NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత సైన్యం లోని వీర జాగిలాలు (కుక్కలు)
భారత సైన్యం లో జాగిలాలది చాలా ప్రముఖ పాత్ర ఉంది.ఎంతో మంది సైనికులతో పాటు కొన్ని జాగిలాలు కూడా దేశం కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాయి.
ఇప్పుడు ఆ జాగిలాల యూనిట్ల గురించి,వాటిని ఆర్మీలో ఎలా చేర్చుకుంటారు?ఏఏ జాతుల్ని చేర్చుకుంటారు? తెలుసుకుందాం.
మన జాగిలాల యూనిట్ల లో 25 పూర్తి యూనిట్లు,4 సగం యూనిట్లు ఉన్నాయి.పూర్తి యూనిట్లలో 24 జాగిలాలు,సగం యూనిట్లలో 12 జాగిలాలు ఉంటాయి.
ఏ జాతుల జాగిలాలను ఆర్మీలోకి తీసుకుంటారు?
మన జాగిలాల యూనిట్ల లో చాలా రకాల జాతుల జాగిలాలను తీసుకుంటున్నప్పటికీ, ముఖ్యంగా
లాబ్రెడర్స్,జర్మన్ షిఫర్డ్, బెల్జియన్ మాలినోయిస్ మరియు గ్రేట్ మౌంటెయిన్ స్విస్ డాగ్స్ ఉన్నాయి.
మన ఆర్మీలో ఈ జాగిలాల బాధ్యత ఏమిటి?
సైనిక జాగిలాలు అనేక రకాల విధులను నిర్వహిస్తాయి.అవి గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (IEDలు) సహా పేలుడు పదార్థాలను పసిగట్టడం, గనులను గుర్తించడం, డ్రగ్స్తో సహా నిషేధిత వస్తువులను పసిగట్టడం, సంభావ్య లక్ష్యాలపై దాడి చేయడం, దాచడం వంటివి ఉంటాయి.పరారీలో ఉన్న ఉగ్రవాదుల జాడ కనిపెట్టడం లాంటివి.
ప్రతి ఒక్క జాగిలానికి దానిని నడిపించే వ్యక్తి ఉంటాడు.వాళ్ళు ఈ జాగిలాలను బాధ్యత గా చూసుకుంటూ అవి చేయవలసిన పనులకు దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు.
జాగిలాల శిక్షణా పాఠశాల:
ఆర్మీ డాగ్లు మీరట్లోని రీమౌంట్ మరియు వెటర్నరీ కార్ప్స్ సెంటర్ మరియు స్కూల్లో శిక్షణ పొందుతాయి. 1960లో ఈ ప్రదేశంలో జాగిలాల శిక్షణా పాఠశాల ప్రారంభించబడింది. జాగిలాల జాతి మరియు అర్హత ఆధారంగా, వాటిని చేర్చడానికి ముందు వివిధ నైపుణ్య పరీక్షలు చేస్తారు.
జాగిలాల జీతం
జాగిలాలకు సైన్యంలో ర్యాంక్ వస్తుంది, కానీ జీతం ఇవ్వరు. కుక్కలకు ఆహారం మాత్రమే ఇవ్వబడుతుంది, ఇది డాగ్ హ్యాండ్లర్ యొక్క బాధ్యత.ఈ డాగ్ హ్యాండ్లర్లకు మంచి జీతం వస్తుంది.
సైనిక జాగిలాలు ఎంతకాలం సేవలో ఉంటాయి?
ఆర్మీ డాగ్లు సుమారు ఎనిమిది సంవత్సరాలు తమ సేవలను అందించిన తర్వాత వాటికి పదవీ విరమణ ఉంటుంది. ఆర్మీ జాగిలాల పదవీ విరమణ తర్వాత వాటిని అనాయాసంగా మార్చే పద్ధతి గతంలో ఉంది. 2015లో RTI ప్రత్యుత్తరం ఈ సమాచారాన్ని అందించడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ఈ విధానాన్ని సవరించారు.
దీనికి సంబంధించి 2016లో ఢిల్లీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది, జంతువులను అనాయాసంగా మార్చే విధానాన్ని సవరిస్తున్నామని, కుక్కలకు పునరావాసం కల్పిస్తామని అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ డిక్లరేషన్ సమర్పించారు.ఇకపై ఆర్మీ జాగిలాలు ఇకపై శాశ్వత నిద్రకు గురికావు.
భారతీయ సైనిక జాగిలాలకు ధైర్యానికి ఇచ్చే సత్కారాలు, అలంకరణలు ఉంటాయా?
భారతీయ సైన్యంలో, కుక్కలతో సహా అన్ని జంతువులకు, వాటి శౌర్యానికి మరియు విశిష్ట సేవలకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్, వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమెండేషన్ కార్డ్ అలాగే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కమెండేషన్ కార్డ్ను పొందేందుకు అర్హుత కలిగి ఉంటుంది. డాగ్ హ్యాండ్లర్లు కూడా శౌర్య పతకాలకు అర్హులు మరియు వారి కుక్కలతో ఆపరేషన్లలో పాల్గొంటున్నప్పుడు వారు చూపించే ధైర్య సాహసాలకు, శౌర్యానికి శౌర్య చక్ర మరియు సేన పతకాలను అందిస్తారు.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్ భారత్ ఆర్మీకి బలాన్ని చేకూరుస్తున్నాయి.ఇవి అత్యంత ధైర్య సాహసాలను కలిగి ఉంటాయి. కేవలం భారత్ లోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు.ఇప్పుడు మనం భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్ గురించి తెలుసుకుందాం.
1.బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్:
ఈ రెజిమెంట్ యొక్క ఆలోచన స్వాతంత్ర్యానంతరం భారత్ ఆర్మీ మొదటి కమాండర్ ఇన్ చీఫ్ మార్షల్ కరియప్ప గారిది.ఆయన ఈ రెజిమెంట్ ని ప్రారంభించినప్పుడు 'గార్డ్స్ శ్రేష్టమైన కాపలాదారులు' అని కొనియాడారు.
ఈ బ్రిగేడియర్ ఆఫ్ గార్డ్స్ రెజిమెంట్ యంత్రాలతో కూడిన ఆయుధాలను ఉపయోగిస్తారు. కొన్ని రెజిమెంట్ లలా భారత్ లోని ఒక ప్రాంతం వారిని ఒక సంస్కృతి కి చెందిన వారితో ఏర్పడింది కాకుండా మొత్తం భారతీయులందర్నీ,ఆర్మీలోని అన్ని తరగతులలో పని చేసే వారిని చేర్చుకుంటూ ఏర్పడిన మొట్టమొదటి రెజిమెంట్ ఇది.భారత స్వాతంత్ర్యం తర్వాత అత్యధిక యుద్ధ గౌరవ అవార్డులు పొంది రికార్డులు సృష్టించింది.
వీరి నినాదం:
పెహ్లే హమేషా పెహ్లే(మొదట ఎప్పుడూ మొదటే)
వీరి యుద్ధ నినాదం
గార్డ్ క హున్ బోల్ ప్యారే(మిత్రమా పలుకు, నేను కాపలాదారుల పుత్రుడను)
2.పారాచూట్ రెజిమెంట్:
ఈ పారాచూట్ రెజిమెంట్ గాలిలో నుండి పని చేసే భారత్ ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్ రెజిమెంట్.ఇది 1945 లో బ్రిటిష్ ఆర్మీ ప్రారంభించింది.కానీ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆపేసారు. తర్వాత మళ్ళీ 1952 లో ప్రారంభించారు.ప్రస్తుతానికి భారత్ ఆర్మీలో భాగంగా పని చేస్తుంది.ప్రస్తుతం ఇది పది స్పెషల్ ఫోర్సెస్ గా,ఐదు వాయు సేనలు, రెండు టెర్రిటోరియల్ ఆర్మీ మరియు ఒక రాష్ట్రీయ రైఫిల్ ని దీనిలో కలిపారు.
వీరి నినాదం:
గెలవాలి.
వీరి యుద్ధ నినాదం:
ప్రాణ త్యాగమే పరమ ధర్మం.
3.మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్:
ఈ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.దీనిలో 27 బెటాలియన్స్ ని కలిపి భారత దేశంలోని వివిధ ఆయుధ బలగాలకు పంపుతారు. బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ లోని 21 బెటాలియన్ లతో, యంత్ర ఆయుధాలను కలిగిన సాయుధ బలగాలతో కలిపి ఈ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో భాగంగా పని చేస్తుంది.
వీరి నినాదం:
శౌర్యం మరియు విశ్వాసం.
వీరి యుద్ధ నినాదం:
బోలో భారత్ మాతా కీ జై.
4.పంజాబ్ రెజిమెంట్:
పంజాబ్ రెజిమెంట్ అనేది ఇప్పుడు పని చేస్తున్న రెజిమెంట్ లలో రెండవ పురాతనమైనది.ఇది ఒక ప్రాంతానికి చెందిన అత్యంత అనుభవం కలిగిన ఆయుధాలు కలిగిన రెజిమెంట్.దీన్ని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1947 లో ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకు అనేక యుద్ధాల్లో మరియు దాడులలో పాల్గొంది.
స్వాతంత్ర్యం మరియు దేశ విభజనకు ముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో అనేక పంజాబ్ రెజిమెంట్స్ పని చేసేవి.వాటన్నిటినీ విలీనం చేసి 1వ పంజాబ్ రెజిమెంట్,2వ పంజాబ్ రెజిమెంట్, 8వ పంజాబ్ రెజిమెంట్,14వ పంజాబ్ రెజిమెంట్,15వ పంజాబ్ రెజిమెంట్ మరియు 16వ పంజాబ్ రెజిమెంట్ అనే ఆరు రెజిమెంట్ లుగా విభజించారు.
వీరి నినాదం:
ఖుష్కీ వ తారీ/స్థల్ వ జల్(భూమి మరియు సముద్రం ద్వారా)
వీరి యుద్ధ నినాదం:
జో బోలో సో నిహాల్,సత్ శ్రీ అకాల్(దేవుడిని సత్యం అని నమ్మేవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు).ఇది సిఖ్ఖుల నినాదం.
5.ది మద్రాస్ రెజిమెంట్:
ఈ మద్రాస్ రెజిమెంట్ భారత్ లోనే పురాతనమైన రెజిమెంట్ మరియు దీనిని 1750 లో ప్రారంభించడం జరిగింది.బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో ఉన్నప్పుడు మరియు స్వాతంత్ర్యం తర్వాత కూడా మద్రాసు రెజిమెంట్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొంది.
ఈ మద్రాస్ రెజిమెంట్ మొదట్లో 1660 లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసు యురోపియన్ రెజిమెంట్ గా ప్రారంభించారు.తర్వాత 1748 లో మేజర్ స్ట్రింగర్ లారెన్స్ కమాండ్ లో బెటాలియన్ గా చేర్చుకున్నారు.ఈ మద్రాస్ బెటాలియన్ భారత్ లో ఫ్రెంచి బలగాలతో జరిగిన ప్రతి యుద్ధం లోనూ పాల్గొన్నారు.
ఈ గ్రెనేడియర్స్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం. మొదట్లో ఇది బొంబే ఆర్మీలో భాగంగా పని చేసేది.స్వాతంత్ర్యం తర్వాత 4వ బొంబే గ్రెనేడియర్స్ గా పిలవబడుతుంది.
ఈ రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాలలోనూ మరియు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి వివిధ యుద్ధాలలోనూ ప్రముఖ పాత్ర వహించింది.ఈ రెజిమెంట్ అనేక యుద్ధ గౌరవాలను, శౌర్య పతకాలు పొందింది.వేరు వేరు యుద్ధాలలో మూడు పరమ వీర చక్ర అవార్డులను పొంది భారత దేశపు అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా పరిగణించబడుతుంది.
వీరి నినాదం:
సర్వదా శక్తిశాలి (ఎల్లప్పుడూ శక్తి కలిగి ఉంటాం)
వీరి యుద్ధ నినాదం:
సర్వదా శక్తిశాలి.
7.మరాఠ లైట్ ఇన్ఫాంట్రీ:
ఈ మరాఠ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అనేది భారత్ ఆర్మీ యొక్క తేలికైన పదాతిదళం.బొంబే సిపాయిల పేరుతో 1768 లో దీనిని ప్రారంభించడం వల్ల అత్యంత సీనియర్ పదాతిదళంగా అయింది. దీనిలోని సైనికులను పూర్వ మరాఠ సామ్రాజ్యం లో నుండి తీసుకోవడం జరుగుతుంది కనుక దీనికి మరాఠ పేరుని ఆపాదించారు.దాదాపుగా మహారాష్ట్ర మొత్తం నుండి దీని లోని సైనికులను తీసుకున్నప్పటికీ కొంత మందిని మాత్రం కూర్గ్ తో సహా కర్ణాటక లోని మరాఠ మాట్లాడే ప్రాంతాల నుండి కూడా తీసుకుంటున్నారు.1922లో ముంబయి ప్రావిన్స్ లో భాగంగా ఉన్న బెల్గామ్ లో రెజిమెంటల్ కేంద్రం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు.
వీరి నినాదం:
డ్యూటీ,హానర్,కరేజ్(కర్తవ్యం, నిజాయితీ, ధైర్యం).
యుద్ధ నినాదం:
బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై
8.రాజ్ పుతన రైఫిల్స్:
ఈ రాజ్ పుతన రైఫిల్స్ ఇండియన్ ఆర్మీ యొక్క మద్రాసు రెజిమెంట్ తర్వాత రెండవ రెజిమెంట్.ముందుగానే ఉన్న ఆరు రెజిమెంట్ లను కలిపి 6వ రాజ్ పుతన రైఫిల్స్ గా 6 బెటాలియన్ లను తయారు చేసినప్పుడు ఇది బ్రిటిష్ ఆర్మీలోని భాగంగా ఉండేది.
1945లో చాలా మంది అధికారులను తొలగించడం జరిగింది.1947 తర్వాత కొత్తగా ఏర్పడిన స్వాతంత్ర్య భారత్ ఆర్మీకి దీనిని బదిలీ చేసారు.స్వాతంత్ర్యం తర్వాత ఈ రెజిమెంట్ పాకిస్థాన్ తో ఏర్పడిన ఎన్నో గొడవల్లో పాలు పంచుకుంది.అలాగే కొరియా లో యునైటెడ్ నేషన్స్ ఒప్పందం ప్రకారం 1953-54 లో భారత కస్టోడియన్ ఫోర్స్ కి సహకారం అందించింది.అంతేకాక 1962 లో కాంగో లో జరిగిన యునైటెడ్ నేషన్స్ మిషన్ కి కూడా సహకారం అందించారు.
వీరి నినాదం:
వీర్ భోగ్య వసుంధర(ధైర్యవంతులు భూమిని వారసత్వం గా పొందుతారు.
యుద్ధ నినాదం:
రాజా రామచంద్ర కి జై.
9.ఝాట్ రెజిమెంట్:
ఝాట్ రెజిమెంట్ అనేది భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.అత్యధిక కాలం పని చేసిన మరియు ఎక్కువ మందికి తెలిసిన రెజిమెంట్ లలో ఇది ఒకటి.ఈ రెజిమెంట్ 1839 నుండి 1947 వరకు 19 యుద్ధ గౌరవాలను మరియు స్వాతంత్ర్యం తర్వాత 2 విక్టోరియా క్రాస్ లు,8 మహావీర్ చక్రాలు,8 కీర్తి వీర చక్రాలు,34 శౌర్య చక్రాలు,39 వీర్ చక్రాలు మరియు 170 సేన మెడళ్ళతో బాటు ఐదు యుద్ధ గౌరవాలను పొందింది.
తన 200 సంవత్సరాల సుదీర్ఘ సేవ సమయం లో ఈ రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాలలోనే కాక భారత్ మరియు అబ్రాడ్ లలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు.
వీరి నినాదం:
సంఝటన్ వ వీర్త(ఐక్యత మరియు శౌర్యం).
యుద్ధ నినాదం:
ఝాట్ బల్వాన్,జై భగవాన్ (జాట్ అనేది శక్తివంతమైనది, భగవంతుడికి విజయం కలుగుతుంది).
10.సిఖ్ఖ్ రెజిమెంట్:
ఈ సిఖ్ఖ్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.1979లో మొదటి బెటాలియన్ ఏర్పడినప్పుడు కామన్వెల్త్ లో స్వాతంత్ర్యానికి పూర్వం 245 మరియు స్వాతంత్ర్యం తర్వాత 82 శౌర్య పురస్కారాలతో అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా నిలిచింది.4వ బెటాలియన్ గా మారినప్పుడు యాంత్రిక ఆయుధాల రెజిమెంట్ గా అయింది.
మొదటి బెటాలియన్ 1846 ఆగస్టు 1న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అధికారికంగా ఏర్పడింది.మొదట్లో దీని కేంద్రం ఉత్తర ప్రదేశ్ మీరట్ లో ఉండేది.కానీ ప్రస్తుతం రామ్ గర్హ్ కంటోన్మెంట్, ఝార్ఖండ్ లో ఉంది.
వీరి నినాదం:
నిశ్చయ్ కర్ అప్నీ జీత్ కరోన్(సంకల్పం తో నేను విజయం సాధిస్తాను).
వీరి యుద్ధ నినాదం:
బోలో సో నిహాల్ సాత్ శ్రీ అకాల్(భగవంతుడిని గొప్పవాడు అని చెప్పేవాడిని శాశ్వతంగా ఆశీర్వాదం పొందుతాడు).
11.గోర్ఖా రైఫిల్స్:
1947లో భారత్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్-ఇండియా-నేపాల్ త్రైపాక్షిక ఒప్పందం లో భాగంగా ముందు నుండి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పని చేస్తున్న 6 గోర్ఖా రెజిమెంట్ లను భారత్ ఆర్మీలో కలిపారు.అప్పటి నుండి నేటి వరకు వారు మన ఆర్మీలో పని చేస్తున్నారు.ఈ ట్రూప్స్ లో ముఖ్యంగా నేపాల్ లోని గోర్ఖా జాతి వారి నుండి వస్తారు.
ఇంకా బ్రిటిష్ సైన్యం లో చేరడానికి అంగీకరించని ఏడవ మరియు పదవ గోర్ఖా రైఫిల్స్ ని కూడా స్వాతంత్ర్యం తర్వాత మన సైన్యం లో ప్రారంభించారు.
వీరి నినాదం:
యత్రహం విజయస్తత్ర(మేము విజయానికి రూపకం)
యుద్ధ నినాదం:
జై మహాకాళి,ఆయో గోర్ఖాలి!(కాళీమాత కి నమస్కారములు, ఇక్కడున్న వారము గోర్ఖాలము)
12.డోగ్రా రెజిమెంట్:
ఈ డోగ్రా రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఈ రెజిమెంట్ నేరుగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యొక్క 17వ డోగ్రా రెజిమెంట్ నుండి తీసుకొనబడింది.
ఈ డోగ్రా రెజిమెంట్ స్వాతంత్ర్యం అనంతరం దాదాపుగా భారత్ ఆర్మీ చేసిన ప్రతి ఒకైక యుద్ధం లోనూ పాల్గొన్నారు.ఇది భారత్ ఆర్మీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అలంకారమైన రెజిమెంట్.
వీరి నినాదం:
కర్తవ్యం అన్వాత్మ (మరణం కంటే కర్తవ్యం ముఖ్యమైనది).
వీరి యుద్ధ నినాదం:
జ్వాల మాత కి జై.
13.గర్వాల్ రెజిమెంట్:
ఈ గర్వాల్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఇది 1887 లో బెంగాల్ ఆర్మీలో 39వ గర్వాల్ రెజిమెంట్ గా ఆరంభించారు.తర్వాత బ్రిటిష్ ఆర్మీలో కలిపారు కానీ స్వాతంత్ర్యం అనంతరం ఇండియన్ ఆర్మీ లో భాగమైంది.
ఇది 19వ మరియు 20వ శతాబ్దం లో సరిహద్దు ఉద్యమాల్లో మరియు రెండు ప్రపంచ యుద్ధాలలోనూ అలాగే స్వాతంత్ర్యం అనంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు.దీనిలో ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని 7 జిల్లాలలోని గర్వాలీ ప్రజలతో ఏర్పడింది.
వీరి నినాదం:
యుద్ధాయ కృత్ నిశ్చయ(ధృడ సంకల్పంతో యుద్ధం చేయాలి).
యుద్ధ నినాదం:
బద్రీ విశాల్ లాల్ కి జై(బద్రీనాథ్ పుత్రులకు విజయం కలుగుతుంది).
14.కుమవోన్ రెజిమెంట్:
ఈ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పురాతన రెజిమెంట్ లలో ఒకటి.ఈ రెజిమెంట్ 18వ శతాబ్దం లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో మొదలై వారి ఆధ్వర్యంలో మరియు భారత్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగిన దాదాపు అన్ని పెద్ద యుద్ధాలలో పాల్గొంది.అలాగే రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్నారు.దాని వల్ల అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా పరిగణించబడుతుంది.
దీని కేంద్రం రాణిఖేడ్ లో ఉంది.దీనిలో కుమవోన్ లోని రాజ్ పుత్స్ ని, బ్రాహ్మణులను మరియు అహిర్స్ ని తీసుకొంటారు.
వీరి నినాదం:
పరాక్రమో విజయతే(శౌర్యం విజయం సాధిస్తుంది).
యుద్ధ నినాదం:
కాళికా మాత కి జై.
15.అస్సాం రెజిమెంట్:
ఈ అస్సాం రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఈ రెజిమెంట్ 15 నిత్యం పని చేసే బెటాలియన్ లను,3 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ లను,5 ప్రాదేశిక బెటాలియన్ లను మరియు 2 అటవీ ప్రాంత బెటాలియన్ లను కలిగి ఉంటుంది.దీనిలో 8 ఈశాన్య రాష్ట్రాల నుండి యువకులను తీసుకుంటారు.
వీరి నినాదం:
అసం విక్రమ్(ప్రత్యేక శౌర్యం)
యుద్ధ నినాదం:
రైనో ఛార్జ్(ఖడ్గ మృగంలా దాడి చేయాలి).
16.బీహార్ రెజిమెంట్:
ఈ బీహార్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క రెజిమెంట్.ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లోనే ప్రారంభమైంది.ఇది 1941 లోనే 11వ ప్రాదేశిక బెటాలియన్,19వ హైదరాబాద్ రెజిమెంట్ కలుపుకుని కొత్త బెటాలియన్ లగా ఏర్పడింది.ఈ బీహార్ రెజిమెంటల్ కేంద్రం బీహార్ లోని పాట్నా లో ఉంది.
భారత నావికా దళం యొక్క అతి పెద్ద మరియు విమాన వాహక ఓడ ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య ఈ రెజిమెంట్ కి అనుబంధం గా పని చేస్తుంది.భారత్ ఆర్మీ యొక్క అత్యంత అలంకారమైన మరియు కఠినతరమైన పోరాటం చేసే యూనిట్.అలాగే మొత్తం రెజిమెంట్ లలోఅత్యధిక రాష్ట్రీయ రైఫిల్స్ ని కలిగి ఉన్న రెజిమెంట్ ఇది.
వీరి నినాదం:
కరమ్ హై ధరమ్(కర్తవ్యమే నిజమైన భక్తి).
యుద్ధ నినాదం:
జై భజరంగ్ భళి మరియు బిర్సా ముండా కి జై.
17.మహర్ రెజిమెంట్:
ఈ మహర్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.నిజానికి ఈ రెజిమెంట్ లో మహారాష్ట్ర లోని మహర్షి వర్గానికి చెందిన వారిని ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వేరే వర్గాల వారిని కూడా తీసుకుంటున్నారు.
ఈ మహారాస్ అనే వారే నిజమైన మహారాష్ట్ర నివాసులుగా చెప్పుకుంటారు.ఈ వర్గం వారిని కతివాలె(కర్రని ధరించిన మనుషులు),భూమి పుత్ర,మిరాశి(భూస్వాములు) అని కూడా పిలుస్తారు. వీరి సంస్కృతి ప్రకారం బయట వ్యక్తుల నుండి, ఆక్రమణదారి జాతుల నుండి, నేరస్థుల నుండి, మరియు దొంగల నుండి వారి ప్రాంతాన్ని కాపాడుకోడానికి ప్రతి వ్యక్తి వారి పాత్రని పోషించాలి.అలాగే వారి ప్రాంతంలోని చట్టాలను కూడా అమలయ్యేలా చూడాలి.ఈ మహారాస్ అత్యంత పురాతన మరియు గర్వపడే ధైర్యవంతమైన సంస్కృతి ని కలిగి ఉంది.
వీరి నినాదం:
యష్ సిద్ది(సాధన&విజయం)
యుద్ధ నినాదం:
బోలో హిందుస్థాన్ కి జై
18.జమ్మూ&కాశ్మీర్ రైఫిల్స్:
ఈ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.ఇది జమ్మూ కాశ్మీర్ రాజ్యం ఉన్న సమయంలో జమ్మూ&కాశ్మీర్ స్టేట్ ఫోర్సెస్ లో ప్రారంభమైంది. 1947 అక్టోబర్ లో జమ్మూ&కాశ్మీర్ భారతదేశంలో కలిసినప్పుడు దీనిని భారత్ ఆర్మీ లోకి చేర్చారు.
1956లో జమ్మూ&కాశ్మీర్ అసెంబ్లీ పూర్తిగా భారత్ లో కలిసేంత వరకు ఈ రెజిమెంట్ దాని పూర్వ రూపంలోనే పని చేసేది. ఆ తర్వాత మాత్రమే స్టేట్ ఫోర్సెస్ జమ్మూ & కాశ్మీర్ రెజిమెంట్ గా రూపాంతరం చెందినది. 1963 లో జమ్మూ&కాశ్మీర్ రైఫిల్స్ గా మారింది. ఈ మార్పు తర్వాత లడక్ స్కౌట్స్ కూడా ఈ రెజిమెంట్ లోకి చేర్చారు. కానీ 2002 లో మళ్ళీ ఈ లడక్ స్కౌట్స్ ప్రత్యేక రెజిమెంట్ గా మారింది.
వీరి నినాదం:
ప్రశత రన్వీర్త(యుద్ధంలో శౌర్యమే కీర్తి గడుస్తుంది) .
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత వైమానిక దళ చరిత్ర
మన త్రివిధ దళాలలో ఒకటైన వైమానిక దళం ప్రపంచంలోనే మూడవ బలమైన, సమర్ధవంతమైన వైమానిక దళం గా పేరు పొందింది.ఇది భారత గగన తలాన్ని కాపాడుతూ యుద్ధ సమయంలో అవసరమైనప్పుడు శత్రు సేనల పైన దాడి చేస్తుంది.
1932 అక్టోబర్ 8న బ్రిటీష్ ప్రభుత్వం ప్రపంచ యుద్ద సమయంలో సహాయక వైమానిక దళంగా ఏర్పాటు చేశారు.అప్పుడు రాయల్ అనే పేరుతో ఈ వైమానిక దళాన్ని ఏర్పాటు చేశారు.
భారత వైమానిక దళం 1932 అక్టోబర్ 8న బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా ఆవిష్కరించబడింది.1932 భారత వైమానిక చట్టం ద్వారా రాయల్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం, బాడ్జీలు, చిహ్నాలు మరియు పత్రాలు ఆపాదించడం జరిగింది. 1933 ఏప్రిల్ 1న మొదటి స్క్వాడ్రన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు వెస్ట్ ల్యాండ్ వాపితి బైప్లాన్ మరియు 4 భారత పైలట్లతో ఈ స్క్వాడ్రన్ ఏర్పాటు జరిగింది. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిసిల్ బోచియర్ ఈ పైలట్లను ఎంపిక చేశారు.
watch airforce day celebrations live
2వ ప్రపంచ యుద్ధం:
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మొట్టమొదటి ఎయిర్ స్ట్రైక్ లోనే జపాన్ ఆర్మీని బర్మాలోనే ఆపడం లో భారత వైమానిక దళం ప్రముఖ పాత్ర వహించింది.ఈ మొదటి ఎయిర్ స్ట్రైక్ యొక్క లక్ష్యం ఆరకన్ లోని జపనీస్ మిలట్రీ బేస్. దాని తర్వాత వరుసగా నార్త్ థాయ్లాండ్ లోని ఛియాంగ్ రాయ్, మే హోంగ్సన్ మరియు ఛియాంగ్ మయ్ పైన దాడులు కొనసాగించారు.
యుద్ధ సమయంలో స్థిరంగా విస్తరించింది.అమెరికా లో తయారు చేసిన వుల్టీ వెంజెన్స్,డగ్లాస్ డకోటా,ద బ్రిటీష్ హాకర్ హరికేన్, సూపర్ మెరైన్ స్పిట్ ఫైర్ మరియు వెస్ట్ లాండ్ లిసేండర్ తో కలిపి కొత్త ఎయిర్ క్రాఫ్ట్ జతపడింది.
పరాక్రమవంతమైన భారత వైమానిక దళానికి గుర్తుగా కింగ్ జార్జ్ VI రాయల్ అనే పేరును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ముందు పెట్టారు.అప్పటి నుండి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పిలవబడేది.1950 లో భారత దేశం రిపబ్లిక్ గా ఏర్పడిన తర్వాత రాయల్ అనే పేరును తొలగించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే పేరును పెట్టడం జరిగింది.
స్వాతంత్ర్యానంతర మార్పులు:
1947 లో స్వతంత్ర భారతం ఏర్పడిన తర్వాత దేశాన్ని రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి పాకిస్థాన్ ని,భారత దేశాన్ని భౌగోళికంగా రెండు దేళాలుగా విభజించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని కూడా రెండు దేశాలకి విభజించారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గి ఉంచారు.కానీ 10 ఆపరేషనల్ స్క్వాడ్రన్స్ లో మూడు పాకిస్థాన్ కి ఇచ్చారు. ఇవి పాకిస్థాన్ బోర్డర్ లో ఉండేవి.పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ రాయల్ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ గా మార్చబడింది.తర్వాత అశోక చక్ర ని అనుసరించి రౌండల్ ని తయారు చేసారు.
1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాయల్ అనే పేరును తీయకుండానే డొమెనియన్ ఆఫ్ ఇండియా పేరును చేర్చి వైమానిక దళానికి నామకరణం చేశారు.కానీ 1950 లో ప్రభుత్వం మారినప్పుడు రాయల్ అనే పేరును పూర్తిగా తొలగించారు.
1950 నుండి ఇప్పటి వరకు మొత్తం పాకిస్థాన్ తో నాలుగు యుద్ధాల్లో మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్పగించిన అనేక ఆపరేషన్స్ లో పాల్గొంది.భారతీయ వైమానిక దళం తన పరిధిని శత్రు సేనలకు అందనంతగా పెంచుకుంది. అనేక సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో శాంతి ని పరిరక్షించే కార్యిలలో పాల్గొంది.
భారత వైమానిక దళం-దాని స్వరూపం:
వైమానిక దళానికి ముఖ్య అధికారిగా ఎయిర్ చీఫ్ మార్షల్ నాలుగు స్టార్లను కలిగి ఉంటారు. అతను భారతీయ వైమానిక దళం చేపట్టే ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్స్ నిర్వహించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.చరిత్రలో ఒకే ఒక్క సారి 26 జనవరి 2002 లో భారత రాష్ట్రపతి ఇండియన్ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ కి ఫైవ్ స్టార్ ర్యాంక్ ని ఇవ్వడం జరిగింది. అతను భారతీయ వైమానిక దళం లో ఐదు స్టార్ల ర్యాంకు ని పొందిన ఒకే ఒక్క ఎయిర్ మార్షల్ గా నిలిచాడు.
అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటారు.
1947 సాయుధ బలగాల చట్టం, భారత రాజ్యాంగం మరియు భార్ వైమానిక దళ చట్టం దృష్ట్యా భారత వైమానిక దళం భారతదేశం యొక్క ప్రతి ఒక్క భాగం కాపాడడానికీ, యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉండడం మరియు యుద్ధం తర్వాత అక్కడ ఉన్న బలగాలను తిరిగి అక్కడ నుండి తీసుకుని వెళ్ళడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. సాయుధ బలగాలతో కలిసి దేశాన్ని కాపాడుతూనే దేశ గగన తలాన్ని రక్షించాలి.యుద్ధ భూమిలో ఆర్మీకి వ్యూహాత్మకంగా సహాయపడడమే కాకుండా లాజిస్టిక్ మరియు ఎయిర్ లిఫ్టింగ్ లాంటి విషయాలలో సహాయపడుతూ ఉండాలి.
ADVERTISEMENT
PHILIPS BT1232/15 Skin-friendly Beard Trimmer - DuraPower Technology, Cordless Rechargeable with USB Charging, Charging indicator, Travel lock, No Oil Needed, Blue.
Great Indian Festival
-21%₹744₹744
M.R.P.: ₹945₹945
Fulfilled
Inclusive of all taxes
Save Extra with 4 offers
No Cost EMI:Avail No Cost EMI on select cards for orders above ₹3000DetailsNo Cost EMI:Avail No Cost EMI on select cards for orders above ₹3000Details
Bank Offer (12):10% Instant Discount up to INR 250 on RuPay Debit Cards. Minimum purchase of INR 2000See AllBank Offer (12):10% Instant Discount up to INR 250 on RuPay Debit Cards. Minimum purchase of INR 2000See All
ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ద్వారా పౌర రన్ స్పేస్ ఎక్సప్లొరేషన్ మరియు మిలిటరీ ఫాకల్టీ కలిసి సైన్యం అంతరిక్ష పరిశోధనలో ఆవిష్కరణల నుండి మంచి ఫలితాలను పొందుతారు.ఈ ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ని భారత సాయుధ దళాలు, పౌర అంతరిక్ష విభాగం మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తాయి.
భారత వైమానిక దళం సమర్ధవంతమైన మరియు కఠిన శిక్షణలు పూర్తి చేసుకున్న పైలట్లను మరియు సిబ్బంది ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి ఉండి సమర్ధవంతంగా పని చేస్తాయి.రెస్క్యూ మరియు కార్గో విమానాల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు వేగవంతంగా చేపడతారు, వారికి కావలసిన సామాగ్రిని అందిస్తారు.ఇలా ఎన్నోసార్లు తుఫాన్, సునామీ మరియు వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టారు. మన దేశం లోనే కాక శ్రీలంక లో రెయిన్ బో వంటి సహాయ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు.
భారత వైమానిక దళాన్ని ఐదు ఆపరేషనల్ కమాండ్స్ మరియు మూడు ఫంక్షనల్ కమాండ్స్ గా విభజించారు.ఆపరేషనల్ కమాండ్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించుకుని తమ పరిధిలో మిలట్రీ ఆపరేషన్స్ నిర్వహించాలి.యుద్ధానికి అన్నీ సిద్ధం చేయడం ఫంక్షనల్ కమాండ్స్ యొక్క బాధ్యత.ట్రయినింగ్ కమాండ్ బెంగళూరు పరిధిలోని హైదరాబాద్ లో గయిర్ ఫోర్స్ అకాడమీ లో ప్రాధమిక శిక్షణని నిర్వహిస్తారు.దాని తర్వాత వివిధ స్కూల్స్ లో ఆపరేషనల్ శిక్షణ పూర్తి చేయాలి.కమాండ్ పొసిషన్ కోసం ఆధునిక ఆఫీసర్ ట్రయినింగ్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో నేర్పుతారు.ప్రత్యేకమైన అత్యాధునిక ఫ్లైట్ శిక్షణ కేంద్రాలు బీదర్, కర్ణాటక మరియు హకీంపేట, తెలంగాణ లో ఉన్నాయి.టెక్నికల్ స్కూల్స్ దేశం లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి.
సెంట్రల్ ఎయిర్ కమాండ్(CAC):
*ఇది ప్రగ్యారాజ్, ఉత్తర ప్రదేశ్ లో ఉంది.
ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ (EAC):
*ఇది షిల్లాంగ్,మేఘాలయ లో ఉంది.
సౌతర్న్ ఎయిర్ కమాండ్(SAC):
*తిరువనంతపురం, కేరళ లో ఉంది.
సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్(SWAC):
*గాంధీ నగర్, గుజరాత్ లో ఉంది.
వెస్టర్న్ ఎయిర్ కమాండ్ (WAC):
*న్యూఢిల్లీ లో ఉంది.
ట్రయినింగ్ కమాండ్ (TC)+:
బెంగళూరు, కర్ణాటక లో ఉంది.
మెయింటనెన్స్ కమాండ్(MC)+:
నాగపూర్, మహారాష్ట్ర లో ఉంది.
వింగ్స్:
స్క్వాడ్రన్ మరియు కమాండ్ కి మధ్య సమన్వయకర్తగా పని చేసేదే ఈ వింగ్.సాధారణంగా ఒక ఫార్వార్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ల(FBSU)తో బాటు రెండు లేదా మూడు భారత వైమానిక స్క్వాడ్రన్ మరియు హెలికాప్టర్ యూనిట్లు ఉంటాయి. ఈ FBSU ఎప్పుడూ స్క్వాడ్రాన్ యూనిట్లు కానీ, హెలికాప్టర్ యూనిట్లు కానీ సొంతంగా నిర్వహించదు.కానీ సాధారణ ఆపరేషన్స్ లో విమాన నిర్వహణ ఆధారంగా పని చేస్తుంది.యుద్ధ సమయాల్లో మాత్రం పూర్తి ఆధారంగా మారి స్క్వాడ్రాన్స్ ని నడిపిస్తాయి.మొత్తమ్మీద 47 వింగ్స్ మరియు 19 FBSU లు భారత వైమానిక దళం తో బాటు ఉన్నాయి. వింగ్స్ అనేవి ఎయిర్ కమాండర్ ద్వారా నిర్వహించబడతాయి.
స్టేషన్స్:
ప్రతి ఆపరేషనల్ కమాండ్ దగ్గర ప్రతి చోటా ఉంటాయి.దాదాపుగా తొమ్మిది నుండి పదహారు స్టేషన్ లు లేదా బేసెస్ లు ఉన్నాయి.వింగ్స్ కంటే చిన్నవే, కానీ దాదాపుగా వాటి లాగానే పని చేస్తాయి.స్టేషన్స్ అనేవి గ్రూప్ కెప్టెన్ ల ద్వారా నిర్వహించబడే స్థిరంగా ఉండే యూనిట్లు.ఒక స్టేషన్ కి దాదాపుగా ఒక వింగ్ మరియు ఒకటి లేదా రెండు స్క్వాడ్రన్ లు కలిపి ఉంటాయి.
ADVERTISEMENT
Pigeon Amaze Plus Electric Kettle (14289) with Stainless Steel Body, 1.5 litre, used for boiling Water, making tea and coffee, instant noodles, soup etc. 1500 Watt (Silver)
స్క్వాడ్రన్స్ అనేవి స్థిరంగా ఉండే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫీల్డ్ యూనిట్లు.ఎగిరే స్క్వాడ్రన్స్ అనేవి ఎయిర్ ఫోర్స్ ఇచ్చే పనులను పూర్తి చేసే వైమానిక దళ స్టేషన్ యొక్క సబ్ యూనిట్లు.ఫైటర్ స్క్వాడ్రన్ అనేది దాదాపు 18 ఎయిర్ క్రాఫ్ట్ లను కలిగి ఉంటుంది.అన్ని ఫైటర్ స్క్వాడ్రన్ లు వింగ్ కమాండర్ ర్యాంక్ ఉన్న కమాండింగ్ ఆఫీసర్ ద్వారా నిర్వహించబడతాయి.కొన్ని రవాణా స్క్వాడ్రన్ లు మరియు హెలికాప్టర్ యూనిట్లు మాత్రం గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ ఉన్న కమాండింగ్ ఆఫీసర్ ద్వారా నిర్వహించబడుతాయి.
ఫ్లైట్స్:
ఫ్లైట్స్ అనేవి స్క్వాడ్రన్ యొక్క ఉప విభాగం.దీనిని స్క్వాడ్రన్ నాయకుడు నిర్వహిస్తాడు.ప్రతి ఫ్లైట్ రెండు సెక్షన్లు కలిగి ఉంటుంది.
సెక్షన్:
అతి చిన్న విభాగం ఈ సెక్షన్.ఫ్లైట్ లెఫ్టినెంట్ దీన్ని నిర్వహిస్తాడు.ప్రతి సెక్షన్ 3 ఎయిర్ క్రాఫ్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ క్రమ రూపంతో భారత వైమానిక దళం అనుదినం తమ ఆపరేషన్స్ కోసం చాలా సర్వీస్ బ్రాంచీలను కలిగి ఉంటుంది.అవి:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
PFI (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)
ఇప్పుడు దేశం మొత్తం ఈ సంస్థ గురించే చర్చలు.ఏ న్యూస్ ఛానల్ చూసినా, యూట్యూబ్ లో వీడియోలు ఊదరగొట్టేస్తున్నాయి.
అంతేకాదు NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చరిత్రలో తొలిసారిగా అతి పెద్ద దాడిని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో 300 మంది నియా అధికారులు నిర్వహించారు.ఈ దాడుల్లో pfi యొక్క రహస్య పత్రాలు,నిషేధిత సాహిత్యం ఎన్నో లభించాయి. దాదాపుగా 300 మందిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఈ PFI సంస్థని చివరికి బాన్ చేసారు.
అసలేంటి ఈ PFI?వీళ్ళు చేసిన తప్పు ఏంటి?వీళ్ళ దగ్గర లభించిన రహస్య పత్రాల్లో ఏముంది?PFI కి నిజంగానే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా?
ఒకసారి చూద్దాం:
నిషేధిత ఉగ్రవాద సంస్థ SIMI (స్టుడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా)ని నిషేధించినప్పుడు ఆ సంస్థలోని చాలా మంది నాయకులు బయటకి వచ్చి కేరళ లో నేషనల్ డెమోక్రటిక్ సంస్థని ఏర్పాటు చేసాయి.
తర్వత కాలంలో అంటే 2006 లో ఈ కేరళలోని నేషనల్ డెమోక్రటిక్ సంస్థ వీళ్ళలానే ఆలోచించే కర్ణాటక లోని ఫోరమ్ ఫర్ డిగ్నిటీ అనే సంస్థ మరియు తమిళనాడు లోని మనీదా నీది పసరై అనే సంస్థలతో కలిసి PFI(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)గా ఏర్పడ్డాయి.
ఈ కర్ణాటక లోని ఫోరమ్ ఫర్ డిగ్నిటీ సంస్థ అక్కడ కోస్టల్ ఏరియా లోని ముస్లిం యువతలో బాగా పాపులర్ అయిన సంస్థ.
వీళ్ళు మైనారిటీలు,దళితులలో సామాజికమైన,విద్యాపరమైన సంస్కరణలు తీసుకు రావడానికి ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టు పైకి చెప్పుకుంటారు.ఒక కేసులో కేరళ హైకోర్టు ఈ సంస్థని నిషేధిత ఉగ్రవాద సంస్థ SIMI కి ప్రతిరూపంగా చెప్పింది.
ఈ సంస్థకి అనుబంధం గా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(CFI),ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్(NWF), జూనియర్ ఫ్రంట్ మరియు ఎంపవర్ ఇండియా అనే సంస్థలే కాక మానవ హక్కుల కోసం పోరాడతామనే ముసుగులో నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్(NCHRO),సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామనే నెపంతో రియాద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి విదేశాల నుండి ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మరియు చైనా నుండి ఫండ్స్ ని సేకరించి PFI కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలన్నీ PFI కి అనుబంధం గా పని చేస్తున్నాయి.
PFI ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనకపోయినప్పటికీ SDPI (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి మద్దతు ఇస్తున్నారు.ఈ పార్టీ కర్ణాటక లోని స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లని కూడా గెలుచుకుంది.ఈ పార్టీ తమకి PFI తో సంబంధం లేదు అని చెప్పినప్పటికీ PFI కి రాజకీయ రూపమే ఈ పార్టీ అని చాలా మంది అభిప్రాయం.
మేము రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామని చెప్పినప్పటికీ వీళ్ళు చాలా హింసాయుత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.2010 లో కేరళ లో జోసెఫ్ అనే లెక్చరర్ క్వశ్చన్ పేపర్ కష్టంగా సెట్ చేసాడని దాడి చేసి గాయ పరిచారు.బంద్ లలో వీరి నినాదాలు కూడా హింసని ప్రేరేపించేలా ఉంటాయి.ఈ సంస్థ మొత్తం 26 రాష్ట్రాలకు పాకింది.15 రాష్ట్రాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తుంది.
మైనారిటీలకు సేవ చేస్తున్నామనే ముసుగులో ముస్లిం యువతను పోగు చేసి ఈ దేశం పైన ద్వేషాన్ని నూరిపోస్తూ ఈ దేశంలో ముస్లిం లను అణచి వేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అంటూ యువతని రెచ్చగొడతారు.
సెల్ఫ్ డిఫెన్స్,ఫిసికల్ ఫిట్నెస్ పేరుతో ఉగ్రవాద శిక్షణనిస్తారు.కత్తులు, కర్రలతో మనిషిని ఎక్కడ దాడి చేస్తే చనిపోతోడో చెప్తారు.మత విద్వేషాలు సృష్టించి,మత కల్లోలాలు సృష్టించడం ఎలానో నేర్పిస్తారు.అన్నిటి కంటే వీరికి మతోన్మాదం ముఖ్యం.యువతను ఉన్మాదులుగా మారుస్తారు.ఇంట్లో కారంపొడి లాంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని చెప్తారు.ఇప్పటి వరకు వందల మందిని ఇలాంటి శిక్షణనిచ్చి తయారు చేసారు.హిందూ సంస్థలు,నాయకుల పైన నిఘా ఉంచే నిఘా వ్యవస్థని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఆఖరికి వాళ్ళు సొంతంగా ప్రధాన మంత్రుల్ని,దేశాధ్యక్షుల్ని ప్రకటించేసుకుని కేరళలో ప్రమాణ స్వీకారం చేసి, సైనిక కవాతులు కూడా చేసుకుంది.ఆర్.ఎస్.ఎస్. లాంటి హిందూ సంస్థలకి వ్యతిరేకంగా పని చేయాలని చెప్తారు.మా తప్పు లేకుండా మిమ్మల్ని అణచి వేయాలని ఇలా చేస్తున్నారని వారు చెప్తున్నా ఇస్లాం ని అవమానించారు అని ఎన్నో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారు.
*కన్హయ్యా లాల్ అనే టైలర్ ని రాజస్థాన్ లో కర్కశంగా పీక కోసి చంపిన వాళ్ళు వీరే.
*తూర్పు ఢిల్లీ లో అల్లర్లు సృష్టించిన వాళ్ళు వీరే.
*CAA కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రోడ్లని నిర్భంధించిందీ వీళ్ళే.
*హత్రాస్ లో ఏదో జరిగింది అని దేశ వ్యాప్తంగా పెద్ద ఇష్యూ చేయాలని ప్రయత్నించిందీ వీళ్ళే.
అల్లర్లకు,అలజడులకు,మత ఉద్రిక్తత లకు,శోభా యాత్రల పైన, ధార్మిక కార్యక్రమాల పైన దాడులకు PFI యత్నాలు చేసింది.
కేరళ, కర్నాటక, భైంసా, కర్నూలు దగ్గర నంద్యాల, తమిళనాడు లో ఇలా ఎన్నో దాడుల్లో వీరి హస్తం ఉంది.
బీహార్ లో ఒక క్యాంపు పైన, నిజామాబాద్ లో ఒక క్యాంపు పైన దాడి చేసి వారు ఆ కేసుల్లో బిసీగా ఉండేటట్లు చేసి వారు పసిగప్టకుండా దేశ వ్యాప్తంగా ఒకేసారి దాడి చేసారు.మూడు నెలలుగా పథకం వేసి ప్రతి ప్రాంతం,ప్రతి సభ్యుడు ఇలా అన్ని వివరాలు సంపాదించి వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా ఒకేసారి దాడి చేసారు.6000 వరకు నకిలీ అకౌంట్ లు సృష్టించి 100 కోట్ల వరకూ మనీ లాండరింగ్ చేసారని భావిస్తున్నారు.
సిమి ని బాన్ చేసినప్పుడు సిమి తనకు తానే తమ సంస్థని ఆపివేస్తున్నట్టు ప్రకటించుకుని ఆ సభ్యులు వేరే సంస్థల్లో చేరారు.దాంతో అప్పుడు అరెస్టు చేయడానికి ఎవ్వరూ దొరకలేదు.
కానీ ఈసారి అలా జరగకుండా ముందుగా అన్ని ఆధారాలు సంపాదించి అరెస్టులు చేసి తర్వాత నిషేధం విధించింది.
2022 జులై నెలలో బీహార్ లోని పుల్వారీ షరీఫ్ లో అక్కడి పోలీసులు దాడి చేసి అక్కడ ఆయుధ శిక్షణనిస్తున్న PFI లీడర్ని అరెస్టు చేసినప్పుడు అక్కడ 8 పేజీల రహస్య పత్రం లభించింది. అది చదివితే సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. భద్రతా ఏజెన్సీలు కూడా దిగ్భ్రాంతికి గురి అయ్యారు.అప్పటి నుండి దర్యాప్తు చేస్తే మొత్తం డాక్యుమెంట్లు అన్నీ బయటపడ్డాయి.
వాటిలోని ముఖ్యమైన పాయింట్లు:
విజన్ 2047:
2047 కల్లా ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి.షరియా చట్టం తీసుకురావాలి.
భారత దేశంలో ముస్లిం ల పరిస్థితి:
ఈ దేశంలో ముస్లిం ల పైన,మదర్సాల పైన దాడులు జరుగుతున్నాయి,అణగదొక్కుతున్నారు అని ముస్లిం యువతను రెచ్చగొట్టాలి.
2047 కల్లా ఇస్లాం రాజ్యం తేవడానికి చేయాల్సిన పనులు:
ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడిని చేర్చాలి, కుదరకపోతే సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల ద్వారా తమ పోరాటాన్ని ఇంటింటికీ ప్రచారం చేయాలి.ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు అని నమ్మించాలి.
రిక్రూట్మెంట్ మరియు శిక్షణ:
యోగా పేరుతో ఆయుధ శిక్షణ, అందుబాటులో ఉన్న వస్తువులతో పేలుడు పదార్థాలు తయారు చేయడంలో శిక్షణ ఇవ్వడం, వాటిని హిందువుల పైన ఉపయోగించడం నేర్పిస్తారు.
ఆర్.ఎస్.ఎస్. మరియు ఇతర హిందూ సంస్థల సమాచారాన్ని సేకరించడానికి నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు.నాగ్ పూర్ ఆర్.ఎస్.ఎస్. కార్యాలయం పై రెక్కీ కూడా నిర్వహించారు.
మెజారిటీ హిందువుల్లో లోపాలను వివరించడం, ప్రపంచాన్ని అల్లానే సృష్టించాడు, అల్లానే ఈ ప్రపంచానికి ప్రభువు అని చెప్పడం.సోషల్ మీడియా ద్వారా బెదిరించడం,కోర్టుల్లో పిటిషన్లు వేయడం ఇలా ప్రతి దానికి ఒక విభాగం ఉంటుంది.
ప్రజల్లో భయాన్ని సృష్టించి ఓట్లు తమకి అనుకూలంగా వేయించి నాయకులతో తమకు నచ్చినట్లు పని చేయించుకోవడం,ఎస్.సి.,ఎస్.టి, ఒబిసిలలో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆర్.ఎస్.ఎస్. పైన హిందూ జాతి పైన విద్వేషాలు రెచ్చగొట్టి చివరికి మారణహోమం సృష్టించడం వంటివి ఉన్నాయి.
కేరళ, కర్నాటక, రాజస్థాన్, బెంగాల్ లో ఎంతోమంది ఆర్.ఎస్.ఎస్., హిందూ నాయకులు మరణించారు.
హిందువుల అభివృద్ధి చెందిన మౌలిక వసతులను నాశనం చేయాలి.ఆలయాలు, హిందూ సంఘాలు, హిందూ నాయకులు,బాబాలు, స్వామీజీలు అన్నింటినీ.
చిన్న పనితో అంటే బాంబు దాడి లాంటి వాటితో అందరికీ వారి గురించి తెలిసేలా చేయాలి.వారి దేవుడిని నమ్మని వారిని భయపెట్టాలి.
అరెస్టు తర్వాత కూడా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల ఇళ్ళపై పెట్రోల్ బాంబుల దాడులు.
భారత ఉపఖండంలో వారి ఆధిపత్యం సాధించాలి.
ADVERTISEMENT
VIMAL JONNEY Men's Regular Fit Trackpants Pack of 3
ఈ రహస్య డాక్యుమెంట్లతో బాటు జీహాదీ సాహిత్యం,డబ్బుతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.షార్ట్ కోర్స్ ఆన్ ఐఇడి బాంబ్స్ మేకింగ్ పుస్తకాలు కూడా దొరికాయి.దేశంలో ఎన్ని రకాలుగా కలహాలు, యుద్ధాలు సృష్టించాలి చెప్పే పుస్తకాలు ఉన్నాయి.
PFI నేషనల్ సెక్రెటరీ నసీముద్దీన్ పైన 10 కి పైగా కేసులున్నాయి.ఇతర సభ్యులు కొయ్యె, అబ్దుల్ రెహ్మాన్,అనిస్ అహ్మద్ లాంటి వాళ్ళు నిషేధిత సంస్థ SIMI కి ప్రధాన బాధ్యతలు నిర్వహించారు.
ఒకవేళ ఇప్పటికీ దొరకక పోతే ఆర్.ఎస్.ఎస్.,బి.జె.పి. నాయకులను టార్గెట్ చేసుకుని ఈ దసరా కి భారీ కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాక పెద్ద పెద్ద పోలీస్ అధికారులు పైన కూడా.
PFI తెలంగాణ ఉపాధ్యక్షుడు అహన్ ఆచూకీ తెలియలేదు.దాడులు ఎలా చేయాలి? విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలి? ఆయుధాలు లేకుండా ఎలా విద్వేషాలు రెచ్చగొట్టాలి అని శిక్షణ ఇవ్వడం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ ఏడాది జులై 12న ప్రధాని పాట్నా పర్యటనలో దాడి చేసేందుకు బాగా శిక్షణ పొందిన నిష్ణాతులతో విఫలయత్నం చేసినట్లు తెలిపారు.PFI పై NIA దాడులు తర్వాత కేరళలో బంద్ నిర్వహించారు.ఇది కూడా హింసారూపం దాల్చింది.బస్సులు,ఆటోలు,కార్లు ధ్వంసం చేస్తున్నారు.
PFI ని నిషేధించినప్పుడు అంతర్జాతీయంగా ఎటువంటి వ్యతిరేకత రాకుండా ముందుగా ISIS లాంటి బ్యాన్ చేసిన ఉగ్రవాద సంస్థలతో వారికున్న సంబంధాల్ని ఆధారాలతో సహా చూపించారు. PFI ISIS కి యువతను ఎలా చేరుస్తున్నారు?వాళ్ళకి కావలసిన వస్తువులను ఎలా సమకూరుస్తున్నారు అనే విషయాలను బట్టబయలు చేశారు.ప్రజలకి ఈ సంస్థ ఎంత ప్రమాదకరమో తెలియజేయడంలో సఫలమైంది.అందుకే ప్రజల నుండి బాన్ చేయాలి అనే డిమాండ్ వచ్చింది.ఈ డిమాండ్ మొట్టమొదట కేరళ, ఝార్ఖండ్ ల నుండి వచ్చింది.ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే ముస్లిం రాజకీయ పార్టీలు కూడా PFI బ్యాన్ ని సమర్ధించారు.
ADVERTISEMENT
TRAWOC 80L Travel Backpack for Outdoor Sport Camp Hiking Trekking Bag Camping Rucksack HK007 (Grey) 1 Year Warranty
కేంద్ర ప్రభుత్వం గత ఐదారు సంవత్సరాలుగా మొత్తం అన్ని PFI సంస్థల పైనా నిఘా పెట్టింది.ఎంపవర్ ఇండియా అనే మొబలైజేషన్ వింగ్ పైన కూడా. గూఢచారుల్ని ఆ సంస్థ లోకి పంపి ఆ సంస్థల మూలాలు,వ్యాప్తి,మనీ లాండరింగ్, స్లీపర్ సెల్స్ లాంటి అన్ని విషయాలను తెలుసుకున్నారు.తర్వాత చాలా రాష్ట్రాల్లోని ఈ సంస్థ సభ్యులను అరెస్ట్ చేశారు.
అరెస్టు తర్వాత కూడా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల ఇళ్ళపై పెట్రోల్ బాంబుల దాడులు.
సెప్టెంబర్ 22,25 తేదీల్లో రైడ్స్ చేసి ఆర్ధిక లావాదేవీలు,అకౌంట్లు, కార్యకలాపాలు అన్నీ స్తంభింపజేసి PFI నెట్వర్క్ మొత్తం కుప్పకూలేటట్లు చేసారు.UAPI చట్టాన్ని ఉపయోగించి బ్యాన్ చేసారు.దీని వల్ల ఈ సంస్థలకి ఫండ్స్ పంపే వ్యక్తులు, మీటింగ్ లు పెట్టే ఇళ్ళు, కార్యాలయాలు అన్నిటి పైన కేసులు పెట్టి చర్యలు తీసుకోవచ్చు.
PFI ఒక చక్రం,దాని అనుబంధ సంస్థలు చుట్టూ ఉండే పని చేస్తున్నట్టు HUB&FOKES అని అభివర్ణించారు.చాలా రోజుల నుండి PFI పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వం పైన ఎంత విమర్శలు వినిపిస్తున్నా కంగారు పడకుండా జాగ్రత్తగా పూర్తి సమాచారం సేకరించి వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా దాడులు చేశారు.మొట్ట మొదట దాడి జరిగినప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యాన్ తర్వాత ఎక్కడా చిన్న వ్యతిరేకత కూడా కనిపించలేదు.29 ఉదయం 5 గంటలకు బ్యాన్ విధించారు.
UAPI చట్టం వల్ల అరెస్టు అయిన వారిని ఎటువంటి విచారణ లేకుండా 60 నుండి 180 రోజుల వరకు జైల్లో ఉంచవచ్చు.150 రోజుల్లోగా మరొక కేసు పెడితే ఇంకొక 180 రోజులు జైల్లో ఉంచవచ్చు.
దేశం లో అన్ని ఉగ్రవాద సంస్థల్ని 5 ఏళ్ళ పాటు బ్యాన్ చేసే చట్టాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి.రాజ్యాంగాన్ని అనుసరించి 5 ఏళ్ళ పాటు PFI మరియు దాని అనుబంధ సంస్థలను బ్యాన్ చేసారు.తర్వాత ఒకవేళ ఇంకా వాళ్ళలో మార్పు రాలేదంటే మరొక 5 ఏళ్ళు అలా పొడిగిస్తూ ఉండవచ్చు.
SDPI రాజకీయ పార్టీని మాత్రం బ్యాన్ చేయలేదు.ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం 2006 లో రిజిస్టర్ చేసింది. SDPI కి PFI మద్దతు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ఆధారాలు లేవు.అలాగే దేశ వ్యతిరేక నినాదాలు ఎప్పుడూ ప్రత్యక్షంగా చేయలేదు.ఒకవేళ దీని పైన చర్యలు తీసుకోవాలంటే ఎన్నికల సంఘం మాత్రమే తీసుకోవాలి.