NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారతీయ నావికా దళం
భారత దేశాన్ని చుట్టూ ఉన్న సముద్రం నుండి జరిగే దాడుల నుండి కాపాడే దళం ఈ నావికా దళం.దీనికి కూడా అత్యున్నత కమాండర్ గా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు.నావికా దళ ముఖ్య అధికారిగా నాలుగు నక్షత్రాలు కలిగిన అధిపతి కమాండర్ గా ఉంటారు.మన నావికా దళం పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మరియు మలక్కా జలాలలో వేరే దేశానికి చెందిన ఎవ్వరూ మన జలాలలోకి రాకుండా కాపలా కాస్తూ ఉంటారు, అలాగే మిగిలిన నావికా దళాలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటారు. అలాగే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాలలో అలాగే పశ్చిమ సముద్ర జలాల్లో ఒక పెద్దగా సైన్యాన్ని మోహరిస్తూ ఉంటారు.
భారత నావికా దళ ప్రాథమిక బాధ్యత భారత దేశ సముద్ర పొలిమేరలను కాపాడడం, అలాగే శత్రు సైన్యాలతో సమస్యలు వచ్చినప్పుడు వారి ఉచ్చులను పసిగట్టి వారిని ఓడించాలి.మన నావికా దళం శాంతి మరియు యుద్ధం రెండింటినీ ప్రేమిస్తుంది. సమైక్య అభ్యాసాలు,స్నేహ పూర్వక సభలు ఏర్పాటు చేయడం మరియు విపత్తులలో సహాయం అందించడం ద్వారా మిగిలిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉంటుంది.
దాదాపుగా 67,252 సర్వీస్ లో ఉన్న సభ్యులతో పాటు 75,000 మంది రిసర్వ్ సభ్యులు ఉన్నారు. అలాగే శక్తివంతమైన 150 షిప్స్ మరియు సబ్ మెరైన్స్ కలిగి,300 ఎయిర్ క్రాఫ్ట్ కలిగి ఉన్నారు.వీటితో బాటు ఆపరేషనల్ ఫ్లీట్ 2 ఎయిర్ కారియర్స్,1 బలమైన రవాణా నౌక, 8 ల్యాండింగ్ షిప్ టాంక్స్,10 డెస్ట్రాయర్స్,13 ఫిరంగులు కలిగిన యుద్ధ నౌకలు,1 బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్,16 సాంకేతికంగా బలమైన సబ్ మెరైన్స్,24 చిన్న యుద్ధ నౌకలు,1 మైన్ కౌంటర్ మెసర్ వెసెల్,4 ఫ్లీట్ టాంకర్స్ మరియు ఇంకెన్నో ఇతర ఫిరంగులు కలిగిన నౌకలు, చిన్న పెట్రోల్ బోట్ లు అలాగే సోఫిస్టికేటెడ్ షిప్స్ ని కలిగి ఉన్నారు.ఇది మల్టీ రీజనల్ శక్తిని ప్రదర్శించగల నీలి జలాల నావికా దళంగా పరిగణించబడుతుంది.
భారత నావికా దళ చరిత్ర
భారత నావికా వ్యవస్థ అనేది 6000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది.మన దేశం లో క్రీ.పూ.2300 సంవత్సరం సింధు నాగరికత సమయంలోనే ఇప్పటి గుజరాత్ లోని మంగ్రోల్ ఓడ రేవు దగ్గర లోథల్ లో మొట్ట మొదటి సముద్ర వాహనం తయారు చేసినట్టు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన ఋగ్వేదం మన హిందూ దైవం వరుణ దేవుడికి సముద్ర మార్గాలకు సంబంధించిన అవగాహన ఉందని తెలిపింది మరియు మన భారతీయులు వందల పడవలతో యుద్ధాలు చేసాయని కూడా తెలిపింది.అంతేకాదు ప్లవ అనే నామం కల తుఫానుల్లో ఓడలను స్థిరంగా ఉంచే యంత్రం గురించి కూడా తెలిపింది.ప్లవని నేటి తరం స్థిరీకరించే యంత్రాలకు మొట్ట మొదటి యంత్రం గా పేర్కొంటారు. సముద్రం లో దిక్సూచి ని మొట్టమొదట క్రీ.శ.4 లేదా ఐదు సంవత్సరాల లో మత్స్య యంత్ర పేరుతో ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది.అలాగే భారతీయులు జావా,సుమత్రా దీవులతోనూ,గ్రీకులతోనూ,రోమనులతోనూ విలువైన వజ్రాలు,తోళ్ళు, వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలు చేసేవారు.
క్రీ.శ. 5-10 సంవత్సరాలలో కలింగ రాజ్యం జావా మరియు సుమత్ర దీవులను హస్తగతం చేసుకున్నారు. అండమాన్ మరియు నికోబార్ దీవులు వ్యాపార నౌకలకు ఓడ రేవులుగా పని చేసేవి.క్రీ.శ.984-1042 మధ్యలో రాజ రాజ చోళ 1, రాజేంద్ర చోళ 1 మరియు కులోతంగు చోళ 1 బర్మా, శ్రీలంక,సుమత్ర మరియు మలయ దీవులను గెలిచి సముద్రపు దొంగలను అణచివేసారు.
14 మరియు 15 శతాబ్దాలలో భారతీయ నావికా వ్యవస్థ ఓడలను తయారు చేయడంలో ఎంతో ఉన్నత స్థాయి కి చేరుకుంది.ఒకటి కంటే ఎక్కువ గదులతో తయారు చేయడం మొదలు పెట్టారు.దాని వలన ఒక గది పాడైపోయినా మిగిలిన గదులలో ఉండడానికి వీలు ఉండేది.ఈ రూప రచన మిగిలిన యురోపియన్ కంట్రీస్ కూడా అప్పటికి తయారు చేయలేకపోయాయి.
13వ శతాబ్దం చివరికల్లా భారతీయ నావికా వ్యవస్థ తిరోగమనం ప్రారంభమైంది.దాని అధ్వాన్న స్థితికి చేరుకుంది.అదే సమయంలో పోర్చుగీసు వాళ్ళు భారత దేశానికి చేరుకున్నారు.దేశంలో వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.తర్వాత మొత్తం ఆసియా ఓడల పైన దాడులు చేయడం మొదలు పెట్టారు.ఎవ్వరినీ సముద్రాల ద్వారా వ్యాపారాలు చేసుకోడానికి ఆప్పుకునేవారు కాదు.1529 లో ముంబయిలో జరిగిన పోరు వల్ల థానే,కరంజా మరియు బందోరా పోర్టులు తమ హస్తగతం అయ్యాయి.1534 కల్లా మొత్తం ముంబయి పోర్ట్ పైన ఆధిపత్యం సాధించారు.వాస్కోడా గామా ఎప్పుడైతే వ్యాపార ఒప్పందాలను అనుసరించి కట్టవలసిన పన్నులు కట్టడానికి తిరస్కరించాడో జోమరిన్ ఆఫ్ కలకత్తా పోర్చుగీసు వ్యాపారాలను అడ్డుకున్నారు. దీని ఫలితంగా రెండు పెద్ద యుద్ధాలు సముద్రంలో జరిగాయి.ఒకటి 1504 లో కొచ్చిన్ లో జరిగింది.మరొకటి నాలుగేళ్ల తర్వాత దివు లో జరిగింది.ఈ రెండు యుద్ధాలలో భారత్ ఓడిపోయింది.
17వ శతాబ్దం చివరికల్లా మళ్ళీ భారతీయ నావికా వ్యవస్థ పురోగమనం సాధించింది.మొఘలులు మరియు సిద్దీస్ ఆఫ్ జంజీర సంబంధాల వల్ల పశ్చిమ తీర ప్రాంతం లో శక్తివంతంగా ఎదగగలిగారు.
దక్షిణాది లో మరాఠ రాజ్యానికి మొదటి ప్రముఖుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సొంత నావికా వ్యవస్థ ని, నావికా దళాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు.వీరి నావికా దళం సిద్ధోజి గుజార్ మరియు కన్హోజీ ఆంగ్రే ఇద్దరి నావికా అధిపతుల సారధ్యంలో నడిచేది.ఆంగ్రే సారధ్యంలోని మరాఠా నావికా దళం ఇంగ్లీష్, పోర్చుగీసు మరియు డచ్ వాళ్ళని కొంకణ్ తీర ప్రాంతం వైపు చూడడానికి కూడా భయపడేలా చేసేవి.కానీ ఎప్పుడైతే 1729 లో ఆయన మరిణించారో ఆ తర్వాత మరాఠా నావికా దళం క్షీణించడం మొదలైంది.
1612 లో ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీసు వారిని ఓడించినప్పుడు సముద్రపు దొంగలు రెచ్చిపోయేవారు.వారిని ఆపడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటన్ వాళ్ళు నావికా దళాన్ని ఏర్పాటు చేశారు.మొదటి స్క్వాడ్రన్ సెప్టెంబర్ 5,1912 లో గుజరాత్ తీరానికి చేరుకుంది.గల్ఫ్ ఆఫ్ కాంబే మరియు నర్మద,తపతి నదులలో బ్రిటిష్ వ్యాపార నౌకలను కాపాడడం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత.ఎప్పుడైతే బ్రిటన్ సామ్రాజ్యం భారత్ లో విస్తరిస్తుందో ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత కూడా పెరుగుతూ వెళ్ళింది.
తర్వాత 1686 నుండి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ని నడిపించేవారు.అప్పటి నుండి దాని పేరు బొంబే మెరైన్ గా మార్చబడింది.తర్వాత కాలంలో బాంబే మెరైన్ డచ్,ఫ్రెంచ్,మరాఠా మరియు సిద్ధి నౌకలను తీసుకున్నారు.తర్వాత కాలంలో 1824 లో మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం లో పాల్గొంది.1834 లో బొంబే మెరైన్ హర్ మెజెస్టీస్ ఇండియన్ నావీగా మారింది.ఇండియన్ నావీ 1840 లో మొదటి ఓపియమ్ వార్ లో,1852 లో రెండవ ఆంగ్లో-బర్మీస్ యుద్ధం లో పాల్గొంది.తర్వాత 1863 నుండి 1877 మధ్యలో మళ్ళీ దాని పూర్వ నామం బోంబే మెరైన్ గా ఉండి మళ్ళీ హర్ మెజెస్టీస్ ఇండియన్ మెరైన్ గా మారింది.ఆ సమయంలో మెరైన్ కలకత్తా లో బంగాళాఖాతం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో తూర్పు డివిజన్ మరియు బోంబే లో అరేబియన్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ డివిజన్ మొత్తం రెండు డివిజన్ లుగా విభజించారు.మళ్ళీ 1892లో రాయల్ ఇండియన్ మెరైన్ గా మారింది.19వ శతాబ్దం చివరికల్లా మొత్తం 50 ఓడలతో పని చేసేది. మొదటి ప్రపంచ యుద్ధం లో పెట్రోల్ బోట్లతో, ట్రూప్ క్యారియర్ తో, మైన్ స్వీపర్ బోట్లతో పాల్గొంది.1928 లో డి.ఎన్.ముఖర్జీ గారు కమిషన్ కి మొదటి భారతీయ ఇంజనీర్ సబ్ లెఫ్టినెంట్ అయ్యారు.
1934 లో మెరైన్ పూర్తి నావల్ ఫోర్స్ గా రూపాంతరం చెందింది. అప్పటి నుండి రాయల్ ఇండియన్ నావీ గా పిలువబడేది.అలాగే బ్రిటన్ ప్రభుత్వానికి విధేయులుగా పని చేస్తున్నట్టు తెలిపే రాజ వర్ణాలు ఉపయోగించేవారు.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఐదు స్తంభపు ఓడలు, ఒక సర్వే ఓడ,ఒక సరుకులు రవాణా చేసే ఓడ,ఒక పెట్రోలింగ్ ఓడ మరియు కొన్ని చిన్న చిన్న ఆయుధాలు కలిగిన ఓడలు,114 మంది అధికారులు,1732 మంది నావికులు మాత్రమే కలిగి ఉంది రాయల్ నావీ.
1940 నుండి మనుషులు మరియు వస్తువులు ఈ సంఖ్య రెట్టింపు అవూతూ 1942 నాటికి ఆరు రెట్లు పెరిగింది.నావీ చాలా హిందూ మహా సముద్రంలో చాలా ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తుంది.యుద్ధ సమయాల్లో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. 1945 నాటికి ఏడు స్తంభపు ఓడలు, నాలుగు ఫిరంగులు కలిగిన యుద్ధ నౌకలు, నాలుగు చిన్న యుద్ధ నౌకలు,14 మైన్ స్వీపర్స్,14 పడవలు, రెండు డిపో షిప్స్,30 సహాయక నౌకలు,30 ఆగ్జిలరీ నౌకలు, 150 నౌకలు,200 ఓడరేవు దగ్గర ఉండే చిన్న నౌకలు మరియు మరికొన్ని అఫెన్సివ్, డిఫెన్సివ్ మోటార్ లాంఛర్స్ సమకూర్చుకుంది.
1945 వరకు నావికా దళం లో భారతీయులు ఇంజనీరింగ్ కమాండర్ స్థాయి కంటే పై స్థాయి కి ఎవ్వరూ వెళ్ళలేదు.1946 లో భారతీయులు భారతీయ నావికా వ్యవస్థ కి వ్యతిరేకంగా 78 ఓడలు,20 తీర ప్రాంతాలలో 20000 మంది నావికులతో స్ట్రైక్ చేసారు.స్ట్రైక్ మొదలైన తర్వాత కమ్యూనిస్టు పార్టీ సపోర్ట్ చేసింది.కానీ భారత్ ఆర్మీ దగ్గర నుండి కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నుండి కానీ,యం.ముస్లీం లీగ్ నుండి కానీ అస్సలు సపోర్ట్ లభించలేదు.తర్వాత ఈ స్ట్రైక్ విఫలమైంది.1947 జూలై 21న H.M.S.ఛౌదరీ మరియు భాస్కర్ సదాశివ సోమన్ ఇద్దరూ పాకిస్థాన్ మరియు భారత నావికా దళాలుగా ఆఫీసర్లు అయ్యారు.
1947 తర్వాత భారత్ మరియు పాకిస్థాన్ విడిపోయాయి.21 శాతం నావికా అధికారులు మరియు 47 శాతం నావికులు పాకిస్థాన్ నావికా దళం లో పని చేయడానికి మొగ్గు చూపారు.32 ఓడలు మరియు 11,000 మంది ఉద్యోగస్తులు భారత్ కి వచ్చారు.అదే రోజున బ్రిటీషు అధికారులు మొత్తం పదవీ విరమణ తీసుకొన్నారు.వారి స్థానాల్లో భారతీయులు వచ్చారు. 1948 జనవరిలో D.N.ముఖర్జీ మొట్ట మొదటి ఇంజనీరింగ్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యారు.1948 మే లో కెప్టెన్ అజితేందు చక్రవర్తి కమోడోర్ ర్యాంక్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాడు.1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశం అయిన తర్వాత రాయల్ అనే పేరును తొలగించి ఇండియన్ నావీ గా నామకరణం చేశారు.ఓడల పేర్లు కూడా హిస్ మెజిస్టీస్ షిప్ నుండి ఇండియన్ నావల్ షిప్స్ గా మారాయి.అదే సమయంలో ఇంపీరియల్ క్రౌన్ గుర్తు తొలగించి లయన్ కేపిటల్ ఆఫ్ అశోక ను చేర్చారు.వైట్ ఎన్సైన్ లోని యూనియన్ జాక్ స్థానంలో భారతీయ తిరంగాని చేర్చారు.
#indiannavy #indianarmy #indianairforce #indian #army #india #jaihind #bsf #crpf #commando #ssb #parasf #ncc #specialforces #nda #itbp #indianarmylovers #indianarmedforces #airforce #ima #indianmilitaryacademy #paracommando #armylife #cisf #fauji #nsg #navy #nationaldefenceacademy #love #bharatmatakijai
#iaf #upsc #indiansoldiers #indianarmyfans #instagram #vandematram #defence #nsgcommandos #bharat #cds #bhagatsingh #indianarmyvideo #marcos #military #soldier #indianarmyday #follow #delhi #ota #armedforces #indiannavyday #indianarmyofficers #armystrong #armybrat #indianflag #paracommandos #mumbai #ssbinterview #indiandefence #bhfyp
#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
0 $type={blogger}