంత మంది అక్కడ అన్నింటినీ వదిలి పారిపోయారు.దురదృష్టం ఏంటంటే?దీనిలో పాకిస్థాన్ ఆర్మీ కూడా పాలు పంచుకుంది.ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముస్లీమేతరులను తరిమి కొట్టడానికి ఈ దాడులు చేశారు.అక్కడ నుండి శరణార్ధ శిబిరాలకు తరలివెళ్లారు.అక్కడి నుండి కూడా తరిమివేయబడ్డారు.ప్రతి చోట హిందూ, సిక్కులు పైన దాడులు చేయబడుతున్నాయి,హత్యలు, మానభంగాలు,దహనాలు, దోపిడీలు సర్వసాధారణం అయిపోయాయి.
చివరికి అక్కడ ఇక ఉండలేమనీ, ప్రాణాలు కాపాడుకోవాలంటే పాకిస్థాన్ వదిలి పోవాలనీ నిర్ణయించుకుని హిందూ, సిక్కులు కాలి నడకన భారత్ కి బయలుదేరారు.వారి పైన కూడా దారిలో దాడులు,లూటీలు జరిగాయి.వారు కనీసం తిండి కూడా లేకుండా ఆకలి కడుపులతో, బాధాతప్త హృదయాలతో సర్వం కోల్పోయి అలా నడుచుకుంటూ వస్తున్నారు.చాలా మంది ముఖ్యంగా చిన్న పిల్లలు,ముసలి వాళ్ళు మార్గ మధ్యలో ఆకలితో చనిపోయారు.దారంతా శవాలు కుళ్ళిన కంపు కొడుతోంది.జంతువుల కళేబరాలు మార్గం మొత్తం ఉన్నాయి.ఏ కష్టం తెలియని గొప్ప ధనవంతులు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కొంత మంది రైళ్ళలో ప్రయాణిస్తున్న శరణార్థుల పైన కూడా దాడులు ఆగలేదు.వారు అప్పటికే ఆకలితో అలమటిస్తున్నారు.వాళ్ళని కాల్చి లేదా కత్తులతో చంపి వారి శవాలను రైళ్ళ నిండా భారత్ కి బహుమతి గా పంపారు ఆ రాక్షసులు.
కామోకే వద్ద ఇలాగే ఒక రైలుని ఆపి మగవాళ్ళని చంపి, చిన్న పిల్లలను దయా దాక్షణ్యాలు లేకుండా నేలకేసి కొట్టి చంపి స్త్రీలను ఎత్తుకుపోయారు.శవాలను భారత్ కి పంపారు.వారికి పాకిస్థాన్ మిలట్రీ సహాయపడింది.ముస్లీం మిలిటెంట్ల ఈ దుశ్చర్యలతో పంజాబ్ దగ్దమయ్యింది.
ముస్లీం ల దుశ్చర్యల వల్ల 70 లక్షల మంది ఇలా హత్య చేయబడి,తరిమివేయబడి, అత్యాచారాలకు గురై,అపహరణలకు గురై,తరిమివేయబడినప్పటికీ ఈ దుశ్చర్యల గురించి ఎక్కడా చరిత్రలో రాయలేదు.ఏ మానవ హక్కుల సంఘం దీన్ని ఖండించలేదు.ఎవ్వరూ దీనిని గురించి పట్టించుకోలేదు.ఇది యూదుల పైన జరిగిన దాడుల కంటే పెద్దది.అంతెందుకు ఆ దురదృష్టవంతుల తర్వాత తరాల వారికి కూడా వారి పూర్వీకుల కష్టాల గురించి తెలియదు.
మీర్పూర్ ఊచకోతలు
1947లో పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత అక్కడ హింస నుండి పారిపోయి హిందూ, సిక్కులు కాశ్మీర్ లోని మీర్పూర్ కి తరలి వచ్చారు.1947 ఆగస్టు నుండి మళ్ళీ అక్కడ హింస మొదలైంది.
అబ్దుల్ ఖయ్యూమ్ నాయకత్వం లో ముస్లీం మతోన్మాదులు గ్రూపులుగా ఏర్పడ్డారు.కాశ్మీర్ ని పాకిస్థాన్ లో కలపాలి అంటూ రెచ్చిపోయిన ముస్లీం మూకలు హింసని మొదలుపెట్టారు.దీనిలో బ్రిటిష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పని చేసిన మాజీ సైనికులు కూడా అందులో ఉన్నారు.ఈ తిరుగుబాటు దారుల్లో చాలా మంది తమ కుటుంబాలను పాకిస్థాన్ లోని పంజాబ్ లో వదిలిపెట్టి కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకొని వచ్చారు.
పరిస్థితి చేయి దాటిపోయింది అని మహారాజ హరిసింగ్ మార్షల్ లా ని విధించారు.కాశ్మీర్ లోని డోగ్రా దళాలు సెప్టెంబర్ నెలల్లో తిరుగుబాటు దారులను ఎదుర్కోన్నారు.కానీ ముస్లీం లు తమ పైన దాడి చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు.ఆ వాదనలు అర్ధం లేనివి.దళాలు తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుని వారి ఆధీనంలో ఉన్న నగరాలను స్వాధీనం చేసుకున్నారు.
కానీ తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లీం తిరుగుబాటుదారులు వచ్చారు.వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు.వారు మిలట్రీ లో ఆరితేరిన వారు మరియు ఆధునిక ఆయుధాలను ఉపయోగించడం కూడా తెలుసు.వాళ్ళు 5000 కంటే ఎక్కువ మంది 300 లారీలలో కాశ్మీర్ లోయలోకి ప్రవేశించారు.వారు ఎంత కౄరమైన దాడులు చేసారంటే 14000 మంది హిందూ జనాభా ఉండే బారాముల్లా లో ఊచకోత తర్వాత కేవలం 1000 మాత్రమే మిగిలారు.
కాశ్మీర్ యొక్క చివరి రాజు అయిన మహారాజ హరిసింగ్ ఎలాగైనా జనాన్ని కాపాడాలని అత్యవసర సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాడు.అయితే నెహ్రూ మరియు లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా పత్రం పై సంతకం చేసిన తర్వాత మాత్రమే సైన్యాన్ని పంపుతామన్నారు.
అక్టోబర్ 27,1947 లో కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా పత్రం పై సంతకం చేశారు.కానీ అప్పటికే మీర్పూర్ లో హిందువులు మరియు సిక్కులు ఊచకోతకు గురయ్యారు.
పాకిస్థాన్ నుండి వచ్చిన మతోన్మాదులు మీర్ పూర్ లో ఇళ్ళకు నిప్పు పెట్టి తీవ్రమైన దాడులు చేశారు, దీనికి కాశ్మీర్ సైన్యం తగినంత వేగంగా స్పందించ లేకపోయారు.పాకిస్తాన్ నుండి ఫిరంగులు కూడా కాల్చారు.ఆ దాడిలో వందల మంది అమాయకులు నరకయాతన అనుభవిస్తూ మరణించారు.దాదాపుగా ఇరవై వేల మంది హిందూ సిక్కులను పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసి అలీబేగ్ వైపు ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు.దారిలో పది వేల మంది పురుషులను చంపేశారు,ఐదు వేల మంది స్త్రీలను అపహరించి తీసుకొని వెళ్ళారు.మరొక ఐదు వేల మంది పురుషులు కొండలు,కోనలు దాటుకుంటూ చివరికి జైలు పాలయ్యారు.
ఈ దాడుల్లో పాకిస్థాన్ శరణార్ధులతో సహా దాదాపు ఇరవై వేల మందికి పైగా హత్య చేయబడ్డారు.
అలీబేగ్ గురుద్వారా సాహెబ్ జైలు గా మార్చబడింది.అక్కడ తప్పించుకున్న శరణార్ధులంతా బంధించబడ్డారు తర్వాత ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసారు.లైంగిక దాడులు నుండి కాపాడుకోవడానికి ఆర్య సమాజ్ నిర్వహిస్తున్న హాస్టల్ లోని పాఠశాల విద్యార్థినులను బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేసుకోమని చెప్పారు.అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ముస్లీం మతోన్మాదులు ఊచకోతకి పాల్పడిన తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన బంగారం,నగలు ఇళ్ళ నుండి దోచుకున్నారు.మార్చి 1948లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC)చే అలీబేగ్ జైలు నుండి రక్షించబడే సరికి 1600 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.1951 నాటికి ఆజాద్ కాశ్మీర్ లో మొత్తం 1,14,000 మంది నివాసితులు ఉండగా ఊచకోత తర్వాత 791 మంది సిక్కులు మరియు హిందువులు మాత్రమే మిగిలారు.శరణార్ధులుగా మిగిలిన వారు ఇప్పటికీ అలానే ఉన్నారు.ఎందుకంటే తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లే ధైర్యం కూడా లేదు వారికి.
ఈ అత్యంత పాశవికమైన ఆటవిక దాడులను ఏ మానవ హక్కుల సంస్థ గుర్తించలేదు.ఏ వార్తా పత్రికలో లేదా ప్రసార మాధ్యమాల్లో వీటి గురించి రాయలేదు,ప్రసారం చేయలేదు.వారికి ఎవ్వరూ అండగా నిలబడలేదు.ఇది ఊచకోతకు పాల్పడిన దుర్మార్గుల కంటే అన్యాయం.
ADVERTISEMET
అమేజాన్ లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
Dry Fruit Hub Healthy Raw Seeds Combo For Eating 600gms Pack OF 6 Each 100 gram, (Pumpkin Seeds, Sunflower, Sesame, Chia, Flax Seeds, Watermelon Seeds), Seeds Mix for Eating, All Seeds Combo Pack
మరి ఇప్పటికీ పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో సహా ఎన్నో దేశాల్లో హిందువుల పైన జరుగుతున్న దాడులు ఏ మీడియా సంస్థ చూపించదు.భూమి పైన అత్యధిక దాడులు ఎదుర్కొని నిలబడి ఉన్న పురాతన ధర్మం హైందవ ధర్మం.ఈ ధర్మం పైన దాడులు ఎప్పుడు ఆగుతాయో? ప్రపంచం హిందువులు అనుభవిస్తున్న బాధలు ఎప్పుడు గుర్తిస్తుందో?ఈ రోజు కేవలం హిందూ మతమే కాదు.చాలా సంస్కృతులు దాడులను ఎదుర్కొంటున్నారు.అలా ఇస్లామిక్ దాడులు ఎదుర్కుంటున్న వారిలో టర్కీ,ఇరాక్ మరియు సిరియా దేశాల్లో ఉగ్రవాద సంస్థ ISIS దయ వల్ల అతికొద్ది మంది మాత్రమే మిగిలి అంతరించిపోడానికి సిద్ధంగా ఉన్న యాజ్డి జాతి ఒకటి.వీరి సాంప్రదాయాలు మనకి దగ్గరగా ఉంటాయి.
కొన్ని వెబ్సైట్లు వికీపీడియా తో సహా, మరికొన్ని మీడియా సంస్థలు కలకత్తా లో జరిగిన దాడులు హిందూ ముస్లీం లకు జరిగిన మత కల్లోలాలుగా రాసాయి.అలాగే పాకిస్థాన్ లో హిందువుల పైన జరిగిన దాడులు ప్రతీకార చర్యలు అని రాసాయి.వాటి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఈ దుశ్చర్య గురించి మీ అభిప్రాయాలు కామెంట్ చేయడం మర్చిపోకండి.
చరిత్రలో ఎక్కడా చెప్పని ఈ మారణహోమాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది.ఖచ్చితంగా మీ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి.