NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత సైన్యం లోని వీర జాగిలాలు (కుక్కలు)
భారత సైన్యం లో జాగిలాలది చాలా ప్రముఖ పాత్ర ఉంది.ఎంతో మంది సైనికులతో పాటు కొన్ని జాగిలాలు కూడా దేశం కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాయి.
ఇప్పుడు ఆ జాగిలాల యూనిట్ల గురించి,వాటిని ఆర్మీలో ఎలా చేర్చుకుంటారు?ఏఏ జాతుల్ని చేర్చుకుంటారు? తెలుసుకుందాం.
మన జాగిలాల యూనిట్ల లో 25 పూర్తి యూనిట్లు,4 సగం యూనిట్లు ఉన్నాయి.పూర్తి యూనిట్లలో 24 జాగిలాలు,సగం యూనిట్లలో 12 జాగిలాలు ఉంటాయి.
ఏ జాతుల జాగిలాలను ఆర్మీలోకి తీసుకుంటారు?
మన జాగిలాల యూనిట్ల లో చాలా రకాల జాతుల జాగిలాలను తీసుకుంటున్నప్పటికీ, ముఖ్యంగా
లాబ్రెడర్స్,జర్మన్ షిఫర్డ్, బెల్జియన్ మాలినోయిస్ మరియు గ్రేట్ మౌంటెయిన్ స్విస్ డాగ్స్ ఉన్నాయి.
మన ఆర్మీలో ఈ జాగిలాల బాధ్యత ఏమిటి?
సైనిక జాగిలాలు అనేక రకాల విధులను నిర్వహిస్తాయి.అవి గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (IEDలు) సహా పేలుడు పదార్థాలను పసిగట్టడం, గనులను గుర్తించడం, డ్రగ్స్తో సహా నిషేధిత వస్తువులను పసిగట్టడం, సంభావ్య లక్ష్యాలపై దాడి చేయడం, దాచడం వంటివి ఉంటాయి.పరారీలో ఉన్న ఉగ్రవాదుల జాడ కనిపెట్టడం లాంటివి.
ప్రతి ఒక్క జాగిలానికి దానిని నడిపించే వ్యక్తి ఉంటాడు.వాళ్ళు ఈ జాగిలాలను బాధ్యత గా చూసుకుంటూ అవి చేయవలసిన పనులకు దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు.
జాగిలాల శిక్షణా పాఠశాల:
ఆర్మీ డాగ్లు మీరట్లోని రీమౌంట్ మరియు వెటర్నరీ కార్ప్స్ సెంటర్ మరియు స్కూల్లో శిక్షణ పొందుతాయి. 1960లో ఈ ప్రదేశంలో జాగిలాల శిక్షణా పాఠశాల ప్రారంభించబడింది. జాగిలాల జాతి మరియు అర్హత ఆధారంగా, వాటిని చేర్చడానికి ముందు వివిధ నైపుణ్య పరీక్షలు చేస్తారు.
జాగిలాల జీతం
జాగిలాలకు సైన్యంలో ర్యాంక్ వస్తుంది, కానీ జీతం ఇవ్వరు. కుక్కలకు ఆహారం మాత్రమే ఇవ్వబడుతుంది, ఇది డాగ్ హ్యాండ్లర్ యొక్క బాధ్యత.ఈ డాగ్ హ్యాండ్లర్లకు మంచి జీతం వస్తుంది.
సైనిక జాగిలాలు ఎంతకాలం సేవలో ఉంటాయి?
ఆర్మీ డాగ్లు సుమారు ఎనిమిది సంవత్సరాలు తమ సేవలను అందించిన తర్వాత వాటికి పదవీ విరమణ ఉంటుంది. ఆర్మీ జాగిలాల పదవీ విరమణ తర్వాత వాటిని అనాయాసంగా మార్చే పద్ధతి గతంలో ఉంది. 2015లో RTI ప్రత్యుత్తరం ఈ సమాచారాన్ని అందించడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ఈ విధానాన్ని సవరించారు.
దీనికి సంబంధించి 2016లో ఢిల్లీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది, జంతువులను అనాయాసంగా మార్చే విధానాన్ని సవరిస్తున్నామని, కుక్కలకు పునరావాసం కల్పిస్తామని అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ డిక్లరేషన్ సమర్పించారు.ఇకపై ఆర్మీ జాగిలాలు ఇకపై శాశ్వత నిద్రకు గురికావు.
భారతీయ సైనిక జాగిలాలకు ధైర్యానికి ఇచ్చే సత్కారాలు, అలంకరణలు ఉంటాయా?
భారతీయ సైన్యంలో, కుక్కలతో సహా అన్ని జంతువులకు, వాటి శౌర్యానికి మరియు విశిష్ట సేవలకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్, వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమెండేషన్ కార్డ్ అలాగే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కమెండేషన్ కార్డ్ను పొందేందుకు అర్హుత కలిగి ఉంటుంది. డాగ్ హ్యాండ్లర్లు కూడా శౌర్య పతకాలకు అర్హులు మరియు వారి కుక్కలతో ఆపరేషన్లలో పాల్గొంటున్నప్పుడు వారు చూపించే ధైర్య సాహసాలకు, శౌర్యానికి శౌర్య చక్ర మరియు సేన పతకాలను అందిస్తారు.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత్ ఆర్మీ యొక్క ప్రత్యేక దళాలు(స్పెషల్ ఫోర్సెస్)
భారత దేశం కొన్ని ప్రత్యేక దళాలను కలిగి ఉంది.మొత్తం మూడు సైనిక,నావికా, వైమానిక దళాలు విడి విడిగా వాటి ప్రత్యేక దళాలను కలిగి ఉన్నాయి.
భారత్ ఆర్మీ పారా ఎస్.ఎఫ్. దళాలను, నావికా దళం మర్కోస్ దళాలను, వైమానిక దళం గార్డ్ కమాండో దళాలను కలిగి ఉన్నాయి. అలాగే ఆర్మీ తో సంబంధం లేని భారత్ హోం శాఖ ద్వారా నడిపే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు రిసెర్చ్ మరియు ఎనాలిసిస్ సంస్థ యొక్క ప్రత్యేక దళాలు కూడా పని చేస్తున్నాయి.ప్రత్యేక దళాల నుండి ప్రత్యేకమైన నియంత్రణ పద్ధతులు కలిగిన చిన్న సమూహాలు స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ లో నియమింపబడ్డారు.
భారత్ యొక్క నిఘా వ్యవస్థ రిసెర్చ్ మరియు ఎనాలిసిస్ వింగ్ స్పెషల్ గ్రూప్ మరియు స్పెషల్ ఫ్రెంటియర్ గ్రూప్స్ అనే ప్రత్యేక దళాలను కలిగి ఉంటుంది.
భారత్ ఆర్మీ:
పారా ఎస్.ఎఫ్.:
పారా ట్రూపర్స్ లేదా పారా ఎస్.ఎఫ్. అనేది భారత్ ఆర్మీ కి చెందిన ప్రత్యేక దళం.ఇది 1965 పాకిస్థాన్ తో యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఏర్పడింది.1965 లో పాకిస్థాన్ తో యుద్ధం వల్ల అప్పటికప్పుడు మేఘదూత్ ఫోర్స్ అనే పేరుతో ఏర్పాటు చేసిన బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్ లో పని చేసే శాశ్వత పారా కమాండో బెటాలియన్ గా ఏర్పడింది.1969 లో యూనిట్ 9 పారా మరియు 10 పారా పేర్లతో రెండు బెటాలియన్ లుగా ఎదిగింది.ఈ యూన
ఈ యూనిట్ మొదటి పోరాటం 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం మొదలైంది.
1988 లో భారత సాయుధ దళాలు వీదేశీ జోక్యం ఉన్న ఏకైక చర్యకు పారా నాయకత్వం వహించి మాల్దీవుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాయి.ఈ చర్య పేరు ఆపరేషన్ కాక్టస్.అప్పట్లో అక్కడ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ ప్రభుత్వం పైన ఏర్పడిన తిరుగుబాటును అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ కాక్టస్ నిర్వహించారు. 1980ల చివరలో శ్రీలంకలో భద్రతా కార్యకలాపాలు నిర్వహించడానికి హెలికాప్టర్ ల ద్వారా దాడులు చేయడానికి ఆ దేశం లో మోహరించారు.
1990ల నుండి పారా ఎస్.ఎఫ్. కాశ్మీర్ లోని తిరుగుబాటు దారులను అడ్డుకుంటూ ఉగ్రవాదులను అణచివేయడానికి పోరాడుతున్నారు.ఆకస్మిక దాడులు కూడా చేస్తూ ఉంటారు.1999లో కార్గిల్ యుద్ధం లో భాగంగా పాకిస్థాన్ పదాతి దళాలు మరియు ప్రత్యేక దళాలతో తలపడ్డారు.2002 లో సియెర్రా లియోన్ లో ఐక్య దేశాల శాంతి కార్యక్రమాలు నిర్వహించడానికి వెళ్ళి అక్కడ తీవ్రవాదుల చేతుల్లో చిక్కుకుపోయిన 223 మంది 5/8 గోర్ఖా రైఫిల్స్ సైనికులను కాపాడడానికి 2 పారా ఎస్.ఎఫ్. ఆపరేషన్ ఖుఖ్రీ లో పాల్గోన్నారు.అలాగే ఆ తర్వాత మయన్మార్ లోని ప్రతిదాడి చర్య మరియు 2016 సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఉన్నాయి.
మెరైన్ కమాండో ఫోర్స్ లేదా మార్కోస్ అనేది 1985 లో మొదటి సారి ప్రారంభమైంది.కానీ 1987 ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ఎదిగింది.
ఇది భారత నావికా దళానికి చెందిన ప్రత్యేక దళం.అమెరికా నేవీ సీల్స్ మరియు బ్రిటిష్ ప్రత్యేక దళాలు ఈ మార్కోస్ యొక్క మొదటి ముఖ్యమైన వ్యక్తులకు శిక్షణనిచ్చారు.వాళ్ళు సుశిక్షితులైన కొన్ని నెలల తర్వాత జూలై 1987 లో శ్రీలంక లో ఎల్.టి.టి.ఎ. కి వ్యతిరేకంగా పోరాడారు.1990వ దశకంలో ఎల్.టి.టి.ఎ. కి వ్యతిరేకంగా ఆపరేషన్ తాషా,1992లో సోమాలియా కి అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న ఒక ఓడకి వ్యతిరేకంగా ఆపరేషన్ జబర్దస్త్ లాంటి కొన్ని ఆపరేషన్స్ లో పాల్గొంది.అలాగే 1999లో కార్గిల్ యుద్ధం లో పాల్గొంది.1995 నుండి జమ్మూ మరియు కాశ్మీర్ లో శాశ్వతంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. 2008లో ముంబయి దాడులకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో కలిసి చర్యల్లో పాల్గొన్నప్పటికీ బ్యూరోక్రాటిక్ తప్పు నిర్ణయాల వల్ల వారి ప్రభావం అంతగా లేకుండా పోయింది.అలాగే ఏంటీ-పైరసీ చర్యల్లో కూడా పాల్గొంటుంది.
10 వారాల సుదీర్ఘ ప్రాధమిక శిక్షణ పొందిన తర్వాత మార్కోస్ ని భారత్ ఆర్మీ ప్రత్యేక దళం పారా ఎస్.ఎఫ్. కి పంపుతారు.అక్కడ మూడు వారాల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ లో మార్కోస్ స్కై డైవింగ్, ఆయుధ శిక్షణ, తిరుగుబాటు చర్యలు, కొన్ని భాషలు మరియు వివిధ రకాల భూ ప్రాంతాల్లో యుద్ధాలు చేయడం లాంటి వాటితో పాటు మరికొన్ని విషయాల్లో అత్యాధునిక శిక్షణ పొందుతారు.ప్రతి మార్కోస్ బృందం లోనూ 8 మంది సైనికులు ఉంటారు.ఈ బృందాన్ని ప్రహార్ అని పిలుస్తారు.
మార్కోస్ బాధ్యతలలో కొన్ని:
*భూ మరియు జల బలగాలకు మద్ధతును ఇవ్వడం.
*ప్రత్యేక నిఘా కలిగి ఉండి పర్యవేక్షించడం.
*డైవింగ్ కార్యాకలాపాలు మరియు రైడ్స్ తో సహా శత్రు భూమి లో రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించడం.
*ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడం.
భారత వైమానిక దళం:
గరుఢ్ కమాండో:
ఈ గరుఢ్ కమాండోస్ అనేది భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక దళం.వీరి కార్యకలాపాలలో ముఖ్యమైనవి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు,బంధీలను కాపాడడం, భారత వైమానిక దళానికి సంబంధించిన వస్తువులను కాపాడడం మరియు వివిధ వైమానిక ప్రత్యేక చర్యల్లో పాల్గొనడం లాంటివి.2002 లో మొదటి సారిగా ప్రారంభించినప్పటికీ 2006 ఫిబ్రవరి 6న అధికారికంగా రూపుదాల్చింది.
గరుఢ్స్ అందరూ 52 వారాల శిక్షణని అందించే వాలంటీర్లు.వీటిలో ప్రత్యేక కార్యకలాపాలతో పాటు 3 నెలల పరిశీలన మరియు ప్రాథమిక వాయుమార్గ శిక్షణ మరియు ఇతర యుద్ధ నైపుణ్యాలు, నిఘా వ్యవస్థ గురించి శిక్షణ ఉంటుంది.ప్రాథమిక శిక్షణ చివరి దశలో గరుఢ్స్ ఆయుధాలను ఉపయోగించడంలో అనుభవం సాధించాలి.ప్రత్యేకమైన ఆయుధాలతో సహా ఆయుధాలు ఉపయోగించడంలో అత్యాధునిక శిక్షణ అందిస్తారు.
నేరుగా పోరాటానికి దిగటం, ప్రత్యేకమైన నిఘా కలిగి ఉండటం, శత్రు భూభాగాలలో చిక్కుకున్న పైలట్లను కాపాడడం, శత్రు భూభాగాలలో ఎయిర్ బేస్ లను ఏర్పాటు చేసి వాటికి ఏ అడ్డంకులు లేకుండా చూడడం వంటి కార్యక్రమాలు ఈ గరుఢ్స్ ఖచ్చితంగా చేయవలసినవి.ఇవేకాక శత్రువుల నుండి జరిగే వాయు మార్గంలో దాడులను తిప్పికొట్టడం మరియు రాఢార్ లు లాంటి శత్రువుల వస్తువులను నాశనం చేయడం, భారత వైమానిక దాడులను చేయడం,లేసర్ డిసిగ్నేటర్ తో ఎయిర్ స్ట్రైక్ చేస్తున్న వారికి దిశానిర్దేశం చేయడం వంటివి కూడా చేయాలి.
IAF ఇన్స్టాలేషన్లు మరియు ఆస్తుల భద్రత సాధారణంగా ఎయిర్ ఫోర్స్ పోలీస్ మరియు డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ చేత నిర్వహించబడుతుంది, అయినప్పటికీ కొన్ని క్లిష్టమైన ఆస్తులు గరుడ్లచే రక్షించబడతాయి.
సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశాలతో పని చేసే అంతర్గత భద్రత సంస్థ:
నేషనల్ సెక్యూరిటీ గార్డ్:
ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది ప్రత్యేకంగా ఉగ్రవాద దాడులకు ఆకస్మికంగా ప్రతి దాడులు చేసే సంస్థ.ఇది 1986లో అధికారికంగా ప్రారంభమైంది.ఇది బ్రిటిష్ ప్రత్యేక వాయు సేవ మరియు జర్మన్ జి.ఎస్.జి.9 ఆధారితంగా డిసైన్ చేయబడింది.వారి ప్రత్యేకమైన నల్ల దుస్తుల వలన వారిని బ్లాక్ కాట్స్ అని కూడా పిలుస్తారు.
కింది రెండు అంశాలను కలిగి ఉంటుంది,
1.ఎస్.ఎ.జి.(స్పెషల్ ఏక్షన్ గ్రూప్):
ఇది భారత్ ఆర్మీ నుండి సైన్యాన్ని ఎంపిక చేస్తుంది.
2.ఎస్.ఆర్.జి.(స్పెషల్ రేంజర్స్ గ్రూప్):
ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ నుండి సైన్యాన్ని ఎంపిక చేస్తుంది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్:
ఇది మాజీ మరియు ప్రస్తుత ప్రధాన మంత్రులకు వారి కుటుంబాలతో సహా 5 సంవత్సరాల వరకు భద్రతని కల్పించే ప్రత్యేకమైన భద్రతా సంస్థ.ఇది 1985లో ఇందిరా గాంధీ హత్య తర్వాత ప్రత్యేకంగా రూపొందించబడింది.ఇది ప్రత్యేక కార్యకలాపాలు కూడా నిర్వహించగలదు.దాని కోసమే నిష్ణాతులైన ఆయుధాలు కలిగిన సైనికులను కలిగి ఉంటుంది.
పరిశోధన మరియు విశ్లేషణ విభాగం:
స్పెషల్ గ్రూప్:
స్పెషల్ గ్రూప్ అనేది పరిశోధన మరియు విశ్లేషణ విభాగం యొక్క రహస్య ప్రత్యేక దళాల విభాగం. ఇది 1981లో ఏర్పడింది.ప్రత్యేక బృందం యొక్క బాధ్యతలు రహస్య గూఢచార కార్యకలాపాలు మరియు రహస్య కార్యకలాపాలను కలిగి ఉంటాయి, వీటితో భారత ప్రభుత్వం బహిరంగంగా సంబంధం కలిగి ఉండకూడదు.
స్పెషల్ ఫ్రెంటియర్ ఫోర్స్:
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా కార్యకలాపాలను చేపట్టేందుకు 14 నవంబర్ 1962న రూపొందించబడిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క రహస్య ప్రత్యేక దళాల విభాగం. ఉత్తరాఖండ్లోని చక్రతాలో ఉన్న SFFని ఎస్టాబ్లిష్మెంట్ 22 అని కూడా అంటారు.ఈ దళం ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచబడింది మరియు తరువాత, భారతదేశం యొక్క బాహ్య గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.ఇది ప్రధానంగా హిమాలయాలు మరియు టిబెట్లోని కఠినమైన భూభాగాలలో కార్యకలాపాలను చేపట్టే బాధ్యత కలిగిన టిబెటన్ ప్రజలను కలిగి ఉంటుంది, దీని ప్రధాన లక్ష్యం చైనా మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య మరొక యుద్ధం జరిగినప్పుడు చైనా సరిహద్దుల వెనుక రహస్య కార్యకలాపాలను నిర్వహించడం.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్ భారత్ ఆర్మీకి బలాన్ని చేకూరుస్తున్నాయి.ఇవి అత్యంత ధైర్య సాహసాలను కలిగి ఉంటాయి. కేవలం భారత్ లోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు.ఇప్పుడు మనం భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్ గురించి తెలుసుకుందాం.
1.బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్:
ఈ రెజిమెంట్ యొక్క ఆలోచన స్వాతంత్ర్యానంతరం భారత్ ఆర్మీ మొదటి కమాండర్ ఇన్ చీఫ్ మార్షల్ కరియప్ప గారిది.ఆయన ఈ రెజిమెంట్ ని ప్రారంభించినప్పుడు 'గార్డ్స్ శ్రేష్టమైన కాపలాదారులు' అని కొనియాడారు.
ఈ బ్రిగేడియర్ ఆఫ్ గార్డ్స్ రెజిమెంట్ యంత్రాలతో కూడిన ఆయుధాలను ఉపయోగిస్తారు. కొన్ని రెజిమెంట్ లలా భారత్ లోని ఒక ప్రాంతం వారిని ఒక సంస్కృతి కి చెందిన వారితో ఏర్పడింది కాకుండా మొత్తం భారతీయులందర్నీ,ఆర్మీలోని అన్ని తరగతులలో పని చేసే వారిని చేర్చుకుంటూ ఏర్పడిన మొట్టమొదటి రెజిమెంట్ ఇది.భారత స్వాతంత్ర్యం తర్వాత అత్యధిక యుద్ధ గౌరవ అవార్డులు పొంది రికార్డులు సృష్టించింది.
వీరి నినాదం:
పెహ్లే హమేషా పెహ్లే(మొదట ఎప్పుడూ మొదటే)
వీరి యుద్ధ నినాదం
గార్డ్ క హున్ బోల్ ప్యారే(మిత్రమా పలుకు, నేను కాపలాదారుల పుత్రుడను)
2.పారాచూట్ రెజిమెంట్:
ఈ పారాచూట్ రెజిమెంట్ గాలిలో నుండి పని చేసే భారత్ ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్ రెజిమెంట్.ఇది 1945 లో బ్రిటిష్ ఆర్మీ ప్రారంభించింది.కానీ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆపేసారు. తర్వాత మళ్ళీ 1952 లో ప్రారంభించారు.ప్రస్తుతానికి భారత్ ఆర్మీలో భాగంగా పని చేస్తుంది.ప్రస్తుతం ఇది పది స్పెషల్ ఫోర్సెస్ గా,ఐదు వాయు సేనలు, రెండు టెర్రిటోరియల్ ఆర్మీ మరియు ఒక రాష్ట్రీయ రైఫిల్ ని దీనిలో కలిపారు.
వీరి నినాదం:
గెలవాలి.
వీరి యుద్ధ నినాదం:
ప్రాణ త్యాగమే పరమ ధర్మం.
3.మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్:
ఈ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.దీనిలో 27 బెటాలియన్స్ ని కలిపి భారత దేశంలోని వివిధ ఆయుధ బలగాలకు పంపుతారు. బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ లోని 21 బెటాలియన్ లతో, యంత్ర ఆయుధాలను కలిగిన సాయుధ బలగాలతో కలిపి ఈ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో భాగంగా పని చేస్తుంది.
వీరి నినాదం:
శౌర్యం మరియు విశ్వాసం.
వీరి యుద్ధ నినాదం:
బోలో భారత్ మాతా కీ జై.
4.పంజాబ్ రెజిమెంట్:
పంజాబ్ రెజిమెంట్ అనేది ఇప్పుడు పని చేస్తున్న రెజిమెంట్ లలో రెండవ పురాతనమైనది.ఇది ఒక ప్రాంతానికి చెందిన అత్యంత అనుభవం కలిగిన ఆయుధాలు కలిగిన రెజిమెంట్.దీన్ని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1947 లో ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకు అనేక యుద్ధాల్లో మరియు దాడులలో పాల్గొంది.
స్వాతంత్ర్యం మరియు దేశ విభజనకు ముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో అనేక పంజాబ్ రెజిమెంట్స్ పని చేసేవి.వాటన్నిటినీ విలీనం చేసి 1వ పంజాబ్ రెజిమెంట్,2వ పంజాబ్ రెజిమెంట్, 8వ పంజాబ్ రెజిమెంట్,14వ పంజాబ్ రెజిమెంట్,15వ పంజాబ్ రెజిమెంట్ మరియు 16వ పంజాబ్ రెజిమెంట్ అనే ఆరు రెజిమెంట్ లుగా విభజించారు.
వీరి నినాదం:
ఖుష్కీ వ తారీ/స్థల్ వ జల్(భూమి మరియు సముద్రం ద్వారా)
వీరి యుద్ధ నినాదం:
జో బోలో సో నిహాల్,సత్ శ్రీ అకాల్(దేవుడిని సత్యం అని నమ్మేవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు).ఇది సిఖ్ఖుల నినాదం.
5.ది మద్రాస్ రెజిమెంట్:
ఈ మద్రాస్ రెజిమెంట్ భారత్ లోనే పురాతనమైన రెజిమెంట్ మరియు దీనిని 1750 లో ప్రారంభించడం జరిగింది.బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో ఉన్నప్పుడు మరియు స్వాతంత్ర్యం తర్వాత కూడా మద్రాసు రెజిమెంట్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొంది.
ఈ మద్రాస్ రెజిమెంట్ మొదట్లో 1660 లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసు యురోపియన్ రెజిమెంట్ గా ప్రారంభించారు.తర్వాత 1748 లో మేజర్ స్ట్రింగర్ లారెన్స్ కమాండ్ లో బెటాలియన్ గా చేర్చుకున్నారు.ఈ మద్రాస్ బెటాలియన్ భారత్ లో ఫ్రెంచి బలగాలతో జరిగిన ప్రతి యుద్ధం లోనూ పాల్గొన్నారు.
ఈ గ్రెనేడియర్స్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం. మొదట్లో ఇది బొంబే ఆర్మీలో భాగంగా పని చేసేది.స్వాతంత్ర్యం తర్వాత 4వ బొంబే గ్రెనేడియర్స్ గా పిలవబడుతుంది.
ఈ రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాలలోనూ మరియు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి వివిధ యుద్ధాలలోనూ ప్రముఖ పాత్ర వహించింది.ఈ రెజిమెంట్ అనేక యుద్ధ గౌరవాలను, శౌర్య పతకాలు పొందింది.వేరు వేరు యుద్ధాలలో మూడు పరమ వీర చక్ర అవార్డులను పొంది భారత దేశపు అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా పరిగణించబడుతుంది.
వీరి నినాదం:
సర్వదా శక్తిశాలి (ఎల్లప్పుడూ శక్తి కలిగి ఉంటాం)
వీరి యుద్ధ నినాదం:
సర్వదా శక్తిశాలి.
7.మరాఠ లైట్ ఇన్ఫాంట్రీ:
ఈ మరాఠ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అనేది భారత్ ఆర్మీ యొక్క తేలికైన పదాతిదళం.బొంబే సిపాయిల పేరుతో 1768 లో దీనిని ప్రారంభించడం వల్ల అత్యంత సీనియర్ పదాతిదళంగా అయింది. దీనిలోని సైనికులను పూర్వ మరాఠ సామ్రాజ్యం లో నుండి తీసుకోవడం జరుగుతుంది కనుక దీనికి మరాఠ పేరుని ఆపాదించారు.దాదాపుగా మహారాష్ట్ర మొత్తం నుండి దీని లోని సైనికులను తీసుకున్నప్పటికీ కొంత మందిని మాత్రం కూర్గ్ తో సహా కర్ణాటక లోని మరాఠ మాట్లాడే ప్రాంతాల నుండి కూడా తీసుకుంటున్నారు.1922లో ముంబయి ప్రావిన్స్ లో భాగంగా ఉన్న బెల్గామ్ లో రెజిమెంటల్ కేంద్రం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు.
వీరి నినాదం:
డ్యూటీ,హానర్,కరేజ్(కర్తవ్యం, నిజాయితీ, ధైర్యం).
యుద్ధ నినాదం:
బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై
8.రాజ్ పుతన రైఫిల్స్:
ఈ రాజ్ పుతన రైఫిల్స్ ఇండియన్ ఆర్మీ యొక్క మద్రాసు రెజిమెంట్ తర్వాత రెండవ రెజిమెంట్.ముందుగానే ఉన్న ఆరు రెజిమెంట్ లను కలిపి 6వ రాజ్ పుతన రైఫిల్స్ గా 6 బెటాలియన్ లను తయారు చేసినప్పుడు ఇది బ్రిటిష్ ఆర్మీలోని భాగంగా ఉండేది.
1945లో చాలా మంది అధికారులను తొలగించడం జరిగింది.1947 తర్వాత కొత్తగా ఏర్పడిన స్వాతంత్ర్య భారత్ ఆర్మీకి దీనిని బదిలీ చేసారు.స్వాతంత్ర్యం తర్వాత ఈ రెజిమెంట్ పాకిస్థాన్ తో ఏర్పడిన ఎన్నో గొడవల్లో పాలు పంచుకుంది.అలాగే కొరియా లో యునైటెడ్ నేషన్స్ ఒప్పందం ప్రకారం 1953-54 లో భారత కస్టోడియన్ ఫోర్స్ కి సహకారం అందించింది.అంతేకాక 1962 లో కాంగో లో జరిగిన యునైటెడ్ నేషన్స్ మిషన్ కి కూడా సహకారం అందించారు.
వీరి నినాదం:
వీర్ భోగ్య వసుంధర(ధైర్యవంతులు భూమిని వారసత్వం గా పొందుతారు.
యుద్ధ నినాదం:
రాజా రామచంద్ర కి జై.
9.ఝాట్ రెజిమెంట్:
ఝాట్ రెజిమెంట్ అనేది భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.అత్యధిక కాలం పని చేసిన మరియు ఎక్కువ మందికి తెలిసిన రెజిమెంట్ లలో ఇది ఒకటి.ఈ రెజిమెంట్ 1839 నుండి 1947 వరకు 19 యుద్ధ గౌరవాలను మరియు స్వాతంత్ర్యం తర్వాత 2 విక్టోరియా క్రాస్ లు,8 మహావీర్ చక్రాలు,8 కీర్తి వీర చక్రాలు,34 శౌర్య చక్రాలు,39 వీర్ చక్రాలు మరియు 170 సేన మెడళ్ళతో బాటు ఐదు యుద్ధ గౌరవాలను పొందింది.
తన 200 సంవత్సరాల సుదీర్ఘ సేవ సమయం లో ఈ రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాలలోనే కాక భారత్ మరియు అబ్రాడ్ లలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు.
వీరి నినాదం:
సంఝటన్ వ వీర్త(ఐక్యత మరియు శౌర్యం).
యుద్ధ నినాదం:
ఝాట్ బల్వాన్,జై భగవాన్ (జాట్ అనేది శక్తివంతమైనది, భగవంతుడికి విజయం కలుగుతుంది).
10.సిఖ్ఖ్ రెజిమెంట్:
ఈ సిఖ్ఖ్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.1979లో మొదటి బెటాలియన్ ఏర్పడినప్పుడు కామన్వెల్త్ లో స్వాతంత్ర్యానికి పూర్వం 245 మరియు స్వాతంత్ర్యం తర్వాత 82 శౌర్య పురస్కారాలతో అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా నిలిచింది.4వ బెటాలియన్ గా మారినప్పుడు యాంత్రిక ఆయుధాల రెజిమెంట్ గా అయింది.
మొదటి బెటాలియన్ 1846 ఆగస్టు 1న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అధికారికంగా ఏర్పడింది.మొదట్లో దీని కేంద్రం ఉత్తర ప్రదేశ్ మీరట్ లో ఉండేది.కానీ ప్రస్తుతం రామ్ గర్హ్ కంటోన్మెంట్, ఝార్ఖండ్ లో ఉంది.
వీరి నినాదం:
నిశ్చయ్ కర్ అప్నీ జీత్ కరోన్(సంకల్పం తో నేను విజయం సాధిస్తాను).
వీరి యుద్ధ నినాదం:
బోలో సో నిహాల్ సాత్ శ్రీ అకాల్(భగవంతుడిని గొప్పవాడు అని చెప్పేవాడిని శాశ్వతంగా ఆశీర్వాదం పొందుతాడు).
11.గోర్ఖా రైఫిల్స్:
1947లో భారత్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్-ఇండియా-నేపాల్ త్రైపాక్షిక ఒప్పందం లో భాగంగా ముందు నుండి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పని చేస్తున్న 6 గోర్ఖా రెజిమెంట్ లను భారత్ ఆర్మీలో కలిపారు.అప్పటి నుండి నేటి వరకు వారు మన ఆర్మీలో పని చేస్తున్నారు.ఈ ట్రూప్స్ లో ముఖ్యంగా నేపాల్ లోని గోర్ఖా జాతి వారి నుండి వస్తారు.
ఇంకా బ్రిటిష్ సైన్యం లో చేరడానికి అంగీకరించని ఏడవ మరియు పదవ గోర్ఖా రైఫిల్స్ ని కూడా స్వాతంత్ర్యం తర్వాత మన సైన్యం లో ప్రారంభించారు.
వీరి నినాదం:
యత్రహం విజయస్తత్ర(మేము విజయానికి రూపకం)
యుద్ధ నినాదం:
జై మహాకాళి,ఆయో గోర్ఖాలి!(కాళీమాత కి నమస్కారములు, ఇక్కడున్న వారము గోర్ఖాలము)
12.డోగ్రా రెజిమెంట్:
ఈ డోగ్రా రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఈ రెజిమెంట్ నేరుగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యొక్క 17వ డోగ్రా రెజిమెంట్ నుండి తీసుకొనబడింది.
ఈ డోగ్రా రెజిమెంట్ స్వాతంత్ర్యం అనంతరం దాదాపుగా భారత్ ఆర్మీ చేసిన ప్రతి ఒకైక యుద్ధం లోనూ పాల్గొన్నారు.ఇది భారత్ ఆర్మీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అలంకారమైన రెజిమెంట్.
వీరి నినాదం:
కర్తవ్యం అన్వాత్మ (మరణం కంటే కర్తవ్యం ముఖ్యమైనది).
వీరి యుద్ధ నినాదం:
జ్వాల మాత కి జై.
13.గర్వాల్ రెజిమెంట్:
ఈ గర్వాల్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఇది 1887 లో బెంగాల్ ఆర్మీలో 39వ గర్వాల్ రెజిమెంట్ గా ఆరంభించారు.తర్వాత బ్రిటిష్ ఆర్మీలో కలిపారు కానీ స్వాతంత్ర్యం అనంతరం ఇండియన్ ఆర్మీ లో భాగమైంది.
ఇది 19వ మరియు 20వ శతాబ్దం లో సరిహద్దు ఉద్యమాల్లో మరియు రెండు ప్రపంచ యుద్ధాలలోనూ అలాగే స్వాతంత్ర్యం అనంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు.దీనిలో ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని 7 జిల్లాలలోని గర్వాలీ ప్రజలతో ఏర్పడింది.
వీరి నినాదం:
యుద్ధాయ కృత్ నిశ్చయ(ధృడ సంకల్పంతో యుద్ధం చేయాలి).
యుద్ధ నినాదం:
బద్రీ విశాల్ లాల్ కి జై(బద్రీనాథ్ పుత్రులకు విజయం కలుగుతుంది).
14.కుమవోన్ రెజిమెంట్:
ఈ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పురాతన రెజిమెంట్ లలో ఒకటి.ఈ రెజిమెంట్ 18వ శతాబ్దం లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో మొదలై వారి ఆధ్వర్యంలో మరియు భారత్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగిన దాదాపు అన్ని పెద్ద యుద్ధాలలో పాల్గొంది.అలాగే రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్నారు.దాని వల్ల అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా పరిగణించబడుతుంది.
దీని కేంద్రం రాణిఖేడ్ లో ఉంది.దీనిలో కుమవోన్ లోని రాజ్ పుత్స్ ని, బ్రాహ్మణులను మరియు అహిర్స్ ని తీసుకొంటారు.
వీరి నినాదం:
పరాక్రమో విజయతే(శౌర్యం విజయం సాధిస్తుంది).
యుద్ధ నినాదం:
కాళికా మాత కి జై.
15.అస్సాం రెజిమెంట్:
ఈ అస్సాం రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఈ రెజిమెంట్ 15 నిత్యం పని చేసే బెటాలియన్ లను,3 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ లను,5 ప్రాదేశిక బెటాలియన్ లను మరియు 2 అటవీ ప్రాంత బెటాలియన్ లను కలిగి ఉంటుంది.దీనిలో 8 ఈశాన్య రాష్ట్రాల నుండి యువకులను తీసుకుంటారు.
వీరి నినాదం:
అసం విక్రమ్(ప్రత్యేక శౌర్యం)
యుద్ధ నినాదం:
రైనో ఛార్జ్(ఖడ్గ మృగంలా దాడి చేయాలి).
16.బీహార్ రెజిమెంట్:
ఈ బీహార్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క రెజిమెంట్.ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లోనే ప్రారంభమైంది.ఇది 1941 లోనే 11వ ప్రాదేశిక బెటాలియన్,19వ హైదరాబాద్ రెజిమెంట్ కలుపుకుని కొత్త బెటాలియన్ లగా ఏర్పడింది.ఈ బీహార్ రెజిమెంటల్ కేంద్రం బీహార్ లోని పాట్నా లో ఉంది.
భారత నావికా దళం యొక్క అతి పెద్ద మరియు విమాన వాహక ఓడ ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య ఈ రెజిమెంట్ కి అనుబంధం గా పని చేస్తుంది.భారత్ ఆర్మీ యొక్క అత్యంత అలంకారమైన మరియు కఠినతరమైన పోరాటం చేసే యూనిట్.అలాగే మొత్తం రెజిమెంట్ లలోఅత్యధిక రాష్ట్రీయ రైఫిల్స్ ని కలిగి ఉన్న రెజిమెంట్ ఇది.
వీరి నినాదం:
కరమ్ హై ధరమ్(కర్తవ్యమే నిజమైన భక్తి).
యుద్ధ నినాదం:
జై భజరంగ్ భళి మరియు బిర్సా ముండా కి జై.
17.మహర్ రెజిమెంట్:
ఈ మహర్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.నిజానికి ఈ రెజిమెంట్ లో మహారాష్ట్ర లోని మహర్షి వర్గానికి చెందిన వారిని ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వేరే వర్గాల వారిని కూడా తీసుకుంటున్నారు.
ఈ మహారాస్ అనే వారే నిజమైన మహారాష్ట్ర నివాసులుగా చెప్పుకుంటారు.ఈ వర్గం వారిని కతివాలె(కర్రని ధరించిన మనుషులు),భూమి పుత్ర,మిరాశి(భూస్వాములు) అని కూడా పిలుస్తారు. వీరి సంస్కృతి ప్రకారం బయట వ్యక్తుల నుండి, ఆక్రమణదారి జాతుల నుండి, నేరస్థుల నుండి, మరియు దొంగల నుండి వారి ప్రాంతాన్ని కాపాడుకోడానికి ప్రతి వ్యక్తి వారి పాత్రని పోషించాలి.అలాగే వారి ప్రాంతంలోని చట్టాలను కూడా అమలయ్యేలా చూడాలి.ఈ మహారాస్ అత్యంత పురాతన మరియు గర్వపడే ధైర్యవంతమైన సంస్కృతి ని కలిగి ఉంది.
వీరి నినాదం:
యష్ సిద్ది(సాధన&విజయం)
యుద్ధ నినాదం:
బోలో హిందుస్థాన్ కి జై
18.జమ్మూ&కాశ్మీర్ రైఫిల్స్:
ఈ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.ఇది జమ్మూ కాశ్మీర్ రాజ్యం ఉన్న సమయంలో జమ్మూ&కాశ్మీర్ స్టేట్ ఫోర్సెస్ లో ప్రారంభమైంది. 1947 అక్టోబర్ లో జమ్మూ&కాశ్మీర్ భారతదేశంలో కలిసినప్పుడు దీనిని భారత్ ఆర్మీ లోకి చేర్చారు.
1956లో జమ్మూ&కాశ్మీర్ అసెంబ్లీ పూర్తిగా భారత్ లో కలిసేంత వరకు ఈ రెజిమెంట్ దాని పూర్వ రూపంలోనే పని చేసేది. ఆ తర్వాత మాత్రమే స్టేట్ ఫోర్సెస్ జమ్మూ & కాశ్మీర్ రెజిమెంట్ గా రూపాంతరం చెందినది. 1963 లో జమ్మూ&కాశ్మీర్ రైఫిల్స్ గా మారింది. ఈ మార్పు తర్వాత లడక్ స్కౌట్స్ కూడా ఈ రెజిమెంట్ లోకి చేర్చారు. కానీ 2002 లో మళ్ళీ ఈ లడక్ స్కౌట్స్ ప్రత్యేక రెజిమెంట్ గా మారింది.
వీరి నినాదం:
ప్రశత రన్వీర్త(యుద్ధంలో శౌర్యమే కీర్తి గడుస్తుంది) .
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారతీయ నావికా దళం
భారత దేశాన్ని చుట్టూ ఉన్న సముద్రం నుండి జరిగే దాడుల నుండి కాపాడే దళం ఈ నావికా దళం.దీనికి కూడా అత్యున్నత కమాండర్ గా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు.నావికా దళ ముఖ్య అధికారిగా నాలుగు నక్షత్రాలు కలిగిన అధిపతి కమాండర్ గా ఉంటారు.మన నావికా దళం పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మరియు మలక్కా జలాలలో వేరే దేశానికి చెందిన ఎవ్వరూ మన జలాలలోకి రాకుండా కాపలా కాస్తూ ఉంటారు, అలాగే మిగిలిన నావికా దళాలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటారు. అలాగే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాలలో అలాగే పశ్చిమ సముద్ర జలాల్లో ఒక పెద్దగా సైన్యాన్ని మోహరిస్తూ ఉంటారు.
భారత నావికా దళ ప్రాథమిక బాధ్యత భారత దేశ సముద్ర పొలిమేరలను కాపాడడం, అలాగే శత్రు సైన్యాలతో సమస్యలు వచ్చినప్పుడు వారి ఉచ్చులను పసిగట్టి వారిని ఓడించాలి.మన నావికా దళం శాంతి మరియు యుద్ధం రెండింటినీ ప్రేమిస్తుంది. సమైక్య అభ్యాసాలు,స్నేహ పూర్వక సభలు ఏర్పాటు చేయడం మరియు విపత్తులలో సహాయం అందించడం ద్వారా మిగిలిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉంటుంది.
దాదాపుగా 67,252 సర్వీస్ లో ఉన్న సభ్యులతో పాటు 75,000 మంది రిసర్వ్ సభ్యులు ఉన్నారు. అలాగే శక్తివంతమైన 150 షిప్స్ మరియు సబ్ మెరైన్స్ కలిగి,300 ఎయిర్ క్రాఫ్ట్ కలిగి ఉన్నారు.వీటితో బాటు ఆపరేషనల్ ఫ్లీట్ 2 ఎయిర్ కారియర్స్,1 బలమైన రవాణా నౌక, 8 ల్యాండింగ్ షిప్ టాంక్స్,10 డెస్ట్రాయర్స్,13 ఫిరంగులు కలిగిన యుద్ధ నౌకలు,1 బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్,16 సాంకేతికంగా బలమైన సబ్ మెరైన్స్,24 చిన్న యుద్ధ నౌకలు,1 మైన్ కౌంటర్ మెసర్ వెసెల్,4 ఫ్లీట్ టాంకర్స్ మరియు ఇంకెన్నో ఇతర ఫిరంగులు కలిగిన నౌకలు, చిన్న పెట్రోల్ బోట్ లు అలాగే సోఫిస్టికేటెడ్ షిప్స్ ని కలిగి ఉన్నారు.ఇది మల్టీ రీజనల్ శక్తిని ప్రదర్శించగల నీలి జలాల నావికా దళంగా పరిగణించబడుతుంది.
భారత నావికా దళ చరిత్ర
భారత నావికా వ్యవస్థ అనేది 6000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది.మన దేశం లో క్రీ.పూ.2300 సంవత్సరం సింధు నాగరికత సమయంలోనే ఇప్పటి గుజరాత్ లోని మంగ్రోల్ ఓడ రేవు దగ్గర లోథల్ లో మొట్ట మొదటి సముద్ర వాహనం తయారు చేసినట్టు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన ఋగ్వేదం మన హిందూ దైవం వరుణ దేవుడికి సముద్ర మార్గాలకు సంబంధించిన అవగాహన ఉందని తెలిపింది మరియు మన భారతీయులు వందల పడవలతో యుద్ధాలు చేసాయని కూడా తెలిపింది.అంతేకాదు ప్లవ అనే నామం కల తుఫానుల్లో ఓడలను స్థిరంగా ఉంచే యంత్రం గురించి కూడా తెలిపింది.ప్లవని నేటి తరం స్థిరీకరించే యంత్రాలకు మొట్ట మొదటి యంత్రం గా పేర్కొంటారు. సముద్రం లో దిక్సూచి ని మొట్టమొదట క్రీ.శ.4 లేదా ఐదు సంవత్సరాల లో మత్స్య యంత్ర పేరుతో ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది.అలాగే భారతీయులు జావా,సుమత్రా దీవులతోనూ,గ్రీకులతోనూ,రోమనులతోనూ విలువైన వజ్రాలు,తోళ్ళు, వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలు చేసేవారు.
క్రీ.శ. 5-10 సంవత్సరాలలో కలింగ రాజ్యం జావా మరియు సుమత్ర దీవులను హస్తగతం చేసుకున్నారు. అండమాన్ మరియు నికోబార్ దీవులు వ్యాపార నౌకలకు ఓడ రేవులుగా పని చేసేవి.క్రీ.శ.984-1042 మధ్యలో రాజ రాజ చోళ 1, రాజేంద్ర చోళ 1 మరియు కులోతంగు చోళ 1 బర్మా, శ్రీలంక,సుమత్ర మరియు మలయ దీవులను గెలిచి సముద్రపు దొంగలను అణచివేసారు.
14 మరియు 15 శతాబ్దాలలో భారతీయ నావికా వ్యవస్థ ఓడలను తయారు చేయడంలో ఎంతో ఉన్నత స్థాయి కి చేరుకుంది.ఒకటి కంటే ఎక్కువ గదులతో తయారు చేయడం మొదలు పెట్టారు.దాని వలన ఒక గది పాడైపోయినా మిగిలిన గదులలో ఉండడానికి వీలు ఉండేది.ఈ రూప రచన మిగిలిన యురోపియన్ కంట్రీస్ కూడా అప్పటికి తయారు చేయలేకపోయాయి.
13వ శతాబ్దం చివరికల్లా భారతీయ నావికా వ్యవస్థ తిరోగమనం ప్రారంభమైంది.దాని అధ్వాన్న స్థితికి చేరుకుంది.అదే సమయంలో పోర్చుగీసు వాళ్ళు భారత దేశానికి చేరుకున్నారు.దేశంలో వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.తర్వాత మొత్తం ఆసియా ఓడల పైన దాడులు చేయడం మొదలు పెట్టారు.ఎవ్వరినీ సముద్రాల ద్వారా వ్యాపారాలు చేసుకోడానికి ఆప్పుకునేవారు కాదు.1529 లో ముంబయిలో జరిగిన పోరు వల్ల థానే,కరంజా మరియు బందోరా పోర్టులు తమ హస్తగతం అయ్యాయి.1534 కల్లా మొత్తం ముంబయి పోర్ట్ పైన ఆధిపత్యం సాధించారు.వాస్కోడా గామా ఎప్పుడైతే వ్యాపార ఒప్పందాలను అనుసరించి కట్టవలసిన పన్నులు కట్టడానికి తిరస్కరించాడో జోమరిన్ ఆఫ్ కలకత్తా పోర్చుగీసు వ్యాపారాలను అడ్డుకున్నారు. దీని ఫలితంగా రెండు పెద్ద యుద్ధాలు సముద్రంలో జరిగాయి.ఒకటి 1504 లో కొచ్చిన్ లో జరిగింది.మరొకటి నాలుగేళ్ల తర్వాత దివు లో జరిగింది.ఈ రెండు యుద్ధాలలో భారత్ ఓడిపోయింది.
17వ శతాబ్దం చివరికల్లా మళ్ళీ భారతీయ నావికా వ్యవస్థ పురోగమనం సాధించింది.మొఘలులు మరియు సిద్దీస్ ఆఫ్ జంజీర సంబంధాల వల్ల పశ్చిమ తీర ప్రాంతం లో శక్తివంతంగా ఎదగగలిగారు.
దక్షిణాది లో మరాఠ రాజ్యానికి మొదటి ప్రముఖుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సొంత నావికా వ్యవస్థ ని, నావికా దళాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు.వీరి నావికా దళం సిద్ధోజి గుజార్ మరియు కన్హోజీ ఆంగ్రే ఇద్దరి నావికా అధిపతుల సారధ్యంలో నడిచేది.ఆంగ్రే సారధ్యంలోని మరాఠా నావికా దళం ఇంగ్లీష్, పోర్చుగీసు మరియు డచ్ వాళ్ళని కొంకణ్ తీర ప్రాంతం వైపు చూడడానికి కూడా భయపడేలా చేసేవి.కానీ ఎప్పుడైతే 1729 లో ఆయన మరిణించారో ఆ తర్వాత మరాఠా నావికా దళం క్షీణించడం మొదలైంది.
1612 లో ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీసు వారిని ఓడించినప్పుడు సముద్రపు దొంగలు రెచ్చిపోయేవారు.వారిని ఆపడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటన్ వాళ్ళు నావికా దళాన్ని ఏర్పాటు చేశారు.మొదటి స్క్వాడ్రన్ సెప్టెంబర్ 5,1912 లో గుజరాత్ తీరానికి చేరుకుంది.గల్ఫ్ ఆఫ్ కాంబే మరియు నర్మద,తపతి నదులలో బ్రిటిష్ వ్యాపార నౌకలను కాపాడడం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత.ఎప్పుడైతే బ్రిటన్ సామ్రాజ్యం భారత్ లో విస్తరిస్తుందో ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత కూడా పెరుగుతూ వెళ్ళింది.
తర్వాత 1686 నుండి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ని నడిపించేవారు.అప్పటి నుండి దాని పేరు బొంబే మెరైన్ గా మార్చబడింది.తర్వాత కాలంలో బాంబే మెరైన్ డచ్,ఫ్రెంచ్,మరాఠా మరియు సిద్ధి నౌకలను తీసుకున్నారు.తర్వాత కాలంలో 1824 లో మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం లో పాల్గొంది.1834 లో బొంబే మెరైన్ హర్ మెజెస్టీస్ ఇండియన్ నావీగా మారింది.ఇండియన్ నావీ 1840 లో మొదటి ఓపియమ్ వార్ లో,1852 లో రెండవ ఆంగ్లో-బర్మీస్ యుద్ధం లో పాల్గొంది.తర్వాత 1863 నుండి 1877 మధ్యలో మళ్ళీ దాని పూర్వ నామం బోంబే మెరైన్ గా ఉండి మళ్ళీ హర్ మెజెస్టీస్ ఇండియన్ మెరైన్ గా మారింది.ఆ సమయంలో మెరైన్ కలకత్తా లో బంగాళాఖాతం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో తూర్పు డివిజన్ మరియు బోంబే లో అరేబియన్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ డివిజన్ మొత్తం రెండు డివిజన్ లుగా విభజించారు.మళ్ళీ 1892లో రాయల్ ఇండియన్ మెరైన్ గా మారింది.19వ శతాబ్దం చివరికల్లా మొత్తం 50 ఓడలతో పని చేసేది. మొదటి ప్రపంచ యుద్ధం లో పెట్రోల్ బోట్లతో, ట్రూప్ క్యారియర్ తో, మైన్ స్వీపర్ బోట్లతో పాల్గొంది.1928 లో డి.ఎన్.ముఖర్జీ గారు కమిషన్ కి మొదటి భారతీయ ఇంజనీర్ సబ్ లెఫ్టినెంట్ అయ్యారు.
1934 లో మెరైన్ పూర్తి నావల్ ఫోర్స్ గా రూపాంతరం చెందింది. అప్పటి నుండి రాయల్ ఇండియన్ నావీ గా పిలువబడేది.అలాగే బ్రిటన్ ప్రభుత్వానికి విధేయులుగా పని చేస్తున్నట్టు తెలిపే రాజ వర్ణాలు ఉపయోగించేవారు.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఐదు స్తంభపు ఓడలు, ఒక సర్వే ఓడ,ఒక సరుకులు రవాణా చేసే ఓడ,ఒక పెట్రోలింగ్ ఓడ మరియు కొన్ని చిన్న చిన్న ఆయుధాలు కలిగిన ఓడలు,114 మంది అధికారులు,1732 మంది నావికులు మాత్రమే కలిగి ఉంది రాయల్ నావీ.
1940 నుండి మనుషులు మరియు వస్తువులు ఈ సంఖ్య రెట్టింపు అవూతూ 1942 నాటికి ఆరు రెట్లు పెరిగింది.నావీ చాలా హిందూ మహా సముద్రంలో చాలా ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తుంది.యుద్ధ సమయాల్లో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. 1945 నాటికి ఏడు స్తంభపు ఓడలు, నాలుగు ఫిరంగులు కలిగిన యుద్ధ నౌకలు, నాలుగు చిన్న యుద్ధ నౌకలు,14 మైన్ స్వీపర్స్,14 పడవలు, రెండు డిపో షిప్స్,30 సహాయక నౌకలు,30 ఆగ్జిలరీ నౌకలు, 150 నౌకలు,200 ఓడరేవు దగ్గర ఉండే చిన్న నౌకలు మరియు మరికొన్ని అఫెన్సివ్, డిఫెన్సివ్ మోటార్ లాంఛర్స్ సమకూర్చుకుంది.
1945 వరకు నావికా దళం లో భారతీయులు ఇంజనీరింగ్ కమాండర్ స్థాయి కంటే పై స్థాయి కి ఎవ్వరూ వెళ్ళలేదు.1946 లో భారతీయులు భారతీయ నావికా వ్యవస్థ కి వ్యతిరేకంగా 78 ఓడలు,20 తీర ప్రాంతాలలో 20000 మంది నావికులతో స్ట్రైక్ చేసారు.స్ట్రైక్ మొదలైన తర్వాత కమ్యూనిస్టు పార్టీ సపోర్ట్ చేసింది.కానీ భారత్ ఆర్మీ దగ్గర నుండి కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నుండి కానీ,యం.ముస్లీం లీగ్ నుండి కానీ అస్సలు సపోర్ట్ లభించలేదు.తర్వాత ఈ స్ట్రైక్ విఫలమైంది.1947 జూలై 21న H.M.S.ఛౌదరీ మరియు భాస్కర్ సదాశివ సోమన్ ఇద్దరూ పాకిస్థాన్ మరియు భారత నావికా దళాలుగా ఆఫీసర్లు అయ్యారు.
1947 తర్వాత భారత్ మరియు పాకిస్థాన్ విడిపోయాయి.21 శాతం నావికా అధికారులు మరియు 47 శాతం నావికులు పాకిస్థాన్ నావికా దళం లో పని చేయడానికి మొగ్గు చూపారు.32 ఓడలు మరియు 11,000 మంది ఉద్యోగస్తులు భారత్ కి వచ్చారు.అదే రోజున బ్రిటీషు అధికారులు మొత్తం పదవీ విరమణ తీసుకొన్నారు.వారి స్థానాల్లో భారతీయులు వచ్చారు. 1948 జనవరిలో D.N.ముఖర్జీ మొట్ట మొదటి ఇంజనీరింగ్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యారు.1948 మే లో కెప్టెన్ అజితేందు చక్రవర్తి కమోడోర్ ర్యాంక్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాడు.1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశం అయిన తర్వాత రాయల్ అనే పేరును తొలగించి ఇండియన్ నావీ గా నామకరణం చేశారు.ఓడల పేర్లు కూడా హిస్ మెజిస్టీస్ షిప్ నుండి ఇండియన్ నావల్ షిప్స్ గా మారాయి.అదే సమయంలో ఇంపీరియల్ క్రౌన్ గుర్తు తొలగించి లయన్ కేపిటల్ ఆఫ్ అశోక ను చేర్చారు.వైట్ ఎన్సైన్ లోని యూనియన్ జాక్ స్థానంలో భారతీయ తిరంగాని చేర్చారు.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
ఎయిర్ క్రాఫ్ట్
HAL లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది లైట్ అటాక్ హెలికాప్టర్.
తయారీ దేశం భారత్.
బోయింగ్ AH-64 అపాచీ:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*హెవీ అటాక్ హెలికాప్టర్.
*6 హెలికాప్టర్లు ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం అమెరికా.
HAL రుద్ర:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మొత్తం 75 సర్వీస్ లో ఉన్నాయి. మరొక 25 ఆర్డర్ లో ఉన్నాయి.
*అటాక్ చేయడానికి, సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు.
తయారీ దేశం భారత్.
HAL ధృవ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు.
*మొత్తం 141 సర్వీస్ లో ఉన్నాయి. మరొక 63 ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు.
*మొత్తం 6 హెలికాప్టర్లు ఆర్డర్ లో ఉన్నాయి.
*తయారీ దేశం భారత్.
HAL ఛీతా:
*భారత్ మరియు ఫ్రాన్స్ లలో తయారు చేస్తున్నారు.
*ఛీతా/ఛీతల్ మోడల్స్ సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు. లాన్సర్ మాత్రం అవసరమైనప్పుడు దాడులకు ఉపయోగిస్తారు.
*మొత్తం 160 సర్వీస్ లో ఉన్నాయి.
HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ లను వీటి స్థానంలో తీసుకొస్తున్నారు.
తయారీ దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్.
మానవ రహిత వాయు వాహనాలు
TAPAS-BH-201:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*తక్కువ సంఖ్యలో 5 యూనిట్లు తయారు చేస్తున్నారు.మొత్తం 76 యూనిట్లను తయారు చేయడానికి ఆలోచిస్తున్నారు.
తయారీ దేశం భారత్.
IAI హెరాన్ TP:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*సర్వీస్ లో ఉన్నాయి.
*తయారీ దేశం ఇజ్రాయెల్.
IAI హెరాన్:
*తయారీ దేశం ఇజ్రాయెల్.
*మానవ రహిత వాయు వాహనం.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
IAI సర్చర్:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*Mk I/II వర్షన్లు.
*120 కంటే ఎక్కువ యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
ఐడియా ఫోర్జ్ స్విచ్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*స్విచ్ 1.0 వర్షన్.
*మొదటి బ్యాచ్ చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకొన్నారు.మరొక 200 ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
రఫె Mphibr MR-20:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*MR-20 హెక్సా కాప్టర్ డ్రోన్లు 20 కేజీల బరువు వరకు మోసుకుని వెళ్ళగల సామర్ధ్యం కలిగి ఉంటాయి.
*వీటిని సైన్యానికి అవసరమయ్యే వస్తువులను దుర్గమమైన ప్రదేశాల్లో తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం భారత్.
రఫె Mphibr MR-10:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*స్వార్మ్ డ్రోన్.
*నోయిడా బేస్డ్ రఫె Mphibr ఆర్మీ కి అందించడం జరిగింది.
*వీటిని క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి వస్తువులను అందించడానికి ఉపయోగిస్తారు.
స్కై స్ట్రైకర్:
*దీన్ని ఇజ్రాయెల్ మరియు భారత్ లు తయారు చేస్తున్నాయి.
*నెమ్మదిగా యుద్ధ సామగ్రిని చేరవేస్తుంది.
*100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*భారత్ లోని ఆల్ఫా డిసైన్ మరియు ఎల్బిట్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్ వాళ్ళు తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు భారత్ మరియు ఇజ్రాయెల్.
ఫైర్ ఫ్లై:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*నెమ్మదిగా యుద్ధ సామగ్రిని చేరవేస్తుంది.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
వార్ మేట్:
*దీన్ని పోలాండ్ లో తయారు చేస్తున్నారు.
*నెమ్మదిగా యుద్ధ సామగ్రిని చేరవేస్తుంది.
*మొత్తం 100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం పోలాండ్.
స్వార్మ్ డ్రోన్:
*తయారీ దేశం భారత్.
*స్వార్మ్ డ్రోన్.
*100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*బెంగళూరు బేస్డ్ స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ వారికి 100 యూనిట్లకి 15 మిలయన్ డాలర్ల కాంట్రాక్టు ఇచ్చింది.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఆయుధాలు
DRDO రుస్తమ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*ట్రయల్స్ లో ఉంది.
ఓడలు
GSL ఫాస్ట్ పెట్రోల్ బోట్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పెట్రోల్ బోట్.
*మొత్తం 12 బోట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*గోవా షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేస్తున్నారు.
*పాంగాంగ్ Tso సరస్సు లో ఉపయోగిస్తారు.
*ఈ బోట్లు ప్రత్యేకంగా ఏంటీ రేమ్మింగ్ లక్షణాలతో,ఆప్టికల్ సెన్సార్,వెపన్ సిస్టమ్ మరియు ఇతర నిఘా పరికరాలతో ఉంటుంది.
తయారీ దేశం భారత్.
ఫ్లాట్-బోటమ్డ్ ట్రూప్ బోట్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పెట్రోల్ బోట్.
*మొత్తం 17 బోట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*ఫైబర్ గ్లాస్ తో తయారు చేయబడిన ఫ్లాట్ బోటమ్డ్ బోట్.
*20 నుంచి 22 ట్రూప్ లను తీసుకొని వెళ్ళ గల సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*20 నాట్ల వేగాన్ని అందుకోగలదు.
*ఆక్వారిస్ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేసారు.
తయారీ దేశం భారత్.
టెంపెస్ట్ 35 స్వాట్ పెట్రోల్ క్రాఫ్ట్:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మొత్తం 17 బోట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*పాంగాంగ్ Tso సరస్సులో పెట్రోలింగ్ కి ఉపయోగిస్తారు.
*ఈ వేగవంతమైన బోట్లలో GPS,సోనార్,ఇకో సౌండర్ మరియు ఇన్ఫ్రారెడ్ చీకట్లో చూడగల కెమెరాలు ఉంటాయి.
*ఇవి 40 నాట్ల వేగాన్ని అందుకోగలవు.
*10 మంది పూర్తి ఆయుధ సామగ్రి కలిగిన సైనికులను తీసుకొని పోగలదు.
తయారీ దేశం అమెరికా.
రాడార్లు
EL/M-2090:
*తయారీ దేశం ఇజ్రాయెల్.
*వ్యూహాత్మకంగా ముందుగానే హెచ్చరించగల డ్యూయల్ బాండ్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
EL/M-2080 గ్రీన్ పైన్:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*సుదూర సామర్ధ్యం కలిగిన ఏంటీ బాలిస్టిక్ మిస్సైల్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
స్వార్డ్ ఫిష్ లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సుదూర సామర్ధ్యం కలిగిన ఏంటీ బాలిస్టిక్ మిస్సైల్ రాడార్.
*చాలా మార్పులు చేసి సరికొత్తగా ఇంప్రూవ్ చేసారు.
తయారీ దేశం భారత్.
DRDO టాక్టికల్ కంట్రోల్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎయిర్ డిఫెన్స్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆర్టిలరీ వెపన్ లొకేటింగ్ రాడార్.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
AN/TPQ-37 ఫైర్ ఫైండర్:
*దీన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఆర్టిలరీ లొకేటింగ్ రాడార్.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం అమెరికా.
అశ్విని:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆక్టివ్ ఫేస్డ్ ఏరై రాడార్.
ఫ్లై కేచర్:
*దీన్ని భారత్ మరియు నెదర్లాండ్స్ లో తయారు చేస్తున్నారు.
*ఫైర్ కంట్రోల్ రాడార్.
*260 కంటే ఎక్కువే సర్వీస్ లో ఉన్నాయి.
*భారీ సంఖ్యలో తయారు చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ లైసెన్స్ పొందింది.
తయారీ దేశాలు భారత్ మరియు నెదర్లాండ్స్.
భరణి:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*లో లెవల్ లైట్ వెయిట్ 2డి రాడార్.
రాజేంద్ర:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఏరై రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
ఇంద్ర-I/II:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు
*పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఏరై రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
రోహిణి:
*తయారీ దేశం భారత్.
*3డి రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
బెయిల్ బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*షార్ట్ రేంజ్ బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఆయుధాలు
వాహనాలు
ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్:
T-72 MBT స్థానంలో వీటిని తీసుకుని రాబోతున్నారు.మొత్తం 1770 తయారు చేస్తున్నారు.ట్యాంకులకు 120/125 స్మూత్ బోర్ గన్ అమర్చుతారు. మీడియం వెయిట్ (50 టన్నులు) ఉంటుంది.
ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్:
పాత BMP-2 శరత్ స్థానంలో వీటిని తీసుకుని వస్తున్నారు. దాదాపుగా 1750 తయారు చేస్తున్నారు.ముగ్గురు నుండి నలుగురు నడిపించేలా ఉంటుంది.
ఫిరంగి వ్యవస్థ
భారత్ ఆర్మీ దాదాపుగా 3000 155 mm టోయ్డ్ చక్రాలు కలిగిన ట్రాక్డ్ ఆర్టిలరీ సిస్టమ్స్ ని తయారు చేస్తున్నారు.స్వదేశీయంగా ట్యాంక్ లకు కావలసిన గన్ లను తయారు చేస్తున్నారు.నలంద ఆర్డినెన్సు ఫ్యాక్టరీ లో కీలకమైన బిఐ-ఛార్జ్ మాడ్యులర్ సిస్టమ్ ని తయారు చేస్తున్నారు.DRDO లాబ్ HEMRL స్వదేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది.
*స్టేట్ రన్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ దేశీయంగా FF77B ఆధారితంగా అభివృద్ధి చేసిన రెండు విధాలైన 155mm పొట్టి ఫిరంగులను అభివృద్ధి చేసారు.ఒకటి 155/39 కాలిబర్ మరియు మరొకటి 155/45 కాలిబర్ కలిగింది.ట్రయల్స్ లో ఉన్నాయి.
ప్రభుత్వం 155mm/52 సెల్ఫ్-ప్రపోల్డ్ ఫిరంగులను తయారు చేయడానికి కూడా ప్రైవేటు సెక్టార్ తో కలిపి ముగ్గురు తయారీ సంస్థలకి కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటుంది.వారి సామాగ్రిని పరిశీలిస్తున్నారు.
ఇన్ఫాంట్రీ ఎక్విప్మెంట్:
*స్నిప్పర్ రైఫిల్స్-
పాత డ్రగనోవ్ SVD స్థానంలో తీసుకొని రావడానికి 5000 .338 లపువా మాగ్నమ్ కొత్త స్నిపర్ రైఫిల్స్ ని తయారు చేస్తున్నారు.
ఏంటీ-మెటీరియల్ రైఫిల్స్:
గ్లోబల్ RFI's MOD ద్వారా ఇస్తున్న 1000 కొత్త ఏంటీ మెటీరియల్ రైఫిల్స్ ని కొనాల్సి ఉంది.
బాలిస్టిక్ హెల్మెట్:
భారత ప్రభుత్వం 1,70,000 బాలిస్టిక్ హెల్మెట్ లను కొనడానికి అప్రూవల్ ఇచ్చింది.
బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్:
2016 లో ఆర్డర్ చేసిన 50,000 జాకెట్స్ కి అదనంగా మరొక 1.86 లక్షల జాకెట్స్ ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్ చేసారు.
ఏవియేషన్
*HAL లైట్ కాంబాట్ హెలికాప్టర్:
114 HAL LCH తయారు చేయడానికి HAL సంస్థకి ఆర్డర్ ఇచ్చారు.
*HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్:
పాతబడిపోయిన చేతక్ మరియు ఛీతా స్థానాల్లోకి 197 లైట్ హెలికాప్టర్లు అవసరం ఉందని ఇండియన్ ఆర్మీ వారు చెప్పారు. 60 యూరికాప్టర్ హెన్నెక్ హెలికాప్టర్ లు ఎగరడానికి సిద్ధంగా ఉన్నవి మరియు మిగిలినవి విడి భాగాలుగా కావాలని మొత్తం 550 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు చేసారు.కానీ తర్వాత ఈ ఆర్డర్ లో అవకతవకలు ఉన్నాయని నిందలు రావడంతో ఆ ఆర్డర్ ని ఆపేసారు.
తర్వాత ట్రయల్స్ లో KAMOV Ka -226 ఫైనల్ అవ్వడంతో మేకిన్ ఇండియా లో భాగంగా 200 హెలికాప్టర్ లనం తయారు చేస్తున్నారు.HAL LUH హెలికాప్టర్ లు వచ్చే వరకు ఇండియన్ ఆర్మీ ఛేతక్ మరియు ఛీతా స్థానాల్లోకి వీటిని పెడతారు.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
మిస్సైల్ సిస్టమ్
ఏంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్స్
స్పైక్/స్పైక్ LR-II:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మొత్తం 400 కంటే ఎక్కువ టాంకులు ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*ఆర్మీ స్పైక్ MR మరియు స్పైక్ LR-II నడిపిస్తుంది.
*ఎయిర్ ఫోర్స్ MI-17 హెలికాప్టర్ల కోసం స్పైక్ N-LOS తీసుకుంది.
తయారీ దేశం ఇజ్రాయెల్.
9M 113 కోంకుర్స్-M(AT-5 స్పాండ్రల్):
*భారత్ మరియు రష్యా లు తయారు చేస్తున్నాయి.
*మొత్తం 15,140 సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*భారత్ డైనమిక్ లిమిటెడ్ వారి ద్వారా భారత్ లోనే BMP-2(IFV) కోసం తయారు చేస్తున్నారు.
తయారీ భారత్ మరియు రష్యా.
మిలాన్ 2టి:
*భారత్ మరియు ఫ్రాన్స్ లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 34,000 సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*దేశీయంగా తయారు చేయడానికి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ లైసెన్స్ పొందింది.
తయారీ దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్.
9M119Svir(AT-11 స్నిప్పర్):
*భారత్ మరియు రష్యా లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 25,000 సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*10000 యూనిట్లు రష్యా నుండి దిగుమతి చేసుకోబడతాయి.
తయారీ దేశాలు భారత్ మరియు రష్యా.
9M133కార్నెట్(AT-14 స్ప్రిగ్గన్):
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*3000 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*250 లాంఛర్స్ తో సహా కొంటున్నారు.
తయారీ దేశం రష్యా.
9M120 అటాక-V(AT-9 spiral-2):
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఏంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం రష్యా.
9K114 స్టర్మ్(AT-6 స్పైరల్):
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*800 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.
తయారీ దేశం రష్యా.
ధృవ్ అస్త్ర:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎయిర్-టు-గ్రౌండ్ ఏంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.
*ట్రయల్స్ విజయవంతం గా పూర్తి చేసుకుని తయారీకి సిద్ధంగా ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
MPATGM:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ట్రయల్స్ విజయవంతం గా పూర్తి చేసుకుని తయారీకి సిద్ధంగా ఉన్నాయి.
*మేన్ పోర్టబుల్ ఏంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్.
తయారీ దేశం భారత్.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఆయుధాలు
సామ్హో (మిస్సైల్):
*భారత్ లోనే తయారు చేయబోతున్నారు.
*కెనాన్ లాంఛ్డ్ ఏంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్.
*DRDO 3 టెస్ట్ లను విజయవంతంగా పూర్తి చేసింది.
బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిస్సైల్
బ్రహ్మోస్:
*భారత్ మరియు రష్యా లలో తయారు చేస్తున్నారు.
*సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
*మొత్తం 4 రెజిమెంట్ లు సర్వీస్ లో ఉన్నాయి.
*ప్రతి రెజిమెంట్ లోనూ 24 లాంఛర్స్ లేదా 72 ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మిస్సైల్స్ ఉంటాయి.
*290-700 కి.మీ. స్థాయి కలిగి ఉంటాయి.
*ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
*ఎంత సంఖ్యలో ఉన్నాయి అని ఖచ్చితంగా తెలియదు.కానీ చైనా మాత్రం భారత్ వద్ద 14,000 ఉన్నాయి అని చెప్తుంది.
తయారీ దేశాలు భారత్ మరియు రష్యా.
నిర్భయ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*1000-1500 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
*సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
తయారీ దేశం భారత్.
శౌర్య:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*క్వాసీ బాలిస్టిక్ మిస్సైల్.
*700-1900 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
పృథ్వీ-II:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*150-300 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
అగ్ని-I:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*700-1250 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
అగ్ని-II:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*2000-3500 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
*తయారీ దేశం భారత్.
అగ్ని-III:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*3500-5000 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
అగ్ని-IV:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*4000-6000 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత సైన్యం ఫిరంగులు
smerh 9K58 MBRL:
*భారత్ మరియు రష్యా లు తయారు చేస్తున్నాయి.
*90 కి.మీ. రేంజ్ కలిగిన 300mm మల్టిపుల్ రాకెట్ సిస్టమ్.
*మొత్తం 972 లాంఛర్స్ ఉన్నాయి.
తయారీ దేశాలు-భారత్ మరియు రష్యా.
పినాక MBRL:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*MK1 37-45కి.మీ రేంజ్ కలిగి ఉంటుంది.
*MK2 60కి.మీ. రేంజ్ కలిగి ఉంటుంది.
*మొత్తం 288 లాంఛర్స్ ఉన్నాయి.
*మరొక 3 పినాక మార్క్ 1రెజిమెంట్స్ మరియు 6 పినాక మార్క్ 2 రెజిమెంట్స్ 2022 చివరికి తయారు చేయడానికి లార్సెన్ అండ్ టర్బో మరియు టాటా లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
*సంవత్సరానికి 5000 మిస్సైల్స్ తయారు చేస్తున్నారు.
*2028 కల్లా ఆర్మీ మొత్తం 22 రెజిమెంట్స్ సిద్ధం చేసుకుంటున్నారు.
తయారీ దేశం-భారత్.
BM-21:
*దీన్ని భారత్ మరియు సోవియట్ యూనియన్ తయారు చేస్తున్నారు.
*ఇది ఒక 122 mm సామర్ధ్యం కలిగిన మల్టిపుల్ రాకెట్ లాంఛ్ సిస్టమ్.
*దీన్ని భారత్ లోనే అభివృద్ధి చేస్తున్నారు.
*DRDO ద్వారా దీని ఫైరింగ్ రేంజ్ ని 40 km వరకు పెంచుతున్నారు.
*మొత్తం 240 లాంఛర్స్ సర్వీస్ లో ఉన్నాయి.
*2023 కల్లా మొత్తం 240 యూనిట్ల స్థానంలో పినాక మార్క్ 1 MBRL యూనిట్లను పెడతారు.
తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.
స్వయంచాలక ఫిరంగులు
K-9 వజ్ర టి:
*భారత్ మరియు సౌత్ కొరియా లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 200 యూనిట్లు తొందర్లోనే ఆర్డర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*K9 థండర్ వేరియంట్.
*155 mm/52 కేలిబర్ కలిగిన స్వయంచాలక పొట్టి ఫిరంగి.
*భారత్ లోని లారెన్ అండ్ టర్బో సంస్థ తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు భారత్ మరియు సౌత్ కొరియా.
పెద్ద బురుజు కలిగిన ఫిరంగులు
ధనుష్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*155mm/45 కాలిబర్ సామర్ధ్యం కలిగిన పొట్టి బురుజు కలిగిన ఫిరంగి.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
*మొత్తం 114 గన్స్ ఆర్డర్ లో ఉన్నాయి.ఈ ఆర్డర్ 414 కి చేరే అవకాశం ఉంది.
తయారీ దేశం భారత్.
BAE సిస్టమ్స్ M777:
*భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేస్తున్నారు.
*155 mm/39 కాలిబర్ చిన్న బురుజు కలిగిన ఫిరంగి.
*మొత్తం 89 సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 145 ఆర్డర్ లో ఉన్నాయి.
*మహీంద్రా డిఫెన్స్ ఇండియా వారు విడి పరికరాలను కలిపి తయారు చేస్తున్నారు.
హాబిట్స్ FH77 A/B:
*స్వీడన్ లో తయారు చేస్తున్నారు.
*155mm పొట్టి ఫిరంగి.
*155mm గన్స్ బోఫోర్స్ లో తయారు చేస్తున్నారు.
*తొందర్లోనే ధనుష్ ఫిరంగులను వీటి స్థానంలో పెట్టబోతున్నారు.
తయారీ దేశం స్వీడన్ .
M-46 షరాంగ్:
*సోవియట్ యూనియన్, ఇజ్రాయెల్ మరియు భారత్ లు తయారు చేస్తున్నాయి.
*130mm/155mm ఫీల్డ్ గన్.
*860+240 మొత్తం 1100 షరాంగ్స్ అభివృద్ధి చేసారు.
*180 M-46 130 mm ఫిరంగులు 155 mm స్టాండర్డ్ కి సోల్తామ్ వారి ద్వారా అభివృద్ధి చేసారు.
*300 M-46 గన్స్ OFB వారి ద్వారా 155mm/45 కాలిబర్ గా అభివృద్ధి చేయాల్సి ఉంది.
*ఈ అభివృద్ధి చేసిన గన్స్ ని షరాంగ్ అంటారు.
తయారీ దేశాలు భారత్, సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్.
OFB ఇండియన్ ఫీల్డ్ గన్ Mk 1/2/3:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*105mm ఫీల్డ్ గన్.
*1700 సర్వీస్ లో ఉన్నాయి.
*30 కి.మీ. రేంజ్ వరకు FCS మరియు INS ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.
తయారీ దేశం భారత్.
స్థిరంగా ఉండే ఫిరంగులు
విజయంత MBT:
*భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేస్తున్నారు.
*105mm పిల్ బాక్స్ కలిగి ఉంటుంది.
*200 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*105mm గన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర స్థిరంగా అమర్చారు.
తయారీ దేశాలు భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్.
T-55 MBT:
*భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి.
*105mm గన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర స్థిరంగా అమర్చారు.
*700 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఫిరంగులు
DRDO సరికొత్త బురుజు కలిగిన ఫిరంగుల గన్ సిస్టమ్(ATAGS):
*భారత్ లోనే తయారు చేస్తారు.
*155mm/52 కాలిబర్ బురుజు కలిగిన గన్.
*7 యూనిట్లు తయారు చేస్తున్నారు.
*3364 కోట్ల రూపాయల విలువ గల 150 యూనిట్లు తయారు చేయడానికి డిఫెన్స్ ఆక్విసిషన్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది.