NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత విభజన సమయంలో మారణహోమం
ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే
ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం ఒక మతాన్ని విమర్శించడం,ఒక వర్గాన్ని తప్పు పప్పడం కాదు.యుగయుగాలుగా ఎన్నో దాడులను ఎదుర్కొని ఇప్పటికీ ఈ ఈ భూమి పైన నిలబడిన ఒకే ఒక్క పురాతన ధర్మం పైన దాడుల గురించి మరీ ముఖ్యంగా దేశ విభజన సమయంలో జరిగిన అమానుష దాడులను తెలియజెప్పడానికి.ఎందుకంటే భారత సైన్యం భారత దేశం ఏర్పడిన తర్వాత చేసిన మొట్టమొదటి యుద్ధం నుండి వివరంగా చెప్పాలని ప్రయత్నించినప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు ఈ అంశం నాకు ఎదురుపడింది.అవును భారత దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదట జరిగిన ఈ మారణహోమం గురించి తెలియజేసి ముందుకు వెళ్ళాలని కొన్ని ఆధారాలను సేకరించి వాటిని జాగ్రత్తగా ఒక కథ రూపంలో రాసి మీ ముందుకు తీసుకు రావాలనేదే నా ప్రయత్నం.ఇక్కడ నేను చెప్పింది లెక్కల్లో చూపించిన, దాడులు జరిగిన కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు మాత్రమే.నిజానికి వాస్తవికత ఇంతకంటే మహా దారుణంగా ఉంటుంది.అవి నాకు తెలిసినప్పటికీ సరైన ఆధారాలు లేక ఇవి మాత్రమే రాస్తున్నాను.అర్ధం చేసుకోగలరు.
1947 అగస్టు 15వ తారీఖున భారత దేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చి దేశం విడిచి వెళ్ళితామని సంవత్సరం ముందు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.
అప్పటి వరకు బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు మొదలైన నిరంకుశ పాలనలో బానిసలుగా బ్రతికిన భారతీయులు, స్వాతంత్ర్యం కోసం ఎంతో ప్రాణ త్యాగం చేసి, మరెంతో మంది జైలు లో అత్యంత కఠిన శిక్షలు అనుభవించి,మరి కొందరు ఇంకా ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఆనందంగా వచ్చే స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా అప్పటి వరకు హిందువులు మొఘలుల, తురుష్కుల, ముస్లిం ల పాలనలో
ADVERTISEMENT
మంచి ఆకర్షణీయమైన క్యారియర్ చాలా తక్కువ ధరకే అమెజాన్ లో లభిస్తుంది.త్వరపడండి.
SOPL-OLIVEWARE Alloy Steel Teso Pro Lunch Box with Bottle, 3 Stainless Steel Containers, Plastic Pickle Box | Steel Spoon & Fork | Insulated Fabric Bag | Leak Proof | Microwave Safe | Full Meal | Blue
Colour | BLUE |
Material | Stainless Steel |
Brand | SOPL-OLIVEWARE |
Age Range (Description) | Adult |
Special Feature | Airtight, Freezer Safe, Microwave Safe, Dishwasher Safe |
Number of Pieces | 5 |
సబక్తజిన్ పెషావర్ వద్ద జయపాలుని ఓడించి,15000 మంది హిందువులను ఓడించి,5,00,000 మంది పిల్లలు,స్త్రీలతో సహా బందీలుగా చేసి హింసించాడు, తర్వాత బులందషహర్ వద్ద కుల చంద్రుని ఓడించి 50,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ బిన్ ఖాసిం బ్రాహ్మణబాద్ లో 16,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ ఘజినీ సోమనాథ్ దేవాలయంలో 50,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ ఘోరీ సరైన లెక్కలు లేవు,
అల్లావుద్దీన్ ఖిల్జీ కంబయత్ లో 20,000 మంది హిందువులను చంపించి,20,000 మంది స్త్రీలను బందీలుగా తీసుకుని వెళ్ళాడు,చిత్తోర్ లో వీడి వల్ల 20,000 మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు,
ఒడిశా జాజ్ నగర్ లో ఫిరోజ్ షా తుగ్లక్ 1,00,000 మంది హిందువులను చంపించాడు,
ఢిల్లీలో తైమూర్ లంగ్ 1,00,000 మంది హిందువులను చంపించాడు, భువనగిరి లో మాలిక్ కాఫుర్, ఓరుగల్లు లో ఉలుఘ్ ఖాన్,మధుర దేవాలయములో మాలిక్ కాఫుర్, మలబార్ లో మాలిక్ కాఫుర్ లక్షల మంది హిందువులను చంపించారు, విజయనగరం లో ముహమ్మద్ షా 5,00,000 మంది హిందువులను చంపించాడు,తళ్ళికోట యుద్ధం తర్వాత హంపి లో 1,00,000 మంది పైనే మారణహోమం జరిగింది,1568లో చిత్తోర్ ఘఢ్ లో అక్బర్ 30,000 మందిని చంపిస్తే,8,000 మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు, ఔరంగజేబు దక్షిణ భారత దేశం పైన చేసిన దండ యాత్ర లో 26,00,000 మందికి పైగా చంపించాడు,మొఘలులకు మరాఠాలకు జరిగిన యుద్ధం లో సంవత్సరానికి లక్ష మంది మరణించారు, కర్ణాటక లో హైదర్ అలీ,టిప్పు సుల్తాన్, గోవాలో పోర్చుగీసు వారు,ఇంకా లెక్కల్లో లేని ఆంగ్లేయుల పాలన లో అకృత్యాలు భారతదేశంలో హిందువుల పైన అత్యంత పైశాచిక దాడులు చేసి, చివరికి ఆడవారిని బహిరంగంగా గుంపులుగా చచ్చే వరకు అత్యాచారాలు చేసి, వారి అవయవాలను వేరు చేసి,జిజియా పన్ను రూపంలో హిందువులను కాల్చుకు తిని, రాక్షసత్వాన్ని చూపించి ఒక్కొక్క పాలకులు లక్షల మందిని చంపి,లక్షల మందిని భయభ్రాంతులకు గురి చేసి,మత మార్పిడిలు చేసి అతలాకుతలం చేసారు.నిజానికి కొన్ని యుగాల ముందు రాక్షసులు కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువులను చంపించారు.వాళ్ళు కనుమరుగైపోయారు.కానీ సనాతన ధర్మం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.ఇన్ని దారుణాలను చవి చూసిన హిందువులు స్వాతంత్ర్యం మాట వినగానే ఎంతో ఆనందంగా ఎదురు చూసారు.కానీ మహమ్మద్ అలీ జిన్నా రూపంలో మళ్ళీ వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటారని ఊహించలేకపోయారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడని బ్రతికుండగానే తలకిందులుగా వేలాడదీసి ఛర్మం వలిచి మతం మారమన్నా మారలేదు.ఇటువంటి ఎన్నో సందర్భాలు తెలియజేయాలి.కానీ ఇక్కడ అసలైన ఆర్టికల్ విభజన సమయంలో మారణహోమం కనుక చిన్నగా చెప్పి ముందుకు వెళ్తున్నాను.
ఈ రెండూ కలకత్తా అల్లర్లు మరియు జిన్నా గురించి, మరొకటి లో నోఖాలీ హత్యాకాండ గా ఉంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది అనగానే మహమ్మద్ అలీ జిన్నా తమకు ముస్లీం ల మెజారిటీ ఉన్న ప్రత్యేక దేశం కావాలని కోరాడు.కానీ జాతీయ కాంగ్రెస్ దానికి అంగీకరించలేదు.దాంతో
మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మీకు యుద్ధమే కావాలంటే మేము దానికి సిద్ధమే అంటూ తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు.అయితే భారతదేశాన్ని విభజిస్తాము లేదా నాశనం చేసేస్తాము అంటూ బెదిరించాడు.
ADVERTISEMET
మీ పిల్లలకు నచ్చే మంచి అందమైన ఆట వస్తువు.
Wembley Toys Talking Cactus Baby Toys for Kids Dancing Cactus Toys Can Sing Wriggle & Singing Recording Repeat What You Say Funny Education Toys for Children Playing Home Decor Items for Kids
Brand | Wembley |
Animal theme | Cactus |
Theme | Talking game |
Toy figure type | Play Figure |
Colour | Multicolor![]() |
ఆగస్టు 16,1946 ని డైరెక్ట్ ఏక్షన్ డే గా ప్రకటించి,ప్రణాళికా ప్రకారం కలకత్తా లో తన అనుచరులను ఉసిగొల్పాడు మరియు మతం పేరుతో ముస్లీమేతరుల ప్రాణాలను మాత్రమే కాదు,మన దారిలో లేని ముస్లీం లను కూడా చంపండి,మతం మార్చండి అంటూ పిలుపునిచ్చాడు.ముస్లీమేతరుల పైన జీహాద్ ని ప్రకటించాడు.
రక్తపాతం ఒక గొప్ప కారణం కోసం చేసినట్లయితే అది అసలు తప్పే కాదనీ, ఇప్పుడు మనకు ప్రత్యేక పాకిస్థాన్ ని సాధించడం కంటే ముఖ్యమైన పని మరొకటి లేదు అని వాళ్ళకి నూరి పోసారు.
దాంతో రెచ్చిపోయిన ముస్లీం అతివాదులు రోడ్ల పైకి వచ్చి తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు.
కనిపించిన వారిని కనిపించినట్టు ముస్లీమేతరులని నరికేసారు,పాడిచి చంపారు.చంపారు అనడం కంటే వారికి ఈ భూమి పైనే ప్రత్యక్ష నరకాన్ని చవి చూపారు,స్త్రీలను బహిరంగంగా సామూహిక అత్యాచారాలకు గురి చేసారు.బజార్లలో విధ్వంసం సృష్టించారు.వీధుల్లో వరుసగా ఉండే దుకాణాల గోడలు పడగొట్టారు,వాటికి నిప్పంటించారు, ఆ దుకాణాల్లోని కొత్త కొత్త వస్తువులు రోడ్ల పైకి విసిరికొట్టారు, ఫర్నిచర్, కాంక్రీటు బ్లక్ లు,ఇటుకలు,గాజు, ఇనుప కడ్డీలు, మెషీన్ టూల్స్ అన్నింటినీ రోడ్ల పైన చెల్లాచెదురుగా పడేసారు,పైపు లైన్లు బద్దలుగొట్టడంతో నీరు రోడ్ల పైకి ప్రవహిస్తుంది, ఆటోలు,ఇతర వాహనాలు తగలబెట్టారు,కాలిన వాటి నుండి వచ్చే పొగ చుట్టు పక్కల కమ్మేసింది.
కలకత్తా,హౌరా,హుగ్లీ,మెటియాబుర్జ్,24 పరగణాల్లో ఈ విధ్వంసం కొనసాగింది.మనం పాకిస్థాన్ ని పొందే వరకూ ఈ మారణహోమం కొనసాగాలని పిలుపునిచ్చాడు.
"లాడ్ కె లేంగే పాకిస్థాన్","మార్ కే లేంగే పాకిస్థాన్" అంటూ నినాదాలు చేస్తూ ఆ రాక్షసులు ఈ మారణహోమాన్ని కొనసాగించారు.
జిన్నా ఒక బహిరంగ సభలో రంజాన్ మాసం లో జిహాద్ చాలా గొప్ప పని అని వివరించాడు.మనం వర్షాకాలం మరియు రంజాన్ మాసంలో ఉన్నాం,ఇది దేవుని దయ, దేశాన్ని ప్రక్షాళన చేయడానికి, జిహాద్ పాటించడానికి ఎంతో గొప్ప సమయం ఇది, ముస్లిం లు వర్షాలను లెక్క చేయకుండా ఈ ఏక్షన్ డే ని జరపండి,ఇదే రంజాన్ మాసం లో ఖురాన్ అవతరించింది,బదర్ యుద్ధం, ఇస్లాం మరియు హీథనిజం మధ్య మొదటి సంఘర్షణ యుద్ధం 313 మంది ముస్లిం లు పోరాడి గెలిచారు.ప్రవక్త ఆధ్వర్యంలో 10,000 మంది ముస్లిం లు మక్కాను స్వాధీనం చేసుకుని ఇస్లాం ను స్థాపించి స్వర్గరాజ్యాన్ని ఏర్పాటు చేశారు.అటువంటి పవిత్ర మాసంలో మనం జిహాద్ చేయడం మన అదృష్టం అన్నాడు.అలాగే ముస్లిం లీగ్ కౌన్సిల్ జారీ చేసిన ఒక పత్రం ముస్లిం ల మధ్య పంపిణీ చేయబడింది,దానిలో ఎప్పుడు? ఎక్కడ?దాడి చేయాలో స్పష్టంగా ఉంది,
1.భారతదేశంలోని ముస్లిం లందరూ పాకిస్థాన్ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
2.పాకిస్థాన్ ఏర్పాటు తర్వాత భారతదేశం మొత్తం మనం జయించాలి.
3.భారతదేశంలోని ప్రజలందరినీ ఇస్లాం లోకి మార్చాలి.
4.మొత్తం అన్ని ముస్లిం రాజ్యాలు చేతులు కలపాలి.
5.ప్రతి ఒక్క ముస్లీం ఐదుగురు హిందువుల బాధ్యత తీసుకోవాలి.
6.పాకిస్థాన్ మరియు భారత ముస్లీం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేంత వరకు ప్రతి ఒక్క ముస్లీం ఈ క్రింది చర్యలు తీసుకోవాలి:-
(ఎ) హిందువుల యాజమాన్యం లోని ప్రతి ఒక్క కర్మాగారం మరియు దుకాణాలలో దోపిడీలు చేయాలి, వాటిని నాశనం చేయాలి,దోచుకున్న సొమ్ము లీగ్ కార్యాలయానికి ఇవ్వాలి.
(బి) ముస్లిం లీగర్లందరూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉండాలి.
(సి) జాతీయ వాద ముస్లీం లు ఎవరైనా లీగ్ లో చేరకపోతే వారిని చంపాలి.
(డి) హిందువులను క్రమంగా హత్య చేయాలి మరియు వారి సంఖ్య తగ్గించాలి.
(ఇ) దేవాలయాలన్నీ నాశనం చేయాలి.
(ఎఫ్) భారతదేశం లోని ప్రతి గ్రామంలో ముస్లీం లీగ్ యొక్క గూఢచారులు ఉండాలి.
(జి) కాంగ్రెస్ నాయకులను నెలకొకరిని రహస్యంగా హత్య చేయాలి.
(హెచ్) కాంగ్రెస్ ఉన్నత కార్యాలయాలను వాటిలో రహస్యంగా పని చేస్తున్న ముస్లిం వ్యక్తి నాశనం చేయాలి.
(ఐ)కరాచీ,ముంబై,కలకత్తా, మద్రాస్,గోవా, విశాఖపట్నం నగరాలను ముస్లీం లీగ్ వాలంటీర్లచే డిసెంబర్ 1946 నాటికి స్తంభింపజేయాలి.
(జె)ఆర్మీ,నేవీ, ప్రభుత్వ సర్వీసులు లేదా ప్రైవేటు సంస్థల్లో హిందువుల కింద పని చేయడానికి ముస్లీం లను అనుమతించకూడదు.
(కె) ముస్లీం లు భారత దేశం పై చివరి దండయాత్ర కోసం భారతదేశాన్ని మరియు కాంగ్రెసు ప్రభుత్వాన్ని ముస్లీం లు విధ్వంసం చేయాలి.
(ఎల్) పంజాబ్,సింధ్ మరియు బెంగాల్ లో ముస్లీం లీగర్లకి ఆయుధాలను తయారు చేసి ఇవ్వడానికి ముస్లీం లీగ్ ద్వారా ఆర్ధిక వనరులు అందించబడతాయి.**
(ఎం)ముంబై, కలకత్తా, ఢిల్లీ, లాహోర్,కరాచీ ముస్లిం లీగ్ శాఖలకు ఆయుధాలను పంపిణీ చేయాలి.
(ఎన్) హిందువులను నాశనం చేయడానికి మరియు వారిని భారతదేశం నుంచి తరిమికొట్టడానికి ముస్లీం లీగ్ లోని అన్ని విభాగాలు కనీస ఆయుధాలు, సామగ్రిని,కనీసం జేబులో కత్తిని కలిగి ఉండాలి.
(పి) అక్టోబర్ 18,1946 నుండి హిందూ స్త్రీలు మరియు బాలికలను అత్యాచారం చేసి, కిడ్నాప్ చేసి, ముస్లీం లుగా మార్చాలి.
(క్యూ) హిందూ సంస్కృతి ని నాశనం చేయాలి.
(ఆర్)లీగర్లందరూ హిందువుల పట్ల అన్ని సమయాల్లో కౄరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి మరియు సామాజికంగా, ఆర్థికంగా అనేక ఇతర మర్గాల్లోనూ వారిని బహిష్కరించాలి.
(ఎస్) హిందూ డీలర్ల నుండి ఏ ముస్లీం కొనుగోలు చేయకూడదు. హిందువులు తయారు చేసే వస్తువులన్నీ బహిష్కరించాలి.ముస్లీం లీగర్లందరూ ఈ సూచనలను పాటించి సెప్టెంబర్ 15,1946 లోగా అమలులోకి తీసుకొని రావాలి.
ఇవే కాకుండా బహిరంగంగా
డైరెక్ట్ ఏక్షన్ అంటే రాజ్యాంగేతర పద్ధతులను పాటిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి మార్గంలో అయినా వెళ్తూ, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని చెప్పారు.
ఈ మాటలు విన్న లీగ్ సభ్యులందరూ హిందువుల పైన మరింత రెచ్చిపోయారు.అత్యంత దారుణంగా, బహిరంగంగా హత్యలు, మానభంగాలు జరిగాయి.హిందువుల ఆర్తనాదాలు వినే నాధుడే లేకుండా పోయాడు.వారు తమ జీవితాల్లోనే అత్యంత దుర్మార్గమైన రోజులను చవి చూసారు.ఏ పక్క నుండి చావు వస్తుందో?అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలియక వణికిపోయారు.వాళ్ళు ఇప్పుడు కేవలం వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఎటు చూసినా దౌర్జన్యాలు, దుర్మార్గులు.దయ,కరుణ అనేవి ఎక్కడా కనబడడం లేదు.హిందువులను కాపాడడానికి ఎవ్వరూ రాలేదు.
కలకత్తా లో ఈ హింసాకాండ 72 గంటలు కొనసాగింది.తర్వాత కలకత్తా లో ఎటు చూసినా అత్యంత భయంకరమైన దృశ్యాలే కనిపించాయి.రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి.వ్యాపార సంస్థలు నాశనమయ్యాయి, వాటిలోని వస్తువులు రోడ్ల పైన పడి ఉన్నాయి.భవనాలు కాలిపోయాయి.నీటి పంపులు పగలగొట్టబడ్డాయి.ట్రాఫిక్ లో ఎక్కడ చూసినా కాలి పోయిన ఆటోలు, వాహనాలు అడ్డంగా ఉన్నాయి.
ADVERTISEMET
FunBlast DIY Plastic Building Blocks for Kids Building Blocks Toy for Kids Puzzle Games for Kids, Toys for Children Educational & Learning Toy for Kids, Girls & Boys - (250+ Blocks with 38 Wheels)
Brand | FunBlast |
Manufacturer Minimum Age | 36.00 |
Material | Plastic |
Colour | Multicolor |
Educational Objective | Logical Thinking, Counting Skills, Hand-Eye Coordination, Creative Thinking, Motor Skills, Sorting Skills, Imagination DevelopmentLogical Thinking, Counting Skills, Hand-Eye Coordination, Creative Thinking, Motor Skills, Sorting Skills, Imagination Development |
ఇక శవాలు, అప్పుడే చనిపోయిన శవాలు కొన్ని,ఉబ్బిపోయిన శరీరాలు కొన్ని, నరికివేయబడిన శరీరాలు కొన్ని, కాలవల్లో కొట్టుకుని పోతున్న శరీరాలు కొన్ని,ఖాళీ స్థలాల్లో పేర్చబడిన శరీరాలు కొన్ని ఎటు చూసినా శరీరాలే.ఏ తప్పూ చేయకుండా, ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా, వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయిన అమాయక హిందూ జనాల శరీరాలే ఎటు చూసినా కనిపిస్తున్నాయి.ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం అతను ఎటు చూసినా 3 అడుగుల ఎత్తు పేర్చబడిన శరీరాలే కనిపించాయట.ఆ దృశ్యాలు తాను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు.తర్వాత 3500 వరకు మృత దేహాలను సేకరించారు.ఇంకా వేల మంది మంటల్లో కాలిపోయారు, కాలవల్లో కొట్టుకుని పోయారు, మురుగు కాలువల్లో మునిగి పోయారు, అలాగే కొన్నింటిని బంధువులు తీసుకొని పోయారు,ఒక అంచనా ప్రకారం ఆ మూడు రోజుల్లోనే దాదాపు 10,000 మంది మరణించి ఉంటారు, మరొక 1,00,000 మంది గాయాలపాలయ్యారు, నిరాశ్రయులయ్యారు,ఏ ఆధారం లేని వారయ్యారు, స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది, బంధువులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు.వారి బాధని చూడడానికి,పట్టించుకోడానికి కూడా ఎవరూ లేరు.వారి రోదన అరణ్య రోదన.ఎంతో మంది బలవంతంగా ముస్లిం మతం లోకి మార్చబడ్డారు.
చివరిగా ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే అని దీనికి పేరు పెట్టారు.ఇది హిందువులను ఊచకోత కోసిన అనాగరిక కౄరత్వం.కానీ ఈ చరిత్రని సామాన్యులకు తెలియకుండా దాచి పెట్టారు.
నోఖాలీ మారణహోమం
1937లో భారతదేశం లోని ప్రావిన్స్ లలో ఎన్నికలు జరిగినప్పుడు, బెంగాల్ ప్రావిన్స్ అధికారం ముస్లీం లకు దక్కింది.కానీ హిందూ జమీందారీ వ్యవస్థ కూడా పాలక వర్గం గా ఉండేది.అంతేకాకుండా వీరు విద్య మరియు ఆర్ధికంగా ఎప్పుడూ అభివృద్ధిలోనే ఉన్నారు.కానీ ముస్లిం పాలకులు కొత్త చట్టాలను ఇష్టం లేకపోయినా పాటించవలసి వచ్చింది.హిందువులను ప్రభుత్వ ఉద్యోగాలకు రాకుండా అడ్డుకున్నారు.అప్పటికే ఎప్పటి నుండో అభివృద్ధి చెందిన హిందూ కుటుంబాల పైన,జమీందారుల పైన మనోవేదన తో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ముస్లీం మూకలు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని ప్రకటించడం, వారికి అధికారం లభించడంతో ఇక తమ మనసులో దాగిన కోపాన్ని బయటపెట్టడానికి సరైన సమయం లభించింది అనుకున్నారు.
1946 అక్టోబర్ 10 బెంగాలీ హిందువులంతా ఎంతో పవిత్రంగా, ఆనందంగా జరుపుకునే కోజాగారీ లక్ష్మీ పూజా పవిత్ర దినం అది.ఆ రోజున బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ కూడా) హిందువులంతా స్వాతంత్ర్య ప్రకటన కూడా రావడంతో ప్రతి సంవత్సరం కంటే మరింత ఆనందంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో వారు ఊహించని విధంగా ముస్లీం మూకలు తమ అల్లర్లను మొదలుపెట్టారు.తమ పాత ఈర్షతో పాటు కొత్తగా ముస్లీం లీగ్ నాయకులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ముస్లీం సామ్రాజ్య స్థాపన అనే మత్తు ఎక్కిన ఆ రాక్షస మూకలు రెచ్చిపోయి హిందువుల పైన దాడులు మొదలుపెట్టారు.తమ అరాచకాలకు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అంతకు ముందు కలకత్తా లో జరిగిన "గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే"ని మరవక ముందే దానికి మించిన దారుణ కాండ అక్కడ చోటు చేసుకుంది.పూజ రోజున మొదలైన ఆ దాడులు కొన్ని రోజులు పాటు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి.
హిందూ జమీందార్ల పైన, మార్కెట్ లలోని హిందూ దుకాణాల పైన దాడులు చేసి వారి ఆస్తులు,వస్తువులు దోచుకున్నారు.ఈ దాడులు చాలా ప్రణాళికా బద్ధంగా చోటు చేసుకున్నాయి.ఈ అల్లర్లు నోఖాలీ జిల్లాలో రామ్ గంజ్,బేగంగంజ్,రాయ్ పూర్, లక్ష్మీ పూర్,ఛగల్ నయ్య మరియు శాండ్ విప్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మరియు తిప్పేరా జిల్లాలోని హజిగంజ్,ఫరీద్ గంజ్,చాంద్ పూర్,లక్షం మరియు చౌద్ధగ్రామ్ పోలీస్ స్టేషన్ల పరిధి ప్రాంతాల్లో మొత్తం 2000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ అల్లర్లు కొనసాగాయి.
ఇవి చాలా ప్రణాళికా బద్ధంగా, హిందూ మతాన్ని నాశనం చేయాలి అనే లక్ష్యంతో చేసిన దాడులు.
ఈ దాడుల్లో హిందూ పురుషులను,పిల్లలను అత్యంత పాశవికంగా చంపారు,వారి ఆస్తులను,డబ్బును దోచుకున్నారు.వారి ఇళ్ళని వస్తువులను తగలబెట్టారు.వారి కుటుంబ సభ్యుల ముందే వారిని హత్య చేసారు.మహిళల పైన సామూహిక అత్యాచారాలు, దాడులు జరిగేవి.హిందువుల ఆర్త నాదాలు ఎవ్వరికీ వినిపించలేదు.ఆ ప్రాంతాల్లోని ఎటు వైపు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.హిందువుల శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.మార్కెట్లు నాశనం చేయబడ్డాయి.
మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.వారి కళ్ళ ముందే వారి కుటుంబ సభ్యులను,భర్తలను హింసించి, హింసించి చంపారు.జీవచ్ఛవాలుగా ఉన్న ఆ మహిళల పైన బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసారు.వారి తాళిబొట్లు, నుదుటన బొట్టు తొలగించి ముస్లీం లు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు.అది వారికి ఎన్నో వివాహమో తెలియదు.కేవలం వారిని తమ ఇళ్ళలో ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు అని వారి సొంతం చేసుకున్నారు.అప్పటి వరకు తమ గృహాల్లో ఎంతో గౌరవంగా బ్రతికిన ఆ స్త్రీలు అత్యంత అవమానకరమైన జీవితాలను పొందారు.
ఎటు చూసినా ప్రాణ భయంతో హిందువులు పారిపోతున్నారు.తమ ఆస్తులు,సొమ్ము,ఇళ్ళు అన్నింటినీ వదిలి పారిపోవలసిన దుస్థితి వారికి దాపురించింది.తమ ప్రాణాలను,స్త్రీలను ఎలా కాపాడుకోవాలో తెలియక బెంబేలెత్తిపోయారు.
ఈ హత్యా కాండకి తోడు భయ కంపితులైన హిందువులను మత మార్పిడులు చేసారు.దాదాపుగా 90 శాతం పైనే హిందువులను బలవంతంగా ఇస్లాం మతం లోకి మార్చారు.
మహాత్మా గాంధీ మత సామరస్యం పేరు తో శాంతిని పునరుద్ధరించాలి అని నాలుగు నెలల పాటు నోఖాలీలో పర్యటించారు.కానీ హిందువులకు మాత్రం వారి పైన నమకం కలగలేదు.ఎందుకంటే అతను పర్యటిస్తుండగానే హిందువుల పైన దాడులు కొనసాగాయి,హత్యలు జరిగాయి,స్త్రీల మానభంగాలు ఆగలేదు,బలవంతపు మత మార్పిడులూ పెరిగాయితం మారిన వారి చేత వారి గొడ్లనే చంపి గొడ్డు మాంసం తినిపించారు.పైగా వీటన్నిటికీ తోడు గాంధీ పైన ముస్లీం మూకల కోపం పెరిగింది,తిరిగి వెళ్ళిపోవాలనే డిమాండ్ మొదలైంది, చివరికి అతను నడుస్తున్న దారులను అశుభ్రం చేసేవారు.అతను పర్యటనకి వచ్చారే కానీ హింసని ఆపడానికి ఎటువంటి బలగాలను అక్కడకు పంపలేదు.
హిందువుల పైన ఈ పైశాచిక దాడులు కొనసాగుతూనే, హిందూ ఆలయాల పైన దాడులు చేశారు, తగలబెట్టారు,విగ్రహాలను దొంగిలించారు లేదా పగులగొట్టారు. ఇలా ఈ రాక్షస క్రీడ హిందువులను భయకంపితులను చేస్తూ,వారి మాన ప్రాణాలను దోచుకుంటూ,వారి ఆస్తిపాస్తులను దొంగలిస్తూ కొనసాగింది.గ్రామాల్లో హిందూ వ్యతిరేక పద్యాలు,పాటలు రాస్తూ బహిరంగంగా బజార్లలో వాటిని పాడేవారు.మత్స్యకారుల పైన కూడా నదుల్లో వేట కొనసాగిస్తుండగానే దాడులు చేసేవారు.కాంగ్రేస్ నాయకులను కూడా హత్య చేసి,కార్యాలయాలను దగ్ధం చేశారు.అక్టోబర్ 14 వరకు ఎలాంటి బలగాలను ఆ ప్రాంతాలకు పంపలేదు. అక్టోబర్ 16న బెంగాల్ ప్రధాన మంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రవర్ధి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, దాడులు జరిగాయి అని చెప్తూనే ఎందుకు జరిగాయో తనకు తెలియదని చెప్పాడు.కాలువలు జామ్ అయ్యి, రోడ్లు, వంతెనలు పాడవ్వడం వల్ల బలగాలు వెళ్ళలేకపోయాయి అని చెప్పారు.
దాడుల తర్వాత నోఖాలీలో 30 సహాయ సంస్థలు మరియు ఆరు వైద్య మిషన్ లు సహాయక చర్యలు చేపట్టారు.20శిబిరాలు ఏర్పాటు చేశారు.సహాయ సరుకులు రైలు ద్వారా పంపబడ్డాయి.కోల్కత్తా వచ్చిన బాధితులకు 60 శిబిరాలను ఏర్పాటు చేశారు.అపహరణకి గురైన మహిళలను తిరిగి తీసుకొని రావడం, రైల్వే స్టేషన్ లలో తల దాచుకున్న బాధితులకు సహాయం చేయడం వంటివి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసాయి. గాంధీ హిందూ మహిళల దుస్థితి,బాధితుల గురించి వివరిస్తూ శాంతియుతంగా మత సామరస్యం ఉండాలని కోరారు.
ప్రాణాలతో బయటపడిన వారు తిప్పేరా మరియు నౌఖాలీ నుండి పారిపియారు.ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినప్పుడు ఈ వలసలు ఆగాయి.కానీ 1947 మార్చిలో కాంగ్రెస్ భారత విభజనకి అంగీకరించినప్పుడు మాత్రం భయంతో వారు మళ్ళీ త్రిపుర, అస్సాం మరియు బెంగాల్ నుండి పశ్చిమ బెంగాల్ గా మారబోయే ప్రాంతాలకం భయంతో పారిపోయారు.దాదాపుగా 50,000 మంది శరణార్థులు అస్సాం లోని గౌహతికి పారిపోయారు.వీరిని తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా వీరి పైన దాడులు జరిగాయి.కానీ తర్వాత ఎవ్వరూ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళలేదు.బెంగాల్ ప్రభుత్వం ఏ వార్తా పత్రికలో ఈ వార్తలు రాకుండా చేసారు.పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అపవిత్రం చేయబడ్డాయి,అవమానించబడ్డాయి.అలా ఐదు నెలలు కంటే ఎక్కువ కాలమే ఈ ఊచకోతలు,బలవంతపు మత మార్పిడులు, మానభంగాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మార్చి 20న గ్రామాలలో ముస్లీం లు ఆ నెల 23వ తారీఖున పాకిస్థాన్ దినోత్సవం గా జరుపుకోవాలనీ, ప్రజలంతా రామ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనాపూర్ లో చేరుకోవాలనీ ప్రకటించి గులాం సర్వర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు.ఈ బహిరంగ సభని అప్శటి గాంధీ శాంతి మిషన్ లోని సభ్యులు, గాంధీ ఆపాలనుకున్నారు.కానీ మదర్సాలు,మసీదుల్లో చేసుకోవాలని కోరారు.కానీ పోలీస్ అధికారులు రెహన్ అలీ ఆ సభ ప్రైవేటు స్థలం అమ్తాలి మైదానంలో జరుగుతుందనీ, ప్రభుత్వం దాన్ని ఆపలేదనీ చెప్పారు.ఆరోజు 5000 మంది వరకూ ఆ సభకి హాజరయ్యారు.
ADVERTISEMET
వాటర్ హీటర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
Pigeon Amaze Plus Electric Kettle (14289) with Stainless Steel Body, 1.5 litre, used for boiling Water, making tea and coffee, instant noodles, soup etc. 1500 Watt (Silver)
మొత్తానికి ఈ ఊచకోత లో 5000 మంది హిందువులు చంపబడ్డారు, దాదాపుగా 4 లక్షల హిందూ జనాభా లో 3.5 లక్షల మంది మతం మార్చబడ్డారు.స్త్రీల పైన జరిగిన దాడులకు లెక్కే లేదు. ఇవి కొన్ని లెక్కలు మాత్రమే.
భారత విభజన సమయంలో మారణహోమం
విభజన సమయంలో పాకిస్తాన్ లో 7 మిలియన్ ల హిందువులు, సిక్కు లు చంపబడ్డారు, పారిపోయారు మరియు బలవంతంగా మతం మార్చబడ్డారు.
విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ లోని హిందువులు, సిక్కులు తీవ్రంగా నష్టపోయారు, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.
భారత దేశాన్ని భారత్, పాకిస్థాన్ గా విభజించినప్పుడు 4 మిలియన్ల మంది ముస్లీం లు ఆ దేశం పైన ప్రేమతో పాకిస్థాన్ వెళ్ళిపోయారు.అయితే అక్కడ 7 మిలియన్ ల మంది హిందువులు, సిక్కులు ఆ దేశం నుండి తరిమివేయబడ్డారు.1946 నుండి ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దాడులు పాకిస్థాన్ విభజన తర్వాత మరింతగా పెరిగిపోయాయి.18/12/1946లో మన్సేరా తహసీల్ లోని గర్హి హబిబుల్లాలో ఒక హిందువుని అపహరించి,హత్య చేసారు.అప్పటి నుండి హిందువుల పైన దాడులు పెరుగుతూనే వచ్చాయి.మిలటరీ సకాలంలో రాలేకపోయింది.దాంతో హిందూ, సిక్కులు ఊచకోతకు గురయ్యారు.విచ్చలవిడిగా హత్య గావించబడ్డారు.1946 డిసెంబర్ చివరి నాటికి హవేలియన్ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.ముస్లీం దోపిడీదారుల వల్ల హిందూ, సిక్కులు తమ ఇళ్ళను మరియు ఆస్తులను వదిలి పారిపోవలసి వచ్చింది.పంజాబ్ కి వచ్చి శరణు కోరాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.
అక్కడ హిందువులు మరియు సిక్కులు తమ పైన జరిగే దాడుల గురించి తెలియక ఆనందంగా గడుపుతున్నారు.వారు విభజన తర్వాత తమ ఆస్తులను,ఇళ్ళను చూసుకుంటూ తమ జన్మభూమి లోనే ఉండాలని పాకిస్థాన్ లోనే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.కానీ వారు ఊహించని విధంగా వారి పైన మెరుపు దాడులు జరిగాయి.
పశ్చిమ పంజాబ్ లోని అనేక ప్రాంతాలు హిందువులు మరియు సిక్కులను చంపడానికి లేదా తరిమివేయడానికి చేయవలసిన అన్ని కౄర చర్యలను అవలంబించారు ముస్లీం గూండాలు.
షేక్ పురా హిందువులు మరియు సిక్కులను రావల్పిండి మరియు ముల్తాన్ పాకిస్థానీ మతోన్మాదుల చేతిలో అత్యంత దారుణంగా బాధింపబడ్డారు.అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ దాడులు వల్ల రెండు రోజుల్లోనే 10,000 నుండి 20,000 మంది చనిపోయారు.వారు పారిపోవడానికి కూడా వారి వద్ద చాలా తక్కువ సమయం ఉంది.అయినా సాధ్యమైనంత మంది అక్కడ అన్నింటినీ వదిలి పారిపోయారు.దురదృష్టం ఏంటంటే?దీనిలో పాకిస్థాన్ ఆర్మీ కూడా పాలు పంచుకుంది.ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముస్లీమేతరులను తరిమి కొట్టడానికి ఈ దాడులు చేశారు.అక్కడ నుండి శరణార్ధ శిబిరాలకు తరలివెళ్లారు.అక్కడి నుండి కూడా తరిమివేయబడ్డారు.ప్రతి చోట హిందూ, సిక్కులు పైన దాడులు చేయబడుతున్నాయి,హత్యలు, మానభంగాలు,దహనాలు, దోపిడీలు సర్వసాధారణం అయిపోయాయి.
చివరికి అక్కడ ఇక ఉండలేమనీ, ప్రాణాలు కాపాడుకోవాలంటే పాకిస్థాన్ వదిలి పోవాలనీ నిర్ణయించుకుని హిందూ, సిక్కులు కాలి నడకన భారత్ కి బయలుదేరారు.వారి పైన కూడా దారిలో దాడులు,లూటీలు జరిగాయి.వారు కనీసం తిండి కూడా లేకుండా ఆకలి కడుపులతో, బాధాతప్త హృదయాలతో సర్వం కోల్పోయి అలా నడుచుకుంటూ వస్తున్నారు.చాలా మంది ముఖ్యంగా చిన్న పిల్లలు,ముసలి వాళ్ళు మార్గ మధ్యలో ఆకలితో చనిపోయారు.దారంతా శవాలు కుళ్ళిన కంపు కొడుతోంది.జంతువుల కళేబరాలు మార్గం మొత్తం ఉన్నాయి.ఏ కష్టం తెలియని గొప్ప ధనవంతులు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కొంత మంది రైళ్ళలో ప్రయాణిస్తున్న శరణార్థుల పైన కూడా దాడులు ఆగలేదు.వారు అప్పటికే ఆకలితో అలమటిస్తున్నారు.వాళ్ళని కాల్చి లేదా కత్తులతో చంపి వారి శవాలను రైళ్ళ నిండా భారత్ కి బహుమతి గా పంపారు ఆ రాక్షసులు.
కామోకే వద్ద ఇలాగే ఒక రైలుని ఆపి మగవాళ్ళని చంపి, చిన్న పిల్లలను దయా దాక్షణ్యాలు లేకుండా నేలకేసి కొట్టి చంపి స్త్రీలను ఎత్తుకుపోయారు.శవాలను భారత్ కి పంపారు.వారికి పాకిస్థాన్ మిలట్రీ సహాయపడింది.ముస్లీం మిలిటెంట్ల ఈ దుశ్చర్యలతో పంజాబ్ దగ్దమయ్యింది.
ముస్లీం ల దుశ్చర్యల వల్ల 70 లక్షల మంది ఇలా హత్య చేయబడి,తరిమివేయబడి, అత్యాచారాలకు గురై,అపహరణలకు గురై,తరిమివేయబడినప్పటికీ ఈ దుశ్చర్యల గురించి ఎక్కడా చరిత్రలో రాయలేదు.ఏ మానవ హక్కుల సంఘం దీన్ని ఖండించలేదు.ఎవ్వరూ దీనిని గురించి పట్టించుకోలేదు.ఇది యూదుల పైన జరిగిన దాడుల కంటే పెద్దది.అంతెందుకు ఆ దురదృష్టవంతుల తర్వాత తరాల వారికి కూడా వారి పూర్వీకుల కష్టాల గురించి తెలియదు.
మీర్పూర్ ఊచకోతలు
1947లో పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత అక్కడ హింస నుండి పారిపోయి హిందూ, సిక్కులు కాశ్మీర్ లోని మీర్పూర్ కి తరలి వచ్చారు.1947 ఆగస్టు నుండి మళ్ళీ అక్కడ హింస మొదలైంది.
అబ్దుల్ ఖయ్యూమ్ నాయకత్వం లో ముస్లీం మతోన్మాదులు గ్రూపులుగా ఏర్పడ్డారు.కాశ్మీర్ ని పాకిస్థాన్ లో కలపాలి అంటూ రెచ్చిపోయిన ముస్లీం మూకలు హింసని మొదలుపెట్టారు.దీనిలో బ్రిటిష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పని చేసిన మాజీ సైనికులు కూడా అందులో ఉన్నారు.ఈ తిరుగుబాటు దారుల్లో చాలా మంది తమ కుటుంబాలను పాకిస్థాన్ లోని పంజాబ్ లో వదిలిపెట్టి కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకొని వచ్చారు.
పరిస్థితి చేయి దాటిపోయింది అని మహారాజ హరిసింగ్ మార్షల్ లా ని విధించారు.కాశ్మీర్ లోని డోగ్రా దళాలు సెప్టెంబర్ నెలల్లో తిరుగుబాటు దారులను ఎదుర్కోన్నారు.కానీ ముస్లీం లు తమ పైన దాడి చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు.ఆ వాదనలు అర్ధం లేనివి.దళాలు తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుని వారి ఆధీనంలో ఉన్న నగరాలను స్వాధీనం చేసుకున్నారు.
కానీ తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లీం తిరుగుబాటుదారులు వచ్చారు.వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు.వారు మిలట్రీ లో ఆరితేరిన వారు మరియు ఆధునిక ఆయుధాలను ఉపయోగించడం కూడా తెలుసు.వాళ్ళు 5000 కంటే ఎక్కువ మంది 300 లారీలలో కాశ్మీర్ లోయలోకి ప్రవేశించారు.వారు ఎంత కౄరమైన దాడులు చేసారంటే 14000 మంది హిందూ జనాభా ఉండే బారాముల్లా లో ఊచకోత తర్వాత కేవలం 1000 మాత్రమే మిగిలారు.
కాశ్మీర్ యొక్క చివరి రాజు అయిన మహారాజ హరిసింగ్ ఎలాగైనా జనాన్ని కాపాడాలని అత్యవసర సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాడు.అయితే నెహ్రూ మరియు లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా పత్రం పై సంతకం చేసిన తర్వాత మాత్రమే సైన్యాన్ని పంపుతామన్నారు.
అక్టోబర్ 27,1947 లో కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా పత్రం పై సంతకం చేశారు.కానీ అప్పటికే మీర్పూర్ లో హిందువులు మరియు సిక్కులు ఊచకోతకు గురయ్యారు.
పాకిస్థాన్ నుండి వచ్చిన మతోన్మాదులు మీర్ పూర్ లో ఇళ్ళకు నిప్పు పెట్టి తీవ్రమైన దాడులు చేశారు, దీనికి కాశ్మీర్ సైన్యం తగినంత వేగంగా స్పందించ లేకపోయారు.పాకిస్తాన్ నుండి ఫిరంగులు కూడా కాల్చారు.ఆ దాడిలో వందల మంది అమాయకులు నరకయాతన అనుభవిస్తూ మరణించారు.దాదాపుగా ఇరవై వేల మంది హిందూ సిక్కులను పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసి అలీబేగ్ వైపు ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు.దారిలో పది వేల మంది పురుషులను చంపేశారు,ఐదు వేల మంది స్త్రీలను అపహరించి తీసుకొని వెళ్ళారు.మరొక ఐదు వేల మంది పురుషులు కొండలు,కోనలు దాటుకుంటూ చివరికి జైలు పాలయ్యారు.
ఈ దాడుల్లో పాకిస్థాన్ శరణార్ధులతో సహా దాదాపు ఇరవై వేల మందికి పైగా హత్య చేయబడ్డారు.
అలీబేగ్ గురుద్వారా సాహెబ్ జైలు గా మార్చబడింది.అక్కడ తప్పించుకున్న శరణార్ధులంతా బంధించబడ్డారు తర్వాత ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసారు.లైంగిక దాడులు నుండి కాపాడుకోవడానికి ఆర్య సమాజ్ నిర్వహిస్తున్న హాస్టల్ లోని పాఠశాల విద్యార్థినులను బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేసుకోమని చెప్పారు.అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ముస్లీం మతోన్మాదులు ఊచకోతకి పాల్పడిన తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన బంగారం,నగలు ఇళ్ళ నుండి దోచుకున్నారు.మార్చి 1948లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC)చే అలీబేగ్ జైలు నుండి రక్షించబడే సరికి 1600 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.1951 నాటికి ఆజాద్ కాశ్మీర్ లో మొత్తం 1,14,000 మంది నివాసితులు ఉండగా ఊచకోత తర్వాత 791 మంది సిక్కులు మరియు హిందువులు మాత్రమే మిగిలారు.శరణార్ధులుగా మిగిలిన వారు ఇప్పటికీ అలానే ఉన్నారు.ఎందుకంటే తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లే ధైర్యం కూడా లేదు వారికి.
ఈ అత్యంత పాశవికమైన ఆటవిక దాడులను ఏ మానవ హక్కుల సంస్థ గుర్తించలేదు.ఏ వార్తా పత్రికలో లేదా ప్రసార మాధ్యమాల్లో వీటి గురించి రాయలేదు,ప్రసారం చేయలేదు.వారికి ఎవ్వరూ అండగా నిలబడలేదు.ఇది ఊచకోతకు పాల్పడిన దుర్మార్గుల కంటే అన్యాయం.
ADVERTISEMET
అమేజాన్ లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
Dry Fruit Hub Healthy Raw Seeds Combo For Eating 600gms Pack OF 6 Each 100 gram, (Pumpkin Seeds, Sunflower, Sesame, Chia, Flax Seeds, Watermelon Seeds), Seeds Mix for Eating, All Seeds Combo Pack
Plant or Animal Product Type | Pumpkin, Sunflower |
Brand | DRY FRUIT HUB |
Material Feature | Raw seeds |
Special Feature | Raw |
Weight | 600 Grams |
Units | 600 gram |
Number of Pieces | 600 |
కొన్ని వెబ్సైట్లు వికీపీడియా తో సహా, మరికొన్ని మీడియా సంస్థలు కలకత్తా లో జరిగిన దాడులు హిందూ ముస్లీం లకు జరిగిన మత కల్లోలాలుగా రాసాయి.అలాగే పాకిస్థాన్ లో హిందువుల పైన జరిగిన దాడులు ప్రతీకార చర్యలు అని రాసాయి.వాటి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఈ దుశ్చర్య గురించి మీ అభిప్రాయాలు కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఈ సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఒక్క దేశ విభజన సమయంలోనే కాదు. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్ర వాళ్ళ ఆస్తులను లూటీ చేయడమే కాక ఆంధ్ర వారిని చాలా అవమానపరిచారు.ఈ రాష్ట్ర విభజనకు నిస్సిగ్గుగా అన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మద్దతు ఇచ్చాయి.
ReplyDeleteఈమధ్య కాలంలో తెలంగాణా రాష్ట్రంలో బైంసాలో ఇలాగే హిందువులపై దాడి జరిగితే ఎవరూ పట్టించుకోకోకిల పోగా ఆ సంఘటనని చాలా చిన్నది చేసి ప్రభుత్వం చూపింది.
ఈ పరిస్థితులలో హిందువులకు రక్షణ ఎవరు కల్పిస్తారు? చాలా బాధగా ఉంటుంది. మన హిందువులకూ ఆ దేవుడే రక్ష.
nisam chepparu sir
Delete🙏
ReplyDelete